Rishi Sunak: బ్రిటన్ ప్రధాని ఇంట దీపావళి సంబరాలు
బ్రిటన్లో అప్పుడే దీపావళి (Diwali) సంబరాలు షురూ అయ్యాయి. ఆ దేశ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) స్థానిక హిందువులతో కలిసి ఈ వేడుకలను జరుపుకున్నారు.
లండన్: విదేశాల్లోని భారతీయులు అప్పుడే దీపావళి వేడుకలు మొదలుపెట్టారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అక్కడి హిందువులతో కలిసి పండుగ సంబరాలు జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
దీపావళి సందర్భంగా ప్రధాని రిషి సునాక్ తన నివాసం 10-డౌనింగ్ స్ట్రీట్లో హిందువులకు ఆతిథ్యమిచ్చారు. వారితో కలిని దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన సతీమణి అక్షతామూర్తితో కలిసి దీపాలు వెలిగించారు. దీనికి సంబంధించిన చిత్రాలను ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్టు చేసింది. దీనిలో ప్రపంచంలోని ప్రతీ ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల రిషి సునాక్ భారత్ ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించుకున్నారు. భారత్-బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం జరుగుతున్న చర్చల్లో పురోగతిని కూడా సమీక్షించారు. అంతేకాకుండా, ప్రపంచ కప్లో టీమ్ ఇండియా సాధిస్తున్న విజయాలను సునాక్ అభినందించారు.
కమలా హారిస్ నివాసంలోనూ వేడుకలు..
అటు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా తన అధికారిక నివాసంలో దీపావళి వేడుకలు చేసుకున్నారు. దీపాలు వెలిగించిన అనంతరం ఆమె అక్కడికి విచ్చేసిన అతిథులతో మాట్లాడారు. ఈ పండుగ తనకు ఎంతో ముఖ్యమైందని ఆమె అన్నారు. ఇది వెలుగు చీకటి మధ్య వ్యత్యాసాన్ని తెలుపుతుందన్నారు. ఈ సందర్భంగా హమాస్పై ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న యుద్ధం గురించి ఆమె ప్రస్తావించారు. గాజా ప్రజలకు మానవతా సహాయం అందించడానికి అమెరికా మద్దతు ఇస్తున్నట్లు హారిస్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరింత సంపన్నులైన రిషి, అక్షతా దంపతులు
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తిలు మరింత సంపన్నులు అయ్యారు. -
అధ్యక్ష పదవికి భారతీయ అమెరికన్ పోటీ!
పాలక డెమోక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా (47) మున్ముందు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఉందని ఆయన సహచరులు భావిస్తున్నారు. -
2050 నాటికి పెరగనున్న ఆయుర్దాయం
ప్రపంచవ్యాప్తంగా 2022 నుంచి 2050 మధ్య ఆయుర్దాయం పురుషుల్లో 5 సంవత్సరాలు, మహిళల్లో 4 ఏళ్లు పెరుగుతుందని లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం అంచనా వేసింది. -
ఉత్తర గాజాలో హోరాహోరీ
గాజాలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య పోరు హోరాహోరీ సాగుతోంది. ముఖ్యంగా ఉత్తర గాజాలో జబాలియా కేంద్రంగా దాడులు, ప్రతిదాడులు భారీస్థాయిలో కొనసాగుతున్నాయి. -
ఆగ్నేయాసియాలో రక్తపోటు బాధితులు 29.4 కోట్ల మంది : డబ్ల్యూహెచ్వో
అధిక రక్తపోటు కారణంగా గుండె పోటు, పక్షవాతం, క్యాన్సర్ల లాంటి సాంక్రమికేతర వ్యాధులతో పాటు మరణం, వైకల్యం సంభవించే ముప్పు ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఆగ్నేయాసియా రీజనల్ డైరెక్టర్ సైమా వాజెడ్ చెప్పారు. -
ఖర్కీవ్ను ఆక్రమించే ప్రణాళికల్లేవ్
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో బఫర్ జోన్ ఏర్పాటే అక్కడ తమ తాజా దాడుల లక్ష్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. -
నరమేధానికి పాల్పడలేదు
గాజాలో తాము నరమేధానికి పాల్పడుతున్నామన్న ఆరోపణలను ఇజ్రాయెల్ తిరస్కరించింది. పౌరుల భద్రత కోసం అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అంతర్జాతీయ న్యాయస్థానానికి (ఐసీజే) తెలిపింది. -
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి
యువకుడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. ఎట్టకేలకు ఓ సోషల్ మీడియా పోస్టు ఆధారంగా బాధితుడిని రక్షించారు. -
ఉ.కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
ఉత్తరకొరియా మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. శుక్రవారం స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణకొరియా ధ్రువీకరించింది. -
పర్యావరణ హితులకు యూఏఈ ‘బ్లూ రెసిడెన్సీ వీసా’లు
పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతను ప్రోత్సహించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. -
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
Elon Musk: మరో 30 ఏళ్లలో అంగారక గ్రహంపై ఏర్పాటయ్యే నగరంలో మనుషులు జీవిస్తారని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అంచనా వేస్తున్నారు.