Kasibugga Stampede: నలిగిన బతుకులు.. చెదిరిన కలలు
కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మరణించిన 9 మంది నేపథ్యాలివీ..

మృతదేహాల వద్ద కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు
వారంతా బడుగు జీవులు.. రెక్కల కష్టాన్నే నమ్ముకున్నారు. కార్తిక ఏకాదశి రోజున ఇష్టదైవాన్ని దర్శించాలని ఆలయానికి వెళ్లిన వారి బతుకుల్లో విషాదం అలముకుంది. కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన ఘటనలో మృత్యువాత పడినవారి వివరాలివీ...
భర్త కళ్లెదుటే ఆగిన ఊపిరి..

టెక్కలి మండలం పిట్టలసరియా గ్రామానికి చెందిన రాపాక విజయ(48) రోజుకూలీ. భర్త చిన్నారావు భవన నిర్మాణ మేస్త్రి. భార్యాభర్తలిద్దరూ ద్విచక్ర వాహనంపై దర్శనానికి వెళ్లారు. ప్రమాదంలో విజయ మృతి చెందగా, చిన్నారావు గాయపడ్డారు. రెక్కల కష్టాన్నే నమ్ముకున్న వీరు ఉన్న ఒక్కగానొక్క కుమార్తెకు కొన్నేళ్ల కిందట వివాహం చేశారు.
అక్కడికక్కడే అనంతలోకాలకు..

టెక్కలి మండలం బూరగాం పంచాయతీ రామేశ్వరం గ్రామానికి చెందిన ఏదూరు చిన్నమ్మి(50) భర్తతో విడిపోయి కన్నవారింట్లో ఉంటున్నారు. గ్రామంలోని బంధువులు, స్నేహితులు 30 మందితో కలిసి ఆలయానికి వెళ్లారు. తొక్కిసలాటలో చిన్నమ్మి అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె వదిన నీలవేణి, గ్రామస్థులు సూరమ్మ, నాగమ్మ, గౌరి, తార పద్మావతి గాయపడ్డారు.
గ్రామస్థులు చూస్తుండగానే..

మందస మండలం బెల్లుపటియ గ్రామానికి చెందిన దువ్వ రాజేశ్వరి(60) భర్త ఐదేళ్ల కిందట చనిపోయారు. ప్రస్తుతం కుమారుడి వద్ద ఉంటున్నారు. గ్రామస్థులతో కలిసి దైవదర్శనానికి వెళ్లిన ఆమె వారంతా చూస్తుండగానే విగతజీవిగా మారారు.
ఆ తండ్రికి ఇక దిక్కెవరు..

గంజాం జిల్లా పాత్రపురం మండలం గుడ్డిభద్ర గ్రామానికి చెందిన రంగాల రూప(23) గ్రామస్థులతో పాటు దర్శనానికి వెళ్లారు. తల్లి రెండేళ్ల కిందట మృతి చెందడంతో తండ్రి, కుమార్తె ఉంటున్నారు. నర్సింగ్ కోర్సులో శిక్షణ పొందుతున్న ఆమె చనిపోవడంతో తనకు దిక్కెవరంటూ ఆ తండ్రి గుండెలవిసేలా రోదిస్తున్నారు.
అందరితో వెళ్లి.. విగతజీవిగా మారి..

పలాస పట్టణంలో స్థిరపడిన డొక్కర అమ్ములమ్మ(55) తొక్కిసలాటలో మృతి చెందారు. భర్త రాజారావు ఎలక్ట్రీషియన్. వీరికి ముగ్గురు కుమారులు. వీధిలోని మహిళలతో కలిసి గుడికి వెళ్లిన ఆమె విగతజీవిగా మారడంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.
అమ్మా.. ఏమైందమ్మా..

వజ్రపుకొత్తూరు మండలం దుక్కవానిపేటకు చెందిన మురిపింటి నీలమ్మ(62) కుమారుడు, కోడలితో కలిసి గుడికి వెళ్లారు. ఇంతలో తొక్కిసలాట జరగడంతో క్యూలైన్లో కొంచెం దూరంలో ఉన్న కుమారుడు ఆమె వద్దకు వచ్చారు. అప్పటికే ఆమె ఉలుకూపలుకూ లేకుండా పడి ఉండడంతో ఏమైందమ్మా అంటూ సపర్యలు చేశారు. విగతజీవిగా మారడంతో కుప్పకూలిపోయారు. నీలమ్మ భర్త వైకుంఠరావు గతంలోనే మృతి చెందారు.
ఆరిన ఆశల దీపం..

సోంపేట మండలం బెంకిలి గ్రామానికి చెందిన లొట్ల నిఖిల్(11) తల్లి అనూష, అక్క భవానీతో కలిసి దర్శనానికి వెళ్లాడు. తోపులాటలో కింద పడిపోవడంతో భక్తుల కాళ్ల కింద నలిగిపోయాడు. నిఖిల్ జింకిభద్ర పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. తండ్రి పాపారావు రిక్షా కళాసి. తల్లి చిన్న దుకాణం నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. విగతజీవిగా మారిన ఒక్కగానొక్క బిడ్డను చూసి ఆ తల్లి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
కూలీ ఇంట విషాదం

మందస బోయవీధికి చెందిన బోర బృందావతి(67) రోజుకూలీ. భర్త మృతి చెందడంతో కుమారుడి వద్ద ఉంటున్నారు. దైవదర్శనానికి కాశీబుగ్గ వెళ్లిన ఆమె కానరాని లోకాలకు వెళ్లిపోయారు.
వెళ్లొస్తానని చెప్పి.. తిరిగిరాలేదు..

నందిగాం మండలం శివరాంపురం గ్రామానికి చెందిన చిన్ని యశోదమ్మ(54)కు భర్తతో విడాకులు కావడంతో స్వగ్రామానికి వచ్చేశారు. సోదరుడి ఇంటి పక్కనే నివాసముంటున్నారు. శనివారం కాశీబుగ్గ వెళ్లొస్తానని వదినకు చెప్పి బయలుదేరిన ఆమె అనంతలోకాలకు వెళ్లిపోయారు.
న్యూస్టుడే యంత్రాంగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

చిన్నారి నాగవైష్ణవి హత్య కేసులో మావయ్య నిర్దోషి
ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిన్నారి నాగవైష్ణవి అపహరణ, హత్య కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ హైకోర్టు పాక్షికంగా సవరించింది. - 
                                    
                                        

నెల్లూరు జైలుకు మాజీ మంత్రి జోగి రమేష్
నకిలీ మద్యం కేసులో వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాములకు కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు వారిద్దరినీ నెల్లూరు జైలుకు తరలించారు. - 
                                    
                                        

ప్రభుత్వాసుపత్రిలో దౌర్జన్యంపై కేసు
పోలీసులను దౌర్జన్యంగా తోసేసి.. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అద్దాలు పగలగొట్టిన ఘటనపై వైకాపా నేత జోగి రమేష్ భార్య, ఇద్దరు కుమారులు, మరికొందరిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. - 
                                    
                                        

పెట్టుబడులకు ఏపీ ఎంతో అనుకూలం
వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్లో అనుకూల వాతావరణం ఉందని, అనుమతులు సైతం సింగిల్ విండో విధానంలో జారీ చేస్తున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. - 
                                    
                                        

చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఎయిమ్స్లో చికిత్స
మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి మంగళగిరి ఎయిమ్స్లో వైద్య చికిత్స అందించారు. - 
                                    
                                        

మద్యం డబ్బులు తీసుకోలేదని జగన్ ప్రమాణం చేయగలరా?
‘మద్యం నుంచి డబ్బులు తీసుకోవడం లేదని నేను దేవుడిపై ప్రమాణం చేస్తాను. తాను తీసుకోలేదని వైకాపా నేత జగన్ తన పిల్లలపై గానీ దేవుడిపై గానీ ప్రమాణం చేయగలరా’ అని మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. - 
                                    
                                        

అమరావతిలో ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్
అమరావతిలో వచ్చే జనవరి నాటికి ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. లండన్లో పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. - 
                                    
                                        

విజయవాడలో ఎల్ఐసీ హౌసింగ్ ఉప ప్రాంతీయ కార్యాలయం
వ్యక్తిగత గృహ రుణాల మంజూరులో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆశించిన ప్రగతి కనబరుస్తోందని, భవిష్యత్తులో మరింత పుంజుకుంటుందని ఆ సంస్థ ఎండీ, సీఈవో త్రిభువన్ అధికారి పేర్కొన్నారు. - 
                                    
                                        

ఓఎంసీ గనుల్లో డ్రోన్ సర్వే ప్రారంభం
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రాంతంలో అంతర్రాష్ట్ర సరిహద్దు గుర్తింపు కోసం సోమవారం అధికారులు డ్రోన్తో సర్వే ప్రారంభించారు. అనంతపురం జిల్లా ఓబుళాపురం, సిద్ధాపురం గ్రామాల పరిధిలో అక్రమ తవ్వకాల కారణంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులు గల్లంతయ్యాయి. - 
                                    
                                        

‘వీధి కుక్కలకు ఆహారం’పై త్వరలో మార్గదర్శకాలు
ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో వీధి శునకాలకు ఉద్యోగులు ఆహారం పెట్టే విషయంలో తగు మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. - 
                                    
                                        

భాగస్వామ్య సదస్సులో ₹ 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు
విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు 45 దేశాలకు చెందిన 300 మంది పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరుకానున్నారని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. - 
                                    
                                        

160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి మా లక్ష్యం
రాష్ట్రంలో 160 గిగావాట్ల హరిత ఇంధనాన్ని ఉత్పత్తి చేయడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా లండన్లో అతిపెద్ద విద్యుత్తు సరఫరాదారుగా ఉన్న ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ను రాష్ట్రానికి ఆహ్వానించారు. - 
                                    
                                        

ప్రపంచకప్ గెలిచిన జట్టులో మా అమ్మాయి ఉండటంపై గర్విస్తున్నాం
మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలవడం, అందులో తమ కుమార్తె భాగస్వామ్యం కావడంపై గర్వపడుతున్నామని భారత మహిళల జట్టు క్రీడాకారిణి శ్రీచరణి తల్లిదండ్రులు నల్లపురెడ్డి చంద్రశేఖర్రెడ్డి, రేణుక తెలిపారు. - 
                                    
                                        

హాయ్ల్యాండ్కు తరలించాలన్న నిర్ణయం ఎవరిది?
‘ఏపీపీఎస్సీ కార్యాలయం నుంచి గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబుపత్రాలను మంగళగిరి సమీపంలోని హాయ్ల్యాండ్ రిసార్ట్కు తరలించాలనే నిర్ణయం ఎవరిది? ఏపీపీఎస్సీ సమష్టిగా నిర్ణయం తీసుకుందా? లేదా అప్పటి ఛైర్మన్, లేదా కార్యదర్శి నిర్ణయం మేరకు వాటిని తరలించారా? ఇందుకు సంబంధించిన ఏమైనా ఉత్తర్వులున్నాయా? - 
                                    
                                        

రాజధాని నిర్మాణానికి మరో ₹ 32,500 కోట్ల రుణం
రాజధాని అమరావతి నిర్మాణానికి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) మరో రూ.32,500 కోట్లు రుణం తీసుకోనుంది. - 
                                    
                                        

పింఛనుదారులకు డిజిటల్ సాధికారత
పింఛనుదారులకు డిజిటల్ సాధికారత కల్పించడం, పింఛను పొందే ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా డిజిటల్ జీవన ప్రమాణ పత్రాన్ని (లైఫ్ సర్టిఫికెట్) విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని కేంద్ర ప్రభుత్వ పింఛను, పింఛనర్ల సంక్షేమ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవేశ్ కుమార్ పేర్కొన్నారు. - 
                                    
                                        

భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేయాలి
‘కార్తిక మాసం సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగినందున భక్తుల భద్రత, సౌకర్యాలపై యంత్రాంగం దృష్టి సారించాలి. క్యూలైన్లు, పారిశుద్ధ్య నిర్వహణ, భద్రతలపై తగిన చర్యలు చేపట్టాలి’ అని ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఆదేశించారు. - 
                                    
                                        

ఫ్లెమింగోలకు శాశ్వత నివాస స్థావరంగా పులికాట్
తిరుపతి జిల్లాలోని పులికాట్ సరస్సును ఎకో టూరిజానికి గమ్యస్థానంగా.. ఫ్లెమింగోలకు శాశ్వత నివాస స్థావరంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ పేర్కొన్నారు. - 
                                    
                                        

దొనకొండలో ప్రపంచస్థాయి క్యాన్సర్ సెంటర్ రూ.4,260 కోట్లతో నిర్మాణం
ప్రకాశం జిల్లా దొనకొండలో 25 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.4,260 కోట్ల (480 మిలియన్ డాలర్ల) వ్యయంతో ‘చున్ జియోంగ్ ఉన్ చల్లా క్యాన్సర్ సెంటర్’ను నిర్మించనున్నట్లు దక్షిణ కొరియాకు చెందిన వరల్డ్ స్మార్ట్ సిటీస్ ఫోరం ఛైర్మన్ పీటర్ చున్ వెల్లడించారు. - 
                                    
                                        

రాష్ట్రంలో ‘హిందుజా’ రూ.20 వేల కోట్ల పెట్టుబడులు
హిందుజా గ్రూపు రాష్ట్రంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ మేరకు కీలక ఒప్పందం కుదిరింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


