‘ఛత్రపతి’ రీమేక్.. చిత్రబృందం ఇబ్బందిపడుతోందా..?
ముంబయి: కుటుంబకథా చిత్రాల్లో నటించి టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్లో సైతం తన లక్ను పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. సూపర్హిట్ చిత్రం ‘ఛత్రపతి’ హిందీ రీమేక్లో శ్రీనివాస్ కథానాయకుడిగా నటించనున్నారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఆయన అన్నివిధాలుగా సిద్ధమవుతున్నారు. మరికొన్ని రోజుల్లో పట్టాలెక్కనున్న ఈ రీమేక్కు సంబంధించి ఓ విషయంలో చిత్రబృందం కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ విషయమేమిటంటే.. కథానాయిక ఎంపిక.
భారీ ప్రాజెక్ట్గా ఎన్నో అంచనాల నడుమ రానున్న ‘ఛత్రపతి’ రీమేక్లో శ్రీనివాస్ సరసన కథానాయికగా ఎవరు నటించనున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ క్రమంలోనే బాలీవుడ్కు చెందిన పలువురు స్టార్ హీరోయిన్స్ పేర్లు కూడా తెరపైకి వచ్చినప్పటికీ వాళ్లు మాత్రం రీమేక్లో నటించడానికి ఆసక్తి కనబర్చడం లేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్యా పాండే ఈ రీమేక్లో నటించే అవకాశమున్నట్లు బాలీవుడ్లో టాక్. ఆమెతో ఈ ప్రాజెక్ట్ ఆఫర్ గురించి చెప్పమని చిత్రబృందం ఇప్పటికే ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ను సంప్రదించిందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘లైగర్’లో ప్రస్తుతం అనన్య నటిస్తున్నారు. ఆ చొరవతోనే ఆమెకు ‘ఛత్రపతి’ రీమేక్ గురించి చెప్పమని చిత్రబృందం పూరీని కోరినట్లు వినికిడి.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘జాతిరత్నాలు’ ట్రైలర్: కడుపుబ్బా నవ్వాల్సిందే!
-
ప్రేమ కథలు పక్కనెట్టి.. యాక్షన్ బాట పట్టి
-
‘లవ్ లైఫ్’ పకోడీ లాంటిది!
-
తీసేవాడుంటే ప్రతివాడి బతుకు బయోపిక్కే..!
-
‘సైనా’ రాకెట్తో పరిణీతి!
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఒక్కోసారి బాధేస్తుంది..కానీ: రాజ్తరుణ్
- అందుకే సీరియల్స్లో నటించడం లేదు: సాగర్
-
అలా చేసినందుకే పరాజయాలు..!
- పవన్..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం!
-
మర్డర్ మిస్టరీల్లో ‘క్లైమాక్స్’ ఓ ప్రయోగం!
కొత్త పాట గురూ
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
‘పాప ఓ పాప’ వచ్చేసింది..!
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్దే’ సాంగ్!
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని