chittoor: మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష
చిత్తూరు జిల్లా అదనపు సెషన్స్ కోర్టు సంచలన తీర్పు
ప్రధాన నిందితుడికి రూ.70 లక్షల జరిమానా విధింపు
పదేళ్ల కిందట చిత్తూరులో పట్టపగలే ఘాతుకం

హత్యకు గురైన కఠారి మోహన్, అనురాధ
ఈనాడు- చిత్తూరు, న్యూస్టుడే- చిత్తూరు న్యాయవిభాగం: చిత్తూరు నగర మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త, తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్ హత్య కేసులో ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు ఆరో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. ప్రధాన సూత్రధారి, ఏ1గా ఉన్న మోహన్ మేనల్లుడు శ్రీరామ్ చంద్రశేఖర్ ఎలియాస్ చింటూ, గోవిందస్వామి శ్రీనివాసయ్య వెంకటాచలపతి ఎలియాస్ రేజర్ వెంకటేష్ (ఏ2), జయప్రకాష్రెడ్డి ఎలియాస్ జయారెడ్డి (ఏ3), తోటి మంజునాథ్ ఎలియాస్ మంజూ (ఏ4), మునిరత్నం వెంకటేష్ ఎలియాస్ గంగనపల్లి వెంకటేష్ (ఏ5)లను మరణించే వరకు ఉరి తీయాలని ఆదేశించింది. చింటూకు రూ.70 లక్షలు, మిగిలిన నిందితులకు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించింది. జరిమానా కట్టని పక్షంలో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని పేర్కొంది. చింటూ చెల్లించే జరిమానాలో రూ.50 లక్షలు మృతుల వారసులు, రూ.20 లక్షలను అప్పట్లో హత్య ఆపడానికి ప్రయత్నించి తీవ్రంగా గాయపడిన వేలూరి సతీష్కుమార్ నాయుడికి చెల్లించాలని స్పష్టం చేసింది. చిత్తూరు ఆరో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి ఎన్.శ్రీనివాసరావు శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించారు. చిత్తూరు కోర్టు చరిత్రలో ఒకే కేసులో ఐదుగురికి ఉరిశిక్ష పడటం ఇదే తొలిసారి.
తుపాకులు, కత్తులతో దారుణంగా హత్యలు
2015 నవంబరు 17న ఉదయం 11.45 గంటలకు నగరపాలక సంస్థ కార్యాలయంలోనే మేయర్ దంపతులను తుపాకులతో కాల్చి, కత్తులతో నరికి పాశవికంగా హత్య చేశారు. నిందితులు బురఖాలు ధరించి చేతిసంచుల్లో తుపాకులు, కత్తులతో మేయర్ ఛాంబర్లోకి ప్రవేశించారు. కఠారి అనురాధను తల, ఛాతీపై కాల్చారు. తనను చంపొద్దని ఆమె వేడుకున్నా చింటూ మనసు కరగలేదు. కసి తీరా కాల్చి ఆమె మరణించిందని రుజువు చేసుకున్నాకే అక్కడి నుంచి కదిలారు. పక్క ఛాంబర్లో ఉన్న మోహన్ తప్పించుకోవడానికి ప్రయత్నించగా కత్తులతో వెంటాడి నరికి, చంపారు. ఈ ఘటనపై అదేరోజు చిత్తూరు ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది.
57 మంది విచారణ
ఈ కేసులో 130 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. 57 మందిని న్యాయస్థానం విచారించింది. 2016 ఫిబ్రవరి 18న కోర్టులో ప్రవేశపెట్టిన ఛార్జ్షీట్లో 23 మందిని నిందితులుగా పేర్కొన్నారు. శ్రీకాళహస్తికి చెందిన కాసరం రమేష్ హత్యతో తనకు సంబంధం లేదని కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఉపశమనం లభించింది. మరో నిందితుడు శ్రీనివాసాచారి విచారణ కొనసాగుతుండగానే చనిపోయారు. దీంతో తుది విచారణ నాటికి 21 మంది నిందితులుగా ఉన్నారు. ఏ1 నుంచి ఏ5 వరకు దోషులని, మిగిలినవారిపై అభియోగాలు రుజువు కాలేదని అక్టోబరు 24న జడ్జి తీర్పు ఇచ్చారు. అక్టోబరు 27న ఐదుగురు దోషుల కుటుంబ, సామాజిక, ఆర్థిక, మానసిక స్థితి, జైల్లో ఉన్న సమయంలో వారి ప్రవర్తనపై నివేదికలు ఇవ్వాలని చిత్తూరు జిల్లా ప్రొబేషన్ అధికారి, వైద్య బృందం, జైళ్ల సూపరింటెండెంట్లను న్యాయమూర్తి ఆదేశించారు. వీటిని పరిగణనలోకి తీసుకుని ఉరిశిక్ష విధించారు. బాధిత కుటుంబసభ్యులు అనుభవించిన వ్యథను నివేదిక రూపంలో ప్రత్యేక పీపీ శైలజ కోర్టుకు సమర్పించారు. దాన్ని పరిశీలించిన జడ్జి రూ.70 లక్షలు చెల్లించాలని చింటూను ఆదేశించారు.

దోషులు వెంకటా చలపతి, జయప్రకాష్రెడ్డి, మంజునాథ్, వెంకటేష్, చంద్రశేఖర్
పశ్చాత్తాపం మాటే లేని దోషులు
జడ్జి ఉరిశిక్ష విధించిన తర్వాత కూడా దోషుల్లో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు. చింటూ ఏదో ఘనకార్యం చేసినట్టు చేయి ఊపుతూ, కోర్టు బయట అభివాదం చేశారు. న్యాయస్థానం ప్రాంగణంలోనే వైద్యపరీక్షలు చేసి, వారంట్లు సమర్పించాక ఐదుగురినీ కడప కేంద్ర కారాగారానికి తరలించారు. తీర్పు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కఠారి అనుచరులు బాణసంచా కాల్చి, సంబరాలు చేసుకున్నారు.
తప్పుడు సాక్ష్యం చెప్పిన 14 మందికి నోటీసులు
ఘటన జరిగిన రోజు మేయర్ ఛాంబర్, నగరపాలక సంస్థ కార్యాలయంలో పలువురు ఉద్యోగులు, అర్జీదారులు ఉన్నారు. అందులో 14 మంది కేసును నీరుగార్చడానికి న్యాయస్థానంలో తప్పుడు సాక్ష్యం ఇచ్చారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన జడ్జి వీరందరినీ ఎందుకు ప్రాసిక్యూట్ చేయకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. 10 రోజుల్లోపు వారి చిరునామాలు కోర్టుకు సమర్పించాలని ఒకటో పట్టణ సీఐను ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

చిన్నారి నాగవైష్ణవి హత్య కేసులో మావయ్య నిర్దోషి
ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిన్నారి నాగవైష్ణవి అపహరణ, హత్య కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ హైకోర్టు పాక్షికంగా సవరించింది. - 
                                    
                                        

నెల్లూరు జైలుకు మాజీ మంత్రి జోగి రమేష్
నకిలీ మద్యం కేసులో వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాములకు కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు వారిద్దరినీ నెల్లూరు జైలుకు తరలించారు. - 
                                    
                                        

ప్రభుత్వాసుపత్రిలో దౌర్జన్యంపై కేసు
పోలీసులను దౌర్జన్యంగా తోసేసి.. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అద్దాలు పగలగొట్టిన ఘటనపై వైకాపా నేత జోగి రమేష్ భార్య, ఇద్దరు కుమారులు, మరికొందరిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. - 
                                    
                                        

పెట్టుబడులకు ఏపీ ఎంతో అనుకూలం
వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్లో అనుకూల వాతావరణం ఉందని, అనుమతులు సైతం సింగిల్ విండో విధానంలో జారీ చేస్తున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. - 
                                    
                                        

చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఎయిమ్స్లో చికిత్స
మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి మంగళగిరి ఎయిమ్స్లో వైద్య చికిత్స అందించారు. - 
                                    
                                        

మద్యం డబ్బులు తీసుకోలేదని జగన్ ప్రమాణం చేయగలరా?
‘మద్యం నుంచి డబ్బులు తీసుకోవడం లేదని నేను దేవుడిపై ప్రమాణం చేస్తాను. తాను తీసుకోలేదని వైకాపా నేత జగన్ తన పిల్లలపై గానీ దేవుడిపై గానీ ప్రమాణం చేయగలరా’ అని మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. - 
                                    
                                        

అమరావతిలో ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్
అమరావతిలో వచ్చే జనవరి నాటికి ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. లండన్లో పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. - 
                                    
                                        

విజయవాడలో ఎల్ఐసీ హౌసింగ్ ఉప ప్రాంతీయ కార్యాలయం
వ్యక్తిగత గృహ రుణాల మంజూరులో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆశించిన ప్రగతి కనబరుస్తోందని, భవిష్యత్తులో మరింత పుంజుకుంటుందని ఆ సంస్థ ఎండీ, సీఈవో త్రిభువన్ అధికారి పేర్కొన్నారు. - 
                                    
                                        

ఓఎంసీ గనుల్లో డ్రోన్ సర్వే ప్రారంభం
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రాంతంలో అంతర్రాష్ట్ర సరిహద్దు గుర్తింపు కోసం సోమవారం అధికారులు డ్రోన్తో సర్వే ప్రారంభించారు. అనంతపురం జిల్లా ఓబుళాపురం, సిద్ధాపురం గ్రామాల పరిధిలో అక్రమ తవ్వకాల కారణంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులు గల్లంతయ్యాయి. - 
                                    
                                        

‘వీధి కుక్కలకు ఆహారం’పై త్వరలో మార్గదర్శకాలు
ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో వీధి శునకాలకు ఉద్యోగులు ఆహారం పెట్టే విషయంలో తగు మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. - 
                                    
                                        

భాగస్వామ్య సదస్సులో ₹ 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు
విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు 45 దేశాలకు చెందిన 300 మంది పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరుకానున్నారని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. - 
                                    
                                        

160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి మా లక్ష్యం
రాష్ట్రంలో 160 గిగావాట్ల హరిత ఇంధనాన్ని ఉత్పత్తి చేయడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా లండన్లో అతిపెద్ద విద్యుత్తు సరఫరాదారుగా ఉన్న ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ను రాష్ట్రానికి ఆహ్వానించారు. - 
                                    
                                        

ప్రపంచకప్ గెలిచిన జట్టులో మా అమ్మాయి ఉండటంపై గర్విస్తున్నాం
మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలవడం, అందులో తమ కుమార్తె భాగస్వామ్యం కావడంపై గర్వపడుతున్నామని భారత మహిళల జట్టు క్రీడాకారిణి శ్రీచరణి తల్లిదండ్రులు నల్లపురెడ్డి చంద్రశేఖర్రెడ్డి, రేణుక తెలిపారు. - 
                                    
                                        

హాయ్ల్యాండ్కు తరలించాలన్న నిర్ణయం ఎవరిది?
‘ఏపీపీఎస్సీ కార్యాలయం నుంచి గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబుపత్రాలను మంగళగిరి సమీపంలోని హాయ్ల్యాండ్ రిసార్ట్కు తరలించాలనే నిర్ణయం ఎవరిది? ఏపీపీఎస్సీ సమష్టిగా నిర్ణయం తీసుకుందా? లేదా అప్పటి ఛైర్మన్, లేదా కార్యదర్శి నిర్ణయం మేరకు వాటిని తరలించారా? ఇందుకు సంబంధించిన ఏమైనా ఉత్తర్వులున్నాయా? - 
                                    
                                        

రాజధాని నిర్మాణానికి మరో ₹ 32,500 కోట్ల రుణం
రాజధాని అమరావతి నిర్మాణానికి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) మరో రూ.32,500 కోట్లు రుణం తీసుకోనుంది. - 
                                    
                                        

పింఛనుదారులకు డిజిటల్ సాధికారత
పింఛనుదారులకు డిజిటల్ సాధికారత కల్పించడం, పింఛను పొందే ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా డిజిటల్ జీవన ప్రమాణ పత్రాన్ని (లైఫ్ సర్టిఫికెట్) విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని కేంద్ర ప్రభుత్వ పింఛను, పింఛనర్ల సంక్షేమ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవేశ్ కుమార్ పేర్కొన్నారు. - 
                                    
                                        

భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేయాలి
‘కార్తిక మాసం సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగినందున భక్తుల భద్రత, సౌకర్యాలపై యంత్రాంగం దృష్టి సారించాలి. క్యూలైన్లు, పారిశుద్ధ్య నిర్వహణ, భద్రతలపై తగిన చర్యలు చేపట్టాలి’ అని ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఆదేశించారు. - 
                                    
                                        

ఫ్లెమింగోలకు శాశ్వత నివాస స్థావరంగా పులికాట్
తిరుపతి జిల్లాలోని పులికాట్ సరస్సును ఎకో టూరిజానికి గమ్యస్థానంగా.. ఫ్లెమింగోలకు శాశ్వత నివాస స్థావరంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ పేర్కొన్నారు. - 
                                    
                                        

దొనకొండలో ప్రపంచస్థాయి క్యాన్సర్ సెంటర్ రూ.4,260 కోట్లతో నిర్మాణం
ప్రకాశం జిల్లా దొనకొండలో 25 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.4,260 కోట్ల (480 మిలియన్ డాలర్ల) వ్యయంతో ‘చున్ జియోంగ్ ఉన్ చల్లా క్యాన్సర్ సెంటర్’ను నిర్మించనున్నట్లు దక్షిణ కొరియాకు చెందిన వరల్డ్ స్మార్ట్ సిటీస్ ఫోరం ఛైర్మన్ పీటర్ చున్ వెల్లడించారు. - 
                                    
                                        

రాష్ట్రంలో ‘హిందుజా’ రూ.20 వేల కోట్ల పెట్టుబడులు
హిందుజా గ్రూపు రాష్ట్రంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ మేరకు కీలక ఒప్పందం కుదిరింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


