బ్రేకింగ్

breaking
12 Nov 2021 | 17:37 IST

వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే!

తాడేపల్లి: ఏపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు వైకాపా అభ్యర్థులను ప్రకటించింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఇందుకూరి రఘురాజు (విజయనగరం జిల్లా), వరుదు కల్యాణి (విశాఖ జిల్లా), వంశీకృష్ణ యాదవ్‌ (విశాఖ 2)‌, అనంతబాబు (తూ.గో జిల్లా), తలశిల రఘురామ్‌ (కృష్ణా జిల్లా), అరుణ్ కుమార్‌ (కృష్ణా 2) ,ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (గుంటూరు జిల్లా), ఎం.హనుమంతరావు (గుంటూరు 2), భరత్‌ (చిత్తూరు జిల్లా), వై.శివరామరెడ్డి (అనంతపురం), మాధవరావు (ప్రకాశం)కు అవకాశం కల్పించారు.

మరిన్ని

తాజా వార్తలు