దిల్లీ: వంటింటి అవసరాలైన ఉల్లి, ఆలు ధరలు తగ్గడంతో డిసెంబర్లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) 1.22 శాతానికి తగ్గింది. నవంబర్లో ఇది 1.55%, 2019 డిసెంబర్లో 2.76 శాతంగా ఉండేదని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. దీంతో 2020 నవంబర్లో 4.27 శాతంగా ఉన్న డబ్ల్యూపీఐ ఆహార సూచీ 2020 డిసెంబర్కు 0.92 శాతానికి తగ్గిపోవడం గమనార్హం.
డిసెంబర్లో కూరగాయాల టోకు ధరలు (-) 13.2 శాతానికి తగ్గాయని ప్రభుత్వం తెలిపింది. నవంబర్లో ఇది 12.24 శాతంగా ఉండేదని వెల్లడించింది. నవంబర్లో 115.12 శాతంగా ఉన్న బంగాళాదుంపల ద్రవ్యోల్బణం డిసెంబర్కు 37.75 శాతానికి తగ్గింది. అంతకుముందు నెలతో పోలిస్తే వరి, ధాన్యాలు, గోధుమలు, పప్పుల ద్రవ్యోల్బణం రేటు డిసెంబర్లో మరింత తగ్గింది.
ఆహార ధరల ద్రవ్యోల్బణం కాస్త తగ్గుతుండగా డిసెంబర్లో తయారీ ఉత్పత్తుల ధరలు మాత్రం 4.24 శాతానికి పెరిగాయి. నవంబర్లో ఇది 2.97 శాతంగా ఉండటం గమనార్హం. ఫలితంగా ఆహార వస్తువు, పానీయాలు, వస్త్రాలు, రసాయనాలు, ఔషధాలు, సిమెంటు ధరలు పెరిగాయి. ఇంధనం, విద్యుత్ ధరలు సైతం స్వల్పంగా పెరిగాయి. కాగా డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం సైతం 4.59 శాతానికి తగ్గిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి
అసలు ఎంత పొదుపు చేయాలి?
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?