బ్రేకింగ్

breaking
29 Sep 2022 | 19:06 IST

హరీశ్‌రావు.. ఏపీకి వచ్చి చూస్తే తెలుస్తుంది: బొత్స

అమరావతి: ఉపాధ్యాయుల పట్ల ఏపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని, కేసులు పెట్టి లోపల వేస్తుందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ‘‘హరీశ్‌రావు మా ప్రభుత్వంపై మాట్లాడి ఉండకపోవచ్చు. ఒక్కసారి వారు ఏపీకి వచ్చి చూస్తే టీచర్లకు మేం చేసినవి కనిపిస్తాయి. ఏపీలో ఉపాధ్యాయులందరూ సంతోషంగా ఉన్నారు. ఏపీ, తెలంగాణలో ఇచ్చిన పీఆర్‌సీలలో తేడా చూస్తే మీకే అర్థమవుతుంది’’ అని మంత్రి బొత్స అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు