Andhra News: నీ వెంటే నేనంటూ.. గంటల వ్యవధిలో భార్యాభర్తల మృతి

వైవాహిక జీవితంలో ఆ దంపతులు ఒకరిని విడిచి మరొకరు ఉండలేదు. ఎక్కడికైనా కలిసే వెళ్లేవారు. ప్రేమానురాగాలతో ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా జీవించారు. పెళ్లినాడు ఒకరి వెంట మరొకరు నడిచినట్లుగా చివరికి మరణంలోనూ

Updated : 04 Jun 2022 08:53 IST

సాలూరు, న్యూస్‌టుడే: వైవాహిక జీవితంలో ఆ దంపతులు ఒకరిని విడిచి మరొకరు ఉండలేదు. ఎక్కడికైనా కలిసే వెళ్లేవారు. ప్రేమానురాగాలతో ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా జీవించారు. పెళ్లినాడు ఒకరి వెంట మరొకరు నడిచినట్లుగా చివరికి మరణంలోనూ అదే బాట అనుసరించారు. పట్టణంలోని అల్లు వీధికి చెందిన దంపతులు అల్లు చిన్న (72), విజయమ్మ (68) ఒకే రోజు గంటల వ్యవధిలో మృతి చెందారు. చిన్న కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు విజయమ్మ సపర్యలు చేసింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం వేకువజామున మృతి చెందాడు. భర్త మృతిని తట్టుకోలేని విజయమ్మ తీవ్ర మనస్తాపానికి గురై అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో మృతి చెందారు. వీరి ఇద్దరు కుమారులు, కుమార్తె శోకసంద్రంలో మునిగిపోయారు.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని