AP News: రైతుల గుండెలపై ‘భూ’కుంపటి పెట్టిన జగన్‌ సర్కారు

సరైన ప్రణాళిక, పారదర్శకత లేకుండా భూముల రీ-సర్వే పేరుతో జగన్ ప్రభుత్వం చేస్తున్న రాక్షస చర్య అన్నదాతలకు అంతులేని ఆవేదన కలిగిస్తోంది. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్నవారి మధ్య ఆరని చిచ్చు పెడుతోంది. రీసర్వేతో భూవిస్తీర్ణాల్లో భారీగా కోత పడగా.. క్రయ, విక్రయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

Updated : 10 May 2024 19:58 IST

తండ్రి ఇచ్చిందో.. తాత ద్వారా వచ్చిందో.. రెక్కలుముక్కలు చేసుకుని సంపాదించుకుందో.. ఎకరమో, అరెకరమో.. కంటికి రెప్పలా చూసుకుంటున్న భూమి.. కన్నతల్లిలా కాపాడుకుంటున్న భూమిని ఎవరో వచ్చి అందులో కొంతభాగం నీది కాదు పొమ్మంటే.. కాళ్ల కింద భూమి కదిలిపోదా? గుండె పగిలిపోదా? ఆవేశం కట్టలు తెంచుకోదా? ఇప్పుడు రాష్ట్రంలో లక్షలాది మంది రైతుల పరిస్థితి ఇదే. సరైన ప్రణాళిక, పారదర్శకత లేకుండా రీ-సర్వే పేరుతో జగన్ ప్రభుత్వం చేస్తున్న ఈ రాక్షస చర్య అన్నదాతలకు అంతులేని ఆవేదన కలిగిస్తోంది. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్నవారి మధ్య ఆరని చిచ్చు పెడుతోంది. రీసర్వేతో భూవిస్తీర్ణాల్లో భారీగా కోత పడగా.. క్రయ, విక్రయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

Tags :

మరిన్ని