logo

అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం

 గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Published : 26 Apr 2024 06:18 IST

ఇద్దరి దుర్మరణం.. 15 మందికిపైగా గాయాలు
బడాపహాడ్‌కు వెళ్తుండగా ఘటన 

బోల్తాపడిన వాహనం

నిజామాబాద్‌ రూరల్‌, న్యూస్‌టుడే:  గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వర్ని మండలం బడాపహాడ్‌కు 30 మందికి పైగా భక్తులతో వెళ్తున్న డీసీఎం బోల్తాపడింది. ఈ ఘటనలో క్యాబిన్‌లో కూర్చున్న పురుషుడు అక్కడికక్కడే మృతిచెందగా, నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించాక ఓ మహిళ మరణించారు. గాయపడిన 15 మంది క్షతగాత్రులను జీజీహెచ్‌కు తరలించారు. ఇందులో ఐదుగురికి తీవ్రమైన గాయాలు అయ్యాయని, పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌ తెలిపారు. గాయపడిన వారిలో చిన్నారులు, మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. వీరంతా కమ్మర్‌పల్లి మండలానికి చెందిన వారు. భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు విషయం తెలియడంతో ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని