బ్రేకింగ్

breaking
05 May 2024 | 17:47 IST

సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం

అమరావతి: వైకాపా సోషల్‌మీడియా ఇన్‌ఛార్జి సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఎన్నికల సంఘం ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ తెదేపా ఈసీకి ఫిర్యాదు చేసింది. ఇంటింటికీ పింఛన్లు అందకపోవడానికి చంద్రబాబే కారణమంటూ ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ఓటర్లు, పింఛనుదారులను తప్పుదోవ పట్టించారని పేర్కొంది. తెదేపా ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఈసీ.. విచారణ చేసి వెంటనే నివేదిక ఇవ్వాలని సీఐడీ డీజీని ఆదేశించింది.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని