బ్రేకింగ్

breaking
05 May 2024 | 17:26 IST

తెలంగాణలో 10 స్థానాల్లో విజయం ఖాయం: అమిత్ షా

కాగజ్‌నగర్‌: కేంద్రంలో మరోసారి మోదీ సర్కారు వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో రెండు విడతల పోలింగ్‌ ముగిసింది. తొలి రెండు విడతల్లో భాజపా సెంచరీ కొడుతుంది. తెలంగాణలో కొన్నాళ్లుగా భాజపాకు ఓట్ల శాతం పెరుగుతోంది. ఈసారి రాష్ట్రంలో పది ఎంపీ సీట్లలో విజయం సాధిస్తాం. గతంలో భారాస అవినీతి చేసేది..ఇప్పుడు కాంగ్రెస్‌ చేస్తోంది’’ అని అమిత్‌ షా విమర్శించారు.

మరిన్ని

తాజా వార్తలు