AP Highcourt: అవినీతి కేసుల్లో అలసత్వమా?
అవినీతి కేసుల్లో దర్యాప్తు, అభియోగపత్రం దాఖలులో జాప్యం జరుగుతుండటంతో అనిశాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అవినీతి కేసుల్లో అనిశా కఠినంగా వ్యవహరించడం లేదని వ్యాఖ్యానించింది.
సకాలంలో అభియోగపత్రం దాఖలు చేయనందుకు అనిశాపై హైకోర్టు ఆగ్రహం
స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని డీజీకి ఆదేశం
ప్రభుత్వం ఇలా నడవడానికి వీల్లేదని ఘాటు వ్యాఖ్య
ఈనాడు, అమరావతి: అవినీతి కేసుల్లో దర్యాప్తు, అభియోగపత్రం దాఖలులో జాప్యం జరుగుతుండటంతో అనిశాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అవినీతి కేసుల్లో అనిశా కఠినంగా వ్యవహరించడం లేదని వ్యాఖ్యానించింది. ప్రకాశం జిల్లా కొమరోలులోని ఎస్ఎల్వీ ఎడ్యుకేషనల్ సొసైటీపై వచ్చిన అవినీతి ఆరోపణల్లో 2018లో కేసు నమోదైనా, ఇంతవరకు అభియోగపత్రం(ఛార్జిషీట్) దాఖలు చేయకపోవడంపై అనిశా డీజీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. సంబంధిత సొసైటీకి రక్షణగా ఉంటూ ఉద్దేశపూర్వకంగా అభియోగపత్రం వేయడంలో జాప్యం చేస్తున్నారని అనిశాను తీవ్రంగా ఆక్షేపించింది. మొత్తం రికార్డులతో మార్చి 4న కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని అనిశా డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులుని ఆదేశించింది. అనిశా ముందు ప్రస్తుతం ఎన్ని కేసులు ఉన్నాయి... ఎన్ని కేసుల్లో దర్యాప్తు చేస్తున్నారు... అవి ఎప్పటి నుంచి పెండింగ్లో ఉన్నాయో అఫిడవిట్ రూపంలో కోర్టు ముందు ఉంచాలని ఆదేశిస్తామని డీజీని హెచ్చరించింది. అనిశా కేసుల్లో జాప్యాన్ని సహించబోమంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా నడవడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్ర, జస్టిస్ ఎస్.సుబ్బారెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది.
* ఎస్ఎల్వీ ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన పాఠశాలల ఉన్నతీకరణ(అప్గ్రేడ్), విభజన, ప్రభుత్వ పథకాల అమలులో అక్రమాలపై విచారణ చేయాలని ప్రకాశం జిల్లా డీఈవోను పాఠశాల విద్య డైరెక్టర్ ఆదేశించడాన్ని సవాలు చేస్తూ సంబంధిత సొసైటీ కార్యదర్శి, ఎస్బీఎన్ఆర్ఎం ఎయిడెడ్ హైస్కూల్ కరస్పాండెంట్ బి.నారాయణరెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి దాన్ని కొట్టేశారు. డీఈవో వద్ద విచారణకు హాజరై పరిశీలన నిమిత్తం రికార్డులు సమర్పించాలని 3 నవంబరు 2021న తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును సవాలు చేస్తూ ఆ సొసైటీ కార్యదర్శి ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు. దస్త్రాలను పరిశీలించిన ధర్మాసనం... 2018 జనవరి 21న ఈ వ్యవహారంపై అనిశా కేసు నమోదు చేసినట్లు గుర్తుచేసింది. ఇప్పటివరకు అభియోగపత్రం వేయకపోవడంపై తీవ్రంగా మండిపడింది. అనిశా తరఫు న్యాయవాది సుభాని వాదనలు వినిపిస్తూ... దర్యాప్తు తుదిదశలో ఉందని, అభియోగపత్రం వేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి అవసరమన్నారు. మేము ఈ వ్యవహారాన్ని సీరియస్గానేతీసుకున్నామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ... కోర్టు ముందుంచిన పత్రాలే ఏమాత్రం సీరియస్గా తీసుకున్నారో తెలియజేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేసింది. సంచిలోని పిల్లిని బయటకు ఎలా తీసుకురావాలో తమకు తెలుసంది. కేసు డైరీతోపాటు పూర్తి రికార్డులతో అనిశా డీజీ కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ నుంచి భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఐటీని పూర్తిగా నిర్వీర్యం చేసింది. హెచ్ఎస్బీసీ, ఐబీఎం వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే విశాఖను వదిలి వెళ్లిపోయాయి. -
ఓట్ల బేరానికి కోట్లు కుమ్మరిస్తున్నారు
వివిధ రకాల స్కీములు పెట్టి ప్రజల జేబుల్ని కొల్లగొట్టే గొలుసుకట్టు కంపెనీల కథలెన్నో విన్నాం కదా? ఎన్నికల్ని వ్యాపారంగా మార్చేసిన ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు.. రాష్ట్రంలో అదే తరహాలో వ్యవహరిస్తోంది. -
జగన్ పంతం.. జలయజ్ఞ విధ్వంసం!
తడిచెమ్మ తగలని కృష్ణా డెల్టా చేలు బీడుపడ్డాయి. ‘కాలువ నీరెప్పుడు వస్తుందంటే చెప్పరు.. ఈ కష్టాల సాగు మావల్ల కాదు’ అంటూ గోదావరి రైతు పంట విరామం ప్రకటించాడు. -
జగన్ జమానాలో.. ఆశా ‘నిరాశై’..!
ప్రజారోగ్యంలో కీలకంగా వ్యవహరించే ఆశా కార్యకర్తల బతుకులతో సీఎం జగన్ ఆడుకున్నారు. పని భారాన్ని పెంచి, వారితో వెట్టిచాకిరీ చేయించారు. తాత్కాలిక పద్ధతిలో పనిచేసే వీరికి సంక్షేమ పథకాలను దూరం చేశారు. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
ఎన్నికల వేళ ‘జగన్మాయ’!
ఎన్నికల వేళ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం దిమ్మదిరిగే షాకిచ్చింది..! బుధవారం ఉదయం నుంచే సెల్ఫోన్కి వస్తున్న మెసేజ్లు చూసి ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. -
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఒప్పంద ఉద్యోగులకు పోలింగ్ డ్యూటీ వేసిన అధికారులు.. వారు పోస్టల్ బ్యాలట్ వినియోగించుకోకుండా చేశారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
ఆంధ్రా పారిస్లో అ‘న్న’న్నా!
‘నాకు మంచి స్నేహితుడు’ అని ముఖ్యమంత్రి జగన్ ఆ ప్రజాప్రతినిధిని ఇటీవల ఓ సభలో ప్రజలకు పరిచయం చేశారు. -
అత్యవసర వాహనానికి ఆపద!
తిరుపతి నుంచి రేణిగుంట వైపు వెళ్తున్న ఓ 108 వాహనం బుధవారం ఉదయం ఇలా నడిరోడ్డుమీదే ఆగిపోయింది. -
21 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో బుధవారం 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 118 మండలాల్లో వడగాలులు వీచాయి. 21 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
విజ్ఞతతో ఓటేద్దాం.. అభివృద్ధికి బాటేద్దాం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోస్టుమ్యాన్ పురుష్తోతం తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. -
మద్యం ఆదాయం.. ఐదేళ్లలో నాలుగు రెట్లు!
‘రాష్ట్రానికి ఏటా సుమారు రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం వస్తుంటే.. అందులో రూ.72వేల కోట్లు జీఎస్టీ, వ్యాట్, రిజిస్ట్రేషన్లు, మద్యం అమ్మకాల ద్వారా వస్తోంది. -
నేరచరిత్ర, ఆస్తుల వివరాలను అభ్యర్థులు ప్రకటించుకోవాల్సిందే
సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేరచరిత్ర, ఆస్తుల వివరాలను స్వతంత్రంగా పత్రికల్లో ప్రచురించుకోవాలని, ఆయా పార్టీల వెబ్సైట్లో వివరాలను ఉంచాలని హైకోర్టు స్పష్టం చేసింది. -
పంచాయతీ భవనంలో మద్యం నిల్వలు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఏకంగా పంచాయతీ భవనంలోనే మద్యం నిల్వలు దాచిపెట్టిన ఉదంతం కలకలం రేపింది. -
రూ.80 లక్షల విలువైన మద్యం ధ్వంసం
ఎన్నికల్లో పంపిణీ చేయడానికి అక్రమంగా నిల్వ ఉంచిన రూ.80 లక్షల విలువైన 58,032 క్వార్టర్ల గోవా మద్యం సీసాలను కృష్ణా జిల్లా పోలీసులు బుధవారం ధ్వంసం చేశారు. -
చందనోత్సవం వేళ.. సింహాచలం డీసీకి కమిషనరేట్లో బాధ్యతలు
సింహాచలంలో ఈనెల 10న సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరగనుంది. గతేడాది ఇదే చందనోత్సవంలో అధికార యంత్రాంగం విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. -
హోంగార్డుల వేతనాల్లో కోతపై గగ్గోలు
తమిళనాడులో ఎన్నికల విధులకు వెళ్లిన హోంగార్డుల వేతనాల్లో కోత పడింది. బుధవారం ఖాతాల్లో పడిన వేతనం చూసి వారు హతాశులయ్యారు. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు
-
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
తండ్రిని చంపిన కుమార్తె అరెస్టు
-
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..