
తాజా వార్తలు
తెలంగాణలో కొత్తగా 249 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 28,953 కరోనా నిర్థరణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 249 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,91,367కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,575కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 417 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,85,519కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,273 ఉండగా వీరిలో 2,381 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 74,28,389కి చేరింది.
ఇవీ చదవండి..
ఇలా వైరస్ను గుర్తిస్తుంది.. అలా దాడి చేస్తుంది
Tags :