Mary Milliben: నేను భారత మహిళను అయ్యుంటే..?: నీతీశ్ వ్యాఖ్యలపై అమెరికన్ సింగర్ ఫైర్
ప్రముఖ అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్(Mary Milliben).. బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్( Nitish Kumar) చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. అలాగే ప్రధాని మోదీ నాయకత్వాన్ని కొనియాడారు.
వాషింగ్టన్: బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్(Nitish Kumar) ‘జనాభా నియంత్రణ’వ్యాఖ్యలపై ప్రముఖ అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ (Mary Milliben) స్పందించారు. ఆయన మాటలను ఖండించారు. అలాగే ప్రధాని మోదీ(Modi) పాలనను ప్రశంసించారు.
ఇటీవల బిహార్(Bihar)లో నిర్వహించిన కులగణనకు సంబంధించిన నివేదికను రెండురోజుల క్రితం అసెంబ్లీలో ప్రవేశపెట్టే సందర్భంగా నీతీశ్( Nitish Kumar) మాట్లాడుతూ.. ‘చదువుకున్న మహిళకు భర్తను ఎలా నియంత్రించాలో తెలుసు’ అని కొంత అభ్యంతరకర భాషలో మాట్లాడారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఏకంగా ప్రధాని మోదీ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. తాజాగా వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ.. మిల్బెన్ సుదీర్ఘ పోస్టు పెట్టారు.
‘భారత సోదరసోదరీమణులకు నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా మరీ ముఖ్యంగా అమెరికా, భారత్లో 2024 ఎన్నికల సీజన్ మొదలైంది. కాలం చెల్లిన ఆలోచనలకు ముగింపు పలికి ప్రగతిశీల ఆలోచనలను భర్తీ చేసే అవకాశాన్ని ఈ ఎన్నికలు కల్పిస్తాయి. భారత ప్రధాని నరేంద్రమోదీకి ఎందుకు మద్దతు ఇస్తావని, భారత వ్యవహారాలపై ఎందుకంత ఆసక్తి చూపుతావని చాలా మంది నన్ను ప్రశ్నిస్తుంటారు. ఎందుకంటే.. నాకు భారత్ అంటే ప్రేమ. అమెరికా- భారత్ బంధానికి, అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వానికి మోదీ నాయకత్వం సరైనది’ అని మోదీ(Modi) నాయకత్వాన్ని కొనియాడారు.
బ్రిటన్ ప్రధాని ఇంట దీపావళి సంబరాలు
‘ప్రస్తుతం ఇండియా ఒక కీలకమైన సమయాన్ని ఎదుర్కొంటోంది. బిహార్లో మహిళలకు విలువనివ్వడమనేది సవాలుగా మారింది. దీనికి ఒకటే సమాధానం ఉందని నా నమ్మకం. నీతీశ్జీ వ్యాఖ్యల తర్వాత.. బిహార్ ముఖ్యమంత్రి పదవి కోసం ఒక ధైర్యవంతురాలైన మహిళ ముందుకు రావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. నేను భారతీయ మహిళను అయ్యుంటే.. బిహార్కి వెళ్లి ముఖ్యమంత్రి పదవికి పోటీ చేసుండేదాన్ని. నీతీశ్ కుమార్ రాజీనామా చేయాల్సిన సమయం వచ్చిందనుకుంటున్నాను. ‘జవాన్’ సినిమాలో ఎస్ఆర్కే(షారుక్ ఖాన్) ‘ఓటు వేయండి, మార్పు తీసుకురండి’ అని సూచించారు. బిహార్ ప్రజలకు నేను కూడా ఇదే సూచిస్తున్నాను’ అని మిల్బెన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రఖ్యాత అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ (Mary Milliben)కు కొత్తగా పరిచయం అవసరం లేదు. కొద్దినెలల క్రితం అమెరికాలో ప్రధాని మోదీ (PM Modi) అధికారిక పర్యటన ముగింపు కార్యక్రమంలో మేరీ మిల్బెన్ భారత జాతీయ గీతం ‘జనగణమన’ ఆలపించారు. అనంతరం ప్రధాని పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
కృత్రిమ మేధ (ఏఐ) క్రమంగా అన్ని రంగాల్లోకీ ప్రవేశిస్తోంది. యుద్ధవిమాన పైలట్గానూ అది ఎదిగింది. తాజాగా ఏఐ నియంత్రిత ఎఫ్-16 ఫైటర్ జెట్ అమెరికాలో గగనవిహారం చేసింది. -
నేపాల్ కరెన్సీ రూ.100 నోటుపై వివాదాస్పద భూభాగాలతో కొత్తపటం
నేపాల్ తన తాజా కరెన్సీ నోటుపై మూడు కొత్త భూభాగాలను చేర్చడం ద్వారా నవీకరించిన దేశ రాజకీయ పటం ముద్రించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. -
జాబిల్లి ఆవలివైపు శిలల కోసం చైనా వ్యోమనౌక
మనకు కనిపించని చందమామ అవతలి భాగం నుంచి మట్టి, శిలలను సేకరించి, భూమికి తెచ్చేందుకు చైనా శుక్రవారం చాంగే-6 అనే వ్యోమనౌకను ప్రయోగించింది. -
వారంలో అంగీకరిస్తే సరే.. లేకపోతే రఫాపై దండయాత్రే
గాజా కాల్పుల విరమణ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా, ఈజిప్టు, ఖతార్ తెర వెనక ప్రయత్నాలు చేస్తుంటే విరమణకు అంగీకరించాల్సిన హమాస్, ఇజ్రాయెల్ పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకుంటున్నాయి. -
రిషి సునాక్కు ఎదురుదెబ్బ
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి భారీ పరాజయాలు ఎదురవుతున్నాయి. -
2,200కు చేరిన అరెస్టులు
అమెరికా యూనివర్సిటీల్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. రోజుకో యూనివర్సిటీలోకి పోలీసులు ప్రవేశించి ఆందోళనకారులను బయటకు పంపుతున్నారు. -
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురి అరెస్టు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా పేర్కొంటూ శుక్రవారం కెనడా పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. -
పీవోకేలో రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 43 మంది ప్రయాణికులతో రావల్పిండి నుంచి గిల్గిత్ వెళుతున్న బస్సు.. డైమెర్ జిల్లాలో కారాకోరం హైవేపై అదుపు తప్పి లోయలో పడింది. -
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ప్రసిద్ధి చెందిన ఆన్లైన్ ఫార్మసీ సంస్థ హిమ్స్ సీఈఓ ఆండ్రూ డుడమ్ ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగూల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
-
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
-
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!