సంక్షోభంలో బ్రిటన్ సర్కారు
మరో 15 మంది మంత్రుల రాజీనామా
అయినా ప్రధానిగా కొనసాగుతానన్న బోరిస్ జాన్సన్
లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో పడింది. ఆయన నాయకత్వంపై విశ్వాసం కోల్పోయిన మంత్రుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఆ పదవి నుంచి జాన్సన్ వైదొలగాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇద్దరు కేబినెట్ మంత్రులు రాజీనామా చేయగా బుధవారం మరో 15 మంది మంత్రులు వారితో జత కలిశారు. దౌత్యాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా వరుస పెట్టి రాజీనామాలు చేస్తున్నారు. బుధవారం నాటికి ప్రభుత్వాన్ని వీడిన వారందరి సంఖ్య 37కి చేరింది. అయితే, విపక్షంతో పాటు స్వపక్షం నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నా ప్రధాన మంత్రి పదవిని వదిలేది లేదని బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు. ఒకవైపున ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం, ఇంకో వైపున రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో దేశం పెనుసవాళ్లను ఎదుర్కొంటోందని, ఇటువంటి తరుణంలో ప్రజలు అప్పగించిన బాధ్యతల నుంచి పారిపోయేది లేదని తేల్చి చెప్పారు. ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్, ఆర్థికశాఖ మంత్రి రిషి సునాక్ మంగళవారం నిమిషాల వ్యవధిలో తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బుధవారం కూడా ఆ పరంపర కొనసాగింది.
* రాజీనామా చేసిన ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రుల స్థానంలో ప్రధాని జాన్సన్ కొత్త మంత్రులను నియమించారు. ఇరాక్ జాతీయుడైన నదిమ్ జహావి (ఆర్థిక), స్టీవ్ బార్క్లే (ఆరోగ్య) కొత్త మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఖాళీ అయిన శాఖలకు కొత్త మంత్రులను నియమించేందుకు ప్రధాని బోరిస్ కసరత్తు చేస్తున్నారు.
దుష్ప్రవర్తన ఆరోపణలున్న క్రిస్ పించర్ వ్యవహారం తెలిసినా కీలక పదవిలో నియమించడంతో తీవ్ర వివాదంలో చిక్కుకున్న ప్రధాని బోరిస్ జాన్సన్...బుధవారం పార్లమెంటులోని ప్రతినిధుల సభలో జరిగిన ప్రశ్నావళి కార్యక్రమంలో మాట్లాడారు. ప్రధాని పదవి నుంచి వైదొలగాలన్న మంత్రులు, స్వపక్ష, విపక్ష ఎంపీల డిమాండ్ను తోసిపుచ్చారు. దేశ, అంతర్జాతీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ ప్రస్తుత సంక్లిష్ట స్థితిలో దేశాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటలు.. వరుస సెలవులతో అనూహ్య రద్దీ
-
Ap-top-news News
Hindupuram: హిందూపురంలో ‘ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం’ రెడీ..
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (14/08/2022)
-
World News
Taliban: కాబుల్లో మహిళల నిరసన.. హింసాత్మకంగా అణచివేసిన తాలిబన్లు!
-
India News
Tiranga Yatra: తిరంగా యాత్ర పైకి దూసుకెళ్లిన ఆవు.. గాయపడ్డ మాజీ ఉపముఖ్యమంత్రి
-
Sports News
Ross Taylor : ఆ మ్యాచ్లో డకౌట్.. రాజస్థాన్ ఫ్రాంచైజీ ఓనర్ నా మొహంపై కొట్టాడు: టేలర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 14 - ఆగస్టు 20)
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- Chennai: విమానంలో వచ్చిన ప్రయాణికుడి వద్ద కొండచిలువలు, తాబేళ్లు, కోతి!
- Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనూహ్య నిర్ణయం..
- Ross Taylor : ఆ మ్యాచ్లో డకౌట్.. రాజస్థాన్ ఫ్రాంచైజీ ఓనర్ నా మొహంపై కొట్టాడు: టేలర్
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- kareena kapoor: వాళ్లే మా సినిమాను ట్రోల్ చేశారు..అందుకే ఇలా! కరీనా కపూర్
- RRR: ఆర్ఆర్ఆర్ టీమ్కు సర్ప్రైజ్ ఇచ్చిన గూగుల్.. ఏం చేసిందంటే?
- ఈ వేలంలో చేదు అనుభవం
- BJP: ఎన్నికల్లో పోటీ చేస్తా.. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా రెడీ: జీవితా రాజశేఖర్