రష్యా విమానానికి మళ్లీ బాంబు బెదిరింపు
మాస్కో - గోవా విమానానికి మరోసారి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపుతోంది. రష్యా నుంచి గోవాకు బయలుదేరిన ఈ విమానాన్ని అత్యవసరంగా ఉజ్బెకిస్థాన్కు దారి మళ్లించినట్లు గోవా పోలీసులు తెలిపారు.
గోవాలో దిగకుండా ఉజ్బెకిస్థాన్కు మళ్లింపు
పన్నెండు రోజుల్లో రెండో ఘటన
పణజీ, దిల్లీ: మాస్కో - గోవా విమానానికి మరోసారి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపుతోంది. రష్యా నుంచి గోవాకు బయలుదేరిన ఈ విమానాన్ని అత్యవసరంగా ఉజ్బెకిస్థాన్కు దారి మళ్లించినట్లు గోవా పోలీసులు తెలిపారు. 240 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో మాస్కోలో బయల్దేరిన అజుర్ ఎయిర్ విమానం షెడ్యూలు ప్రకారం శనివారం తెల్లవారుజామున 4.15 గంటలకు దక్షిణ గోవాలోని డబోలిమ్ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. ఈ విమానం భారత గగనతలంలోకి రాకముందే.. విమానంలో బాంబు ఉన్నట్లు డబోలిమ్ ఎయిర్పోర్టు డైరెక్టర్కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఈ-మెయిల్ వచ్చింది. దీంతో గోవా విమానాశ్రయ సిబ్బంది, అధికారులు అప్రమత్తం కావడంతో రష్యా విమానాన్ని ఉజ్బెకిస్థాన్కు మళ్లించారు. విమానాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నామని, అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు హోటళ్లలో వసతి సదుపాయం కల్పిస్తున్నట్లు రష్యన్ ఎంబసీ తెలిపింది.
పది రోజుల క్రితం.. గుజరాత్కు మళ్లింపు
జనవరి 9న మాస్కో నుంచి గోవాకు బయలుదేరిన ఇదే అజుర్ ఎయిర్ విమానానికి తొలి బాంబు బెదిరింపు రావడం తెలిసిందే. రష్యాలోని అజుర్ ఎయిర్ కార్యాలయానికి ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో గోవాలో దిగాల్సిన విమానాన్ని గుజరాత్లోని జామ్నగర్ ఎయిర్పోర్టులో అత్యవసరంగా దించేసి తనిఖీలు చేపట్టారు. అది ఉత్తుత్తి బెదిరింపేనని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పెర్మ్ విమానాశ్రయం (రష్యా) నుంచి గోవా మార్గంలోని పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూ బెదిరింపు ఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నట్లు రష్యా రాయబార కార్యాలయం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేపాల్ కరెన్సీ రూ.100 నోటుపై వివాదాస్పద భూభాగాలతో కొత్తపటం
నేపాల్ తన తాజా కరెన్సీ నోటుపై మూడు కొత్త భూభాగాలను చేర్చడం ద్వారా నవీకరించిన దేశ రాజకీయ పటం ముద్రించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. -
జాబిల్లి ఆవలివైపు శిలల కోసం చైనా వ్యోమనౌక
మనకు కనిపించని చందమామ అవతలి భాగం నుంచి మట్టి, శిలలను సేకరించి, భూమికి తెచ్చేందుకు చైనా శుక్రవారం చాంగే-6 అనే వ్యోమనౌకను ప్రయోగించింది. -
వారంలో అంగీకరిస్తే సరే
గాజా కాల్పుల విరమణ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా, ఈజిప్టు, ఖతార్ తెర వెనక ప్రయత్నాలు చేస్తుంటే విరమణకు అంగీకరించాల్సిన హమాస్, ఇజ్రాయెల్ పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకుంటున్నాయి. -
రిషి సునాక్కు ఎదురుదెబ్బ
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి భారీ పరాజయాలు ఎదురవుతున్నాయి. -
2,200కు చేరిన అరెస్టులు
అమెరికా యూనివర్సిటీల్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. రోజుకో యూనివర్సిటీలోకి పోలీసులు ప్రవేశించి ఆందోళనకారులను బయటకు పంపుతున్నారు. -
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
కృత్రిమ మేధ (ఏఐ) క్రమంగా అన్ని రంగాల్లోకీ ప్రవేశిస్తోంది. యుద్ధవిమాన పైలట్గానూ అది ఎదిగింది. తాజాగా ఏఐ నియంత్రిత ఎఫ్-16 ఫైటర్ జెట్ అమెరికాలో గగనవిహారం చేసింది. -
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురి అరెస్టు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా పేర్కొంటూ శుక్రవారం కెనడా పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. -
పీవోకేలో రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 43 మంది ప్రయాణికులతో రావల్పిండి నుంచి గిల్గిత్ వెళుతున్న బస్సు.. డైమెర్ జిల్లాలో కారాకోరం హైవేపై అదుపు తప్పి లోయలో పడింది. -
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ప్రసిద్ధి చెందిన ఆన్లైన్ ఫార్మసీ సంస్థ హిమ్స్ సీఈఓ ఆండ్రూ డుడమ్ ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
-
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
-
వైవాహిక స్థితి ఏదైనప్పటికీ... వయోజనులైన ఇద్దరు ఇష్టపడితే నేరం కాదు: హైకోర్టు
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!