అరే యార్.. నీళ్లు తాగు
అసలే ఎండాకాలం కదా.. మనం ఎక్కడికెళ్లినా వెంట ఓ వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్తుంటాం. జాగింగ్, జిమ్కి అయినా సరే.
అసలే ఎండాకాలం కదా.. మనం ఎక్కడికెళ్లినా వెంట ఓ వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్తుంటాం. జాగింగ్, జిమ్కి అయినా సరే. ఈసారి మామూలు బాటిల్కి బదులు ‘పీయూఎల్ స్మార్ట్క్యాప్’ ప్రయత్నించండి. దీని ప్రత్యేకత ఏంటంటే.. మనం ఆ రోజు ఎన్ని ద్రవాలు తీసుకున్నాం.. ఇంకా ఎంత తీసుకోవాల్సి ఉంటుంది? డీహైడ్రేషన్కి గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం తాగే నీళ్లలో బ్యాక్టీరియా ఎంత ఉంది? ఈ లెక్కలన్నీ చెప్పేస్తుంది. ఎక్కువ సమయం శరీరంలోకి ఎలాంటి ద్రవాలు వెళ్లకపోతే.. సెల్ఫోన్కి సందేశాలు పంపుతూ గుర్తు చేస్తుంది కూడా. ఇదెలా సాధ్యం అంటే.. ఈ బాటిల్ స్టెయిన్లెస్స్టీల్తో తయారైనా.. మూత మాత్రం ప్లాస్టిక్తో రూపొందించారు. అందులోనే ఒక చిప్ని అమర్చుతారు. దాన్ని ఫోన్ యాప్తో అనుసంధానం చేసుకోవచ్చు. సెన్సర్ ఫ్లో టెక్నాలజీ ద్వారా ద్రవాలను విశ్లేషించి సమాచారం చేరవేస్తుంది. అయితే మనం ఎలాంటి పానీయం తీసుకున్నా.. ఆ బాటిల్లోనే నింపుకొని తాగాలనేది నియమం. HYDURO INC కంపెనీ తయారీదారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!