
తెలంగాణ
ఈనాడు, హైదరాబాద్: సాగు, తాగునీటి అవసరాలపై చర్చించేందుకు ఈ నెల 9న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహిస్తోంది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురే సోమవారం ఏపీ జలవనరుల శాఖ, తెలంగాణ నీటిపారుదల శాఖల ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ)లకు లేఖలు రాశారు. ఆన్లైన్లో నిర్వహించనున్న ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.