ఆదిలాబాద్‌లో కాల్పుల కలకలం

ఆదిలాబాద్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటన తాటిగూడలో చోటుచేసుకుంది. పాతకక్షలతో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫరూర్‌ అహ్మద్‌

Updated : 06 Dec 2023 15:36 IST

ఆదిలాబాద్‌ (నేరవిభాగం): ఆదిలాబాద్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటన పట్టణంలోని తాటిగూడలో చోటుచేసుకుంది. పాతకక్షలతో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కాల్పులకు దారితీసింది. ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫరూక్‌ అహ్మద్‌.. ప్రత్యర్థి వర్గానికి చెందిన ఇద్దరిపై కాల్పులు జరపడంతో పాటు మరొకరిపై తల్వార్‌తో దాడి చేశారు. కాల్పుల ఘటనలో జమీర్‌, మోతేషాన్‌ గాయపడ్డారు. తల్వార్‌తో జరిపిన దాడిలో మన్నన్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాల్పులు జరిపిన ఫరూక్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని