
తాజా వార్తలు
భాగ్యలక్ష్మి ఆలయంలో అమిత్ షా పూజలు
హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి అమిత్షా హైదరాబాద్ పర్యటన కొనసాగుతోంది. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్షాకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పరిపూర్ణానంద స్వామి, పలువురు పార్టీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమిత్ షాతో పాటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు ఉన్నారు.
అమిత్ షా రాక నేపథ్యంలో చార్మినార్ ప్రాంతం కాషాయమయమైంది. భారీగా తరలి వచ్చిన భాజపా శ్రేణులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం అమిత్ షా వారాసిగూడ చేరుకున్నారు. అక్కడి చౌరస్తా నుంచి హనుమాన్ టెంపుల్ సీతాఫల్మండీ వరకు రోడ్షోలో పాల్గొన్నారు. భాజపా, జనసేన కార్యకర్తుల రోడ్షోలో భారీగా పాల్గొన్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
- అలా చేస్తే భారత్దే విజయం: గావస్కర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
