Botsa: తప్పు చేయలేదనే ధైర్యంతోనే అనంతబాబు బయట తిరుగుతుండొచ్చు: బొత్స

వైకాపా ప్రభుత్వంలో చట్టానికి చుట్టాలు ఉండరని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శ్రీకాకుళంలోని వైకాపా కార్యాలయంలో ఈనెల 26 నుంచి జరగనున్న బస్సు యాత్రపై చర్చించేందుకు పార్టీ నాయకులతో

Updated : 23 May 2022 09:40 IST

అరసవల్లి, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వంలో చట్టానికి చుట్టాలు ఉండరని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శ్రీకాకుళంలోని వైకాపా కార్యాలయంలో ఈనెల 26 నుంచి జరగనున్న బస్సు యాత్రపై చర్చించేందుకు పార్టీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుపై కేసు నమోదు చేశాం. నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తున్నాం. ఎమ్మెల్సీ అనంతబాబు ఎక్కడో పెళ్లికి హాజరయ్యారని మీడియాలో చూశా. తప్పు చేయలేదనే ధైర్యంతో అలా తిరిగి ఉంటారు. ఘటన జరిగిన రోజే మృతుడి తల్లి, భార్య వాంగ్మూలం ఇచ్చి ఉంటే ఈపాటికే ఎమ్మెల్సీ అరెస్టయ్యేవారు. మృతుడి కుటుంబసభ్యులు రెండురోజుల పాటు నిర్లక్ష్యం చేశారు’ అని వివరించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని