మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశానికి మ్యాట్‌

దేశంలోని విద్యాసంస్థల్లో ఎంబీఏ కోర్సు ప్రవేశానికి నిర్వహించే పరీక్షల్లో మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (మ్యాట్‌) ఒకటి. దీన్ని ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఏ) ఏడాదికి నాలుగు సార్లు నిర్వహిస్తోంది

Updated : 27 Jul 2023 02:39 IST

దేశంలోని విద్యాసంస్థల్లో ఎంబీఏ కోర్సు ప్రవేశానికి నిర్వహించే పరీక్షల్లో మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (మ్యాట్‌) ఒకటి. దీన్ని ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఏ) ఏడాదికి నాలుగు సార్లు నిర్వహిస్తోంది. సెప్టెంబరు- 2023లో నిర్వహించే పరీక్షలకు ఇటీవల ప్రకటన వెలువడింది. డిగ్రీ పూర్తిచేసుకున్న, చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష స్కోరుతో దేశవ్యాప్తంగా వివిధ సంస్థల్లో ఎంబీఏ, పీజీడీఎం తదితర కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు.

రిమోట్‌ ప్రోక్టర్డ్‌ ఇంటర్నెట్ బేస్డ్‌, కంప్యూటర్‌ బేస్డ్‌, పేపర్‌ ఆధారితం.. ఇలా కోరుకున్న విధానంలో మ్యాట్‌ పరీక్షను రాసుకోవచ్చు. వీటిలో కోరుకున్న రెండు విధాలుగా రాసుకునేందుకూ అవకాశమిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌ (ఐపీఈ), గీతం, ఐసీబీఎం, విజ్ఞాన జ్యోతి, ధ్రువ, శివశివానీ, విశ్వవిశ్వానీ.. తదితర సంస్థలు మ్యాట్‌ స్కోరుతో ప్రవేశం కల్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 600 సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో చేరడానికి ఈ స్కోరు ఉపయోగపడుతుంది.

పరీక్ష ఇలా...

లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌, మ్యాథమెటికల్‌ స్కిల్స్‌, డేటా అనాలిసిస్‌ అండ్‌ సఫిషియన్సీ, ఇంటెలిజెన్స్‌ అండ్‌ క్రిటికల్‌ రీజనింగ్‌, ఇండియన్‌ అండ్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ అంశాల్లో ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున 200 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. మ్యాథ్స్‌ విభాగంలో ప్రశ్నలు పదో తరగతి సీబీఎస్‌ఈ స్థాయిలో ఉంటాయి.  
అర్హత: డిగ్రీ పూర్తిచేసినవాళ్లు, ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా.
ఫీజు: పేపర్‌ / రిమోట్‌ ప్రోక్టర్డ్‌/ కంప్యూటర్‌ బేస్డ్‌ ఏదో ఒక విధానంలో రాసుకోవడానికి రూ.1950. రెండు విధాల్లో రాసుకోవడానికి రూ. 3100
* పేపర్‌ ఆధారిత పరీక్ష (పీబీటీ) రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ: ఆగస్టు 29
రాతపరీక్ష తేదీ: సెప్టెంబరు 3
* కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ: సెప్టెంబరు 12
పరీక్ష తేదీ: సెప్టెంబరు 17
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: పేపర్‌ బేస్డ్‌ హైదరాబాద్‌,
కంప్యూటర్‌ బేస్డ్‌: హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం.
వెబ్‌సైట్‌: https://mat.aima.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని