
ప్రధానాంశాలు
ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం
కొట్టి.. గదిలో బంధించిన భర్త
ఎలుకల మందు మింగి మహిళ, యువకుడి మృతి
నిడదవోలు, న్యూస్టుడే: వివాహేతర సంబంధం పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరి ప్రాణాలను బలిగొంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు తంగెళ్లమూడికి చెందిన కుసుమ నాగసాయి(30)కి 2014లో నిడదవోలు మండలం తాళ్లపాలేనికి చెందిన వ్యక్తితో పెళ్లయింది. అయితే, అంతకుముందే ఆమె ఏలూరు గన్బజార్కు చెందిన షేక్ నాగూర్ (28)ని ప్రేమించారు. పెళ్లయిన తర్వాత కూడా వాళ్లిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగింది. నాగూర్ మధ్యమధ్యలో నిడదవోలు వచ్చి ఆమెను కలిసి వెళ్లేవాడని స్థానికులు చెబుతున్నారు. ఆదివారం కూడా అలాగే తాళ్లపాలెం రాగా.. వీరికి కుసుమ బంధువు ఒకరు గది ఇచ్చారు. వీరిద్దరూ గదిలో ఉన్న విషయం భర్తకు తెలియడంతో స్థానికులను తీసుకుని ఆ ఇంటి వద్దకొచ్చి వారిని బంధించారు. వారిద్దరినీ కొట్టి.. శెట్టిపేటలోని తమ బంధువుల ఫాస్ట్ఫుడ్ సెంటర్కు ఆనుకుని ఉన్న గదిలో బంధించారు. అక్కడే వాళ్లిద్దరూ గదిలో ఉన్న ఎలుకల మందు మింగారు. కొద్దిసేపటికి గదిలో చూడగా కుసుమ అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆమెను నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. మరి కొద్దిసేపటికి నాగూర్ కూడా ఆ గదిలో మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. భయంతో వారే ఎలుకల మందు తిన్నారా.. లేదా వేరే ఏమైనా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దాంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని
సినిమా
- Coronavaccine ఎవరెవరు వేసుకోకూడదు!
- ప్రేమించిన వ్యక్తితో కూతురు వెళ్లిపోయిందని...
- వైరస్ ప్రభావం త్వరలో తారస్థాయికి
- పిల్లల్లో పెరుగుతున్న ముప్పు
- ఆక్సిజన్ లీకై సరఫరా నిలిచి 22మంది మృతి
- ‘హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రే’
- Horoscope: ఈ రోజు రాశి ఫలం
- నేను ఎస్టీ కాదని రుజువు చేయగలరా?
- నిస్సహాయులుగా మారాం: ఓ వైద్యురాలి భావోద్వేగం
- Tiktok స్టార్ భార్గవ్ చిప్పాడ అరెస్ట్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
