డ్రగ్స్‌ మత్తులో అన్న కుటుంబాన్ని హతమార్చాడు

పంజాబ్‌లోని మొహాలి జిల్లాలో మత్తు పదార్థాలకు బానిసైన ఓ యువకుడు సొంత అన్న కుటుంబాన్ని అంతం చేశాడు.

Updated : 14 Oct 2023 09:19 IST

ఈటీవీ భారత్‌: పంజాబ్‌లోని మొహాలి జిల్లాలో మత్తు పదార్థాలకు బానిసైన ఓ యువకుడు సొంత అన్న కుటుంబాన్ని అంతం చేశాడు. గ్లోబల్‌ సిటీ ఖరడ్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ఆర్థికంగా స్థిరపడిన అన్న సత్వీర్‌సింగ్‌పై అతడు కక్ష పెంచుకున్నాడు. సత్వీర్‌సింగ్‌, అమన్‌దీప్‌ కౌర్‌ దంపతులతోపాటు వారి కుమారుడు లఖ్‌వీర్‌ సింగ్‌ను చంపేశాడు. ముందుగా అన్న భార్యను కత్తితో పొడిచి.. అనంతరం అన్నను పారతో బాది హత్య చేశాడు. ఆ తర్వాత రెండేళ్ల చిన్నారిని నిర్దాక్షిణ్యంగా చిదిమేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతడికి సహాయం చేసిన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని