Sharmila: జగన్ ఆదేశాల మేరకే వైఎస్ఆర్పై పొన్నవోలు పిటిషన్లు..!: వైఎస్ షర్మిల
అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల స్పందించారు. జగన్పై ఆయన స్వామిభక్తిని చాటుకున్నారని ఎద్దేవా చేశారు.
Published : 28 Apr 2024 12:40 IST
జగన్ ఆదేశాల మేరకే అక్రమాస్తుల కేసు ఎఫ్ఐఆర్లో వైఎస్ఆర్ పేరును ఛార్జిషీట్లో చేర్చాలని 3 కోర్టుల్లో పొన్నవోలు సుధాకర్రెడ్డి పిటిషన్లు వేశారని వైఎస్ షర్మిల (Sharmila) ఆరోపించారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్పై పొన్నవోలు స్వామిభక్తిని చాటుకున్నారని ఎద్దేవా చేశారు. ‘‘2019 మే 30న జగన్ సీఏంగా పదవి చేపట్టిన 6 రోజుల్లోనే జూన్ 6న పొన్నవోలుకు ఏఏజీ పోస్టు కట్టబెట్టారు. ఏ సంబంధమూ లేకపోతే పొన్నవోలుకు ఏఏజీగా ఎందుకు అవకాశం ఇచ్చారు?హడావుడిగా ఆ మేలు చేశారంటే మీకోసం పనిచేసినట్లేగా?’’ అని జగన్ను ఉద్దేశించి షర్మిల వ్యాఖ్యానించారు.