మహర్షి.. మయూరం
బరోడా మహారాణి బహూకరించిన తెల్లనెమలిని రమణ మహర్షి ఎంతో ప్రేమగా చూసుకునేవారు. తన ఆసనం పక్కనే ఆ మయూరానికి గూడు కట్టించి, ‘
బరోడా మహారాణి బహూకరించిన తెల్లనెమలిని రమణ మహర్షి ఎంతో ప్రేమగా చూసుకునేవారు. తన ఆసనం పక్కనే ఆ మయూరానికి గూడు కట్టించి, ‘ఒరే మాధవా!’ అంటూ ప్రేమగా పిలిచేవారు. వారిద్దరి అనుబంధాన్ని చూసి అందరూ ముచ్చటపడేవారు. ఒక భక్తుడైతే ఎంతో ప్రభావితుడై, ఆ నెమలిపై సంస్కృతంలో 8 శ్లోకాలతో ‘మయూరాష్టకమ్’ అంటూ రాశాడు. అది చదివిన రమణులు అభినందన సూచకంగా అక్కడే ఉన్న ఓ భక్తురాలికి ఇచ్చి, బాణీకట్టమన్నారు. మర్నాడు ఆమె వీణ మీటుతూ ఆ శ్లోకాలను ఆలపించేందుకు సిద్ధమైంది. నెమలి అక్కడ లేకపోవడంతో రమణులు ‘అంతా బాగానే ఉంది. కానీ ఎవరిపై పాడుతున్నారో, ఆ నాయకుడు ఉండాలిగా! ఎక్కడున్నావు మాధవా, ఇలా రా!’ అంటూ పిలిచారు. వెంటనే అది పందిరిపై నుంచి దూకింది. ఆమె పాడుతుంటే అది పురివిప్పి నర్తించసాగింది. పాట పూర్తయ్యే వరకు నర్తిస్తూనే ఉంది. గీతం ముగియగానే.. నెమలి వీణను ముక్కుతో పొడవసాగింది. దాని భావమేంటో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు మహర్షి ‘మాధవుడికి పాట నచ్చింది, మళ్లీ పాడమంటున్నాడు’ అన్నారు. గాయని మళ్లీ మొదలుపెట్టగానే నెమలి నర్తించింది.
నెమలి నేర్పే పాఠం
తన వద్దనున్న మయూరాన్ని ఆలించి, లాలించడమే కాకుండా దాని ద్వారా భక్తులకు ఎన్నో ఆధ్యాత్మిక సందేశాల్నీ ఇచ్చారు రమణులు. అందులో భాగంగా ఓ సందర్భంలో దాన్ని ప్రేమగా నిమురుతూ భక్తులతో ‘నీలిరంగు నెమళ్లు చిత్ర విచిత్ర వర్ణాలను ప్రదర్శిస్తూ ఎంత మనోహరంగా ఉన్నా.. తెల్లనెమలి ప్రత్యేకతే వేరు! శ్వేతవర్ణం సత్త్వ గుణానికి ప్రతీక. అందుకే పవిత్రత, పరిశుద్ధతలతో ప్రకాశిస్తుంది. నిజానికి అన్ని వర్ణాలూ పుట్టేది తెలుపులోంచే! పరబ్రహ్మకు ఏ వర్ణమూ లేకపోయినా, వ్యవహారంలో శ్వేత వర్ణంతో పోలుస్తారు. నెమళ్లు జన్మతః ఏక వర్ణంగానే ఉంటాయి. కానీ ఎదిగే కొద్దీ రకరకాల రంగులను సంతరించుకుంటాయి. మన మనసు కూడా అంతే! అప్పుడే పుట్టిన శిశువు ఎటువంటి గుణాలూ, వైవిధ్యాలూ లేకుండా ఏకరీతిగా ఉంటుంది. వయసు పెరిగేకొద్దీ అనేకత్వాన్నీ, నానాత్వాన్నీ సంతరించుకుంటుంది. విశాల ప్రపంచాన్ని సృష్టించుకుని సుఖదుఃఖాలకు లోనవుతుంది. శ్వేతమయూరం మాత్రం పుట్టీ, పెరిగీ, గిట్టేదాకా అదే రంగుతో ఉండి, మార్పులేని స్వస్థితిని ప్రదర్శిస్తుంది’ అన్నారు. అంతగా మహర్షి మనసు దోచింది కనుకనే ఆయన నిర్యాణసమయంలో వారి గది పైకప్పు మీద నిలిచి, దుఃఖపూరితమైన ధ్వని చేస్తూ హృదయ విదారకంగా విలపించిందా మయూరం.
- చైతన్య
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు