ముందస్తు చర్యలతో ప్రాణ నష్టాన్ని నివారించాం

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 01 Nov 2025 06:28 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

తుపాను బాధితులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది
హోంమంత్రి అనిత పర్యటన

వరద ముంపు పరిస్థితులను మంత్రి అనితకు వివరిస్తున్న కలెక్టర్‌ విజయకృష్ణన్,
చిత్రంలో ఎస్పీ తుహిన్‌సిన్హా, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్

ఎలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం, న్యూస్‌టుడే: మొంథా తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకుంటుందని హోంమంత్రి వంగలపూడి అనిత భరోసా ఇచ్చారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం రజాల-వైలోవ గ్రామాల మధ్య మేజర్‌ శారదా నది వరద గట్టుకు గండిపడిన ప్రదేశాన్ని శుక్రవారం ఆమె కలెక్టర్‌ విజయకృష్ణన్, ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌తో కలిసి స్కూటీపై వెళ్లి పరిశీలించారు. వరద ముంపు పరిస్థితులను మంత్రికి కలెక్టర్‌ వివరించారు. సుమారు 200 మీటర్ల మేర పడిన గండిని యుద్ధ ప్రాతిపదికపై పూడ్చాలని మంత్రి సూచించారు. అనంతరం రైతులతో ఆమె మాట్లాడి వారి సమస్యలను  తెలుసుకున్నారు. పంట నష్టంపై నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం సమీక్షిస్తూ ప్రజలు నష్టపోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారన్నారు. గతంలో తమలపాకు రైతులకు ఎకరానికి రూ.15 వేలు ఇచ్చేవారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఎకరానికి రూ.75 వేలు ఇస్తున్నామన్నారు. ఇది చూసి ప్రతిపక్షానికి ఏం మాట్లాడాలో తెలియడంలేదన్నారు.  ముందుగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ గండిని పరిశీలించి రైతులతో మాట్లాడారు. జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం రజాల సమీపంలో శారదానదికి పడిన గండిని పరిశీలించడానికి
ఎలమంచిలి ఎమ్మెల్యే విజయకుమార్‌తో కలిసి స్కూటీపై ప్రయాణిస్తున్న హోంమంత్రి వంగలపూడి అనిత

Tags :
Published : 01 Nov 2025 05:58 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు