AP News: క్రమబద్ధీకరణ పేరిట ఒప్పంద ఉద్యోగులకు జగన్‌ దగా!

క్రమబద్ధీకరణ పేరిట ఒప్పంద ఉద్యోగులను జగన్ నిలువునా మోసం చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికి భిన్నంగా వివిధ నిబంధనల సాకును చూపి రెగ్యులరైజ్‌కు ఉత్తర్వులు ఇచ్చి నయవంచనకు పాల్పడ్డారు.

Updated : 23 Apr 2024 11:05 IST

ఏపీలో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌.. వీలైనంత ఎక్కువ మంది ఒప్పంద ఉద్యోగుల ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని ఊరించారు. క్రమబద్ధీకరణకు చట్టం తీసుకొచ్చి, ఉత్తర్వులు ఇచ్చి వారితో క్షీరాభిషేకం చేయించుకున్నారు. తర్వాత రకరకాల సాకులు చూపుతూ రెగ్యులరైజ్‌ చేయాల్సిన ఒప్పంద ఉద్యోగుల సంఖ్యను తగ్గించేశారు. కొందరి ఉద్యోగాలనే క్రమబద్ధీకరించారు. అదీ ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడానికి కొన్నిరోజుల ముందే. ‘కోడ్‌’ వచ్చేసిందంటూ మిగిలినవారి ఆశలను అడియాసలు చేసి తన మాయమాటలతో మోసగించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు