
తాజా వార్తలు
కాకినాడలో ఐదేళ్ల బాలికపై అఘాయిత్యం
మసీదుసెంటర్: ఇంట్లో నిద్రిస్తున్న ఐదేళ్ల బాలికను ఓ గుర్తుతెలియని కామాంధుడు ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన బుధవారం తెల్లవారుజామున కాకినాడలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గోళీలపేటకు చెందిన పిల్లి రాజుకు ఇద్దరు కుమార్తెలు. రాజు కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బాలిక తల్లి కుటుంబపోషణ నిమిత్తం హైదరాబాద్లో ఉంటున్నారు. పిల్లలు వారి అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న రాజు పెద్దకుమార్తె అయిన ఐదేళ్ల బాలికను అర్ధరాత్రి సమయంలో ఓ కామాంధుడు ఎత్తుకెళ్లాడు. గోళీలపేట శివారు శ్మశానవాటిక వద్దగల తుప్పల్లోకి తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా అత్యాచారం చేశాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాలికను అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి చూసి కుటుంబసభ్యులకు అప్పగించాడు. చిన్నారిని వెంటనే చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
బాలికను పరామర్శించిన జిల్లా ఎస్పీ
జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాలికను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ పరామర్శించారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని త్వరలోనే అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఎస్పీతో పాటు ఐసీడీఎస్ పీడీ విజయలక్ష్మి, మరో అధికారి వెంకట్, ఇతర పోలీసు అధికారులు ఉన్నారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- వైట్హౌస్లో విచిత్ర పెంపుడు జంతువులు!
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- ఇక చాలు
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- అందరివాడిని
- సాహో భారత్!
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
