icon icon icon
icon icon icon

Varun Tej: ప్రజలే పవన్‌ కల్యాణ్‌ కుటుంబ సభ్యులు: వరుణ్‌ తేజ్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ప్రజలే కుటుంబ సభ్యులని సినీనటుడు వరుణ్‌ తేజ్‌ అన్నారు. 

Updated : 27 Apr 2024 21:47 IST

పిఠాపురం: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ప్రజలే కుటుంబ సభ్యులని సినీనటుడు వరుణ్‌ తేజ్‌ అన్నారు. పవన్‌ పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో ఆయనకు మద్దతుగా వరుణ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత ఎన్నికల్లో విజయం సాధించకపోయినా.. ప్రజలకు ఆయన మేలు చేస్తున్నారని అన్నారు. అప్పులు చేసి మరీ కౌలు రైతులకు సాయం చేస్తున్నారని చెప్పారు. ఈ సారి ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు మరింత సేవ చేస్తారన్నారు. ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

పిఠాపురంలో ఘనస్వాగతం..

పిఠాపురం విచ్చేసిన వరుణ్‌ తేజ్‌కు తెదేపా, భాజపా, జనసేన నేతలు ఘనస్వాగతం పలికారు. నాగబాబు, వరుణ్‌..  పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామి, దత్తాత్రేయుడు, పురుహూతికా అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గొల్లప్రోలు మండలం తాటిపర్తి, కొడవలి, చెందుర్తి గ్రామాలలో బైకు ర్యాలీ, రోడ్డు షో లో పాల్గొన్నారు. దుర్గాడలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img