Adani Airports: అదానీ గ్రూప్‌ నుంచి మరో ఐపీఓ!

Eenadu icon
By Business News Team Published : 12 Jun 2025 11:35 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Adani Airports | ఇంటర్నెట్‌ డెస్క్‌: గౌతమ్ అదానీ (Gautam Adani) నేతృత్వంలోని అదానీ గ్రూప్ నుంచి మరో కంపెనీ ఐపీఓ (IPO)కి రానుంది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్‌ విమానాశ్రయ నిర్వహణ సంస్థ అదానీ ఎయిర్‌పోర్ట్స్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (Adani Airports)ను పబ్లిక్‌ ఇష్యూకు తీసుకురావాలని చూస్తోంది. ఎయిర్‌పోర్ట్స్ విభాగాన్ని 2027 నాటికి ఐపీఓ ద్వారా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్‌ చేయనుంది. 2027 మార్చి నాటికి ఈ కంపెనీ షేర్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలో లిస్ట్‌ కానున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదించింది. 

అదానీ గ్రూప్‌ వృద్ధి వ్యూహంలో భాగంగా రానున్న కొన్ని సంవత్సరాల్లో వివిధ వ్యాపారాల్లో రూ.8 లక్షల కోట్లు (100 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడి పెట్టనుంది. ప్రస్తుతం అదానీ గ్రూప్‌ భారత్‌లో ఎనిమిది విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. వీటిలో భారత ఆర్థిక రాజధాని ముంబయి సమీపంలోని నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. ఇది త్వరలోనే ప్రారంభం కానుంది. సంస్థ తన మూలధన వ్యయ ప్రణాళికను రెట్టింపు చేసింది. గత పదేళ్లలో ఖర్చు చేయాలనుకున్న 100 బిలియన్‌ డాలర్లను ఇప్పుడు ఐదు నుంచి ఆరేళ్లలోనే పెట్టుబడిగా మార్చేందుకు సన్నాహాలు చేస్తోంది.  

గత వారం అదానీ ఎయిర్‌పోర్ట్స్‌.. అంతర్జాతీయ బ్యాంకుల కన్సార్టియం నుంచి 750 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.6,400 కోట్ల) రుణాలను తీసుకుంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ అనుబంధ సంస్థ అయిన ఏఏహెచ్‌ఎల్, ఎక్స్‌టర్నల్‌ కమర్షియల్‌ బారోయింగ్స్‌ (ఈసీబీ) ద్వారా ఈ రుణాలు పొందింది. ప్రస్తుతం సంస్థకు ఉన్న 400 మిలియన్‌ డాలర్ల రుణాల రీఫైనాన్సింగ్‌ కోసం ఈ నిధులను వెచ్చించనుంది. వ్యాపార విస్తరణతో అదానీ గ్రూప్‌ దేశీయ విమానయాన రంగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు