ఫ్రెషర్లకు డిమాండ్ పెరిగింది!
ఈమధ్య జాబ్ మార్కెట్ అంతగా ఆశాజనకంగా లేని విషయం తెలిసిందే. కొత్తగా చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ తాజా నివేదికల ప్రకారం ఈ పరిస్థితిలో కాస్త మార్పులు వచ్చాయి.
ఈమధ్య జాబ్ మార్కెట్ అంతగా ఆశాజనకంగా లేని విషయం తెలిసిందే. కొత్తగా చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ తాజా నివేదికల ప్రకారం ఈ పరిస్థితిలో కాస్త మార్పులు వచ్చాయి. వీటి ప్రకారం.. రిటెయిల్, హెల్త్కేర్, మాన్యుఫాక్చరింగ్, ఇతర రంగాల్లో తాజాగా కోర్సులు పూర్తిచేసినవారిని తీసుకుంటున్నారు.
ప్రముఖ ఎడ్టెక్ సంస్థ టీమ్లీజ్.. తన తాజా ‘కెరియర్ ఔట్లుక్’ నివేదికలో ఈ వివరాలు తెలియజేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకునే ట్రెండ్ దాదాపు 6 శాతం పెరిగినట్లుగా ఇందులో ఉంది. మొత్తంగా అన్ని రంగాల్లో ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకోవడం 79.3 శాతానికి పెరిగింది. ఈ విషయానికి సంబంధించి ఈ-కామర్స్ - టెక్నాలజీ స్టార్టప్స్ (55 శాతం), ఇంజినీరింగ్ - ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (53 శాతం), టెలి కమ్యూనికేషన్స్ (50 శాతం) రంగాల్లో కాస్త పెరుగుదల కనిపించింది. నగరాల విషయం చూస్తే.. ఇలాంటి అవకాశాలు అందించడంలో బెంగళూరు 69 శాతం వాటాతో ముందంజలో ఉంది. తర్వాతి స్థానాల్లో ముంబయి (58 శాతం), చెన్నై (51 శాతం), దిల్లీ (45 శాతం) ఉన్నాయి. కొత్తగా వచ్చేవారికి కంపెనీల్లో డిమాండ్ ప్రస్తుతం 68 శాతం వద్ద ఉంది. ఇది గతం కంటే 3 శాతం అధికం.
ఈ నివేదికలో మరో ముఖ్యమైన విషయం- ఫ్రెషర్లు ఉద్యోగావకాశాల్లో జెన్ఏఐ ప్రభావం. ఇది హ్యూమన్-ఏఐ అనుబంధంతో మరింతగా పరిణామం చెందుతోందన్న విషయాన్ని ఈ నివేదిక గుర్తించింది. దీనిద్వారా సాఫ్ట్వేర్ డెవలపర్స్, టెక్నికల్ రైటర్స్, లీగల్ అసిస్టెంట్స్, మార్కెట్ రిసెర్చ్ అనలిస్ట్, గ్రాఫిక్ డిజైనర్స్ వంటి ఉద్యోగాలు ప్రభావితం కాబోతున్నాయి. మొత్తంగా నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొంతకాలంగా మార్కెట్ పరిస్థితి బాగుండక తగ్గిన నియామకాలు ప్రస్తుతం ఊపందుకున్నాయి. దేశీయ మార్కెట్ స్థిరంగా నిలబడటం, ఇక్కడి వారి ప్రతిభపై కంపెనీలకు నమ్మకం కుదరడం కూడా ఇందుకు కారణాలుగా తెలుస్తోంది. మరో నాలుగైదు నెలల వరకూ ఈ ట్రెండ్ ఇదే విధంగా కొనసాగవచ్చని వారి అంచనా. అందువల్ల ఈలోగా అభ్యర్థులు ప్రయత్నాలను ముమ్మరం చేసుకుంటే అనుకున్న కొలువులు సాధించవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
China: చంద్ర శిలల సేకరణకు బయల్దేరిన చైనా..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఘోర బస్సు ప్రమాదం.. పాక్లో 20 మంది దుర్మరణం
-
ప్రభాకర్రావు కోసం పోలీసుల వేట .. అరెస్టు వారెంట్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్
-
50 కోట్ల ప్రయాణికుల మైలు రాయిని దాటిన హైదరాబాద్ మెట్రో
-
వివాహిత ఇంటికి బాంబు పార్సిల్ పంపిన ప్రియుడు.. భర్త, కుమార్తె మృతి