Andhra News: మంత్రి అప్పలరాజుకు గౌతమ్‌రెడ్డి శాఖలు

మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఆయన నిర్వర్తించిన శాఖల బాధ్యతలను మరో మంత్రి సీదిరి అప్పలరాజుకు ప్రభుత్వం గురువారం అప్పగించింది. ఈనెల 7నుంచి అసెంబ్లీ

Published : 04 Mar 2022 07:00 IST

ఈనాడు, అమరావతి: మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఆయన నిర్వర్తించిన శాఖల బాధ్యతలను మరో మంత్రి సీదిరి అప్పలరాజుకు ప్రభుత్వం గురువారం అప్పగించింది. ఈనెల 7నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆశాఖలకు సంబంధించిన ప్రశ్నలకు వివరణ ఇచ్చే బాధ్యత మంత్రులపై ఉంటుంది. అందువల్ల ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల వరకు పరిశ్రమలు-వాణిజ్యం, పెట్టుబడులు-మౌలిక వసతులు, ఐటీ, నైపుణ్యాభివృద్ధి-శిక్షణ శాఖల బాధ్యతలను అప్పలరాజుకు అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని