
తాజా వార్తలు
అమరావతి: నగరపాలక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని తెదేపా ప్రభుత్వం గతంలో ప్రణాళికలు సిద్ధం చేస్తే సీఎం జగన్ అప్పుడు అడ్డుపడ్డారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఈ మేరకు లోకేశ్ ట్వీట్ చేశారు. ‘‘మీరు, మీ పవిత్ర పత్రిక గతంలో తెలుగు పరిరక్షణ కోసం యుద్ధం చేశారు.. గుర్తులేదా? నగరపాలక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని తెదేపా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తే ఆరోజు మీరు అడ్డుపడ్డారు. 'ఎందుకింత తెగులు?', 'తెలుగు లెస్సేనా?' అంటూ ఉద్యమం చేసిన రోజు మీ బుద్ధి ఏమైంది. ఇంగ్లీష్ మీడియం వద్దు.. తెలుగే ముద్దు అని మీరు ఉద్యమం చేసినప్పుడు మీ అమ్మాయిలు తెలుగు మీడియంలో చదివారా?’’ అంటూ లోకేశ్ సూటిగా ప్రశ్నించారు.
Tags :