Telangana News: స్విమ్మింగ్‌పూల్‌ స్నానాల గదిలో సెల్‌ఫోన్‌ కెమెరా

ఈత కొలను స్నానాల గదిలో సెల్‌ఫోన్‌ ద్వారా రహస్యంగా వీడియో చిత్రీకరించిన ఘటన సూర్యాపేటలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల

Updated : 06 May 2022 06:51 IST

సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే: ఈత కొలను స్నానాల గదిలో సెల్‌ఫోన్‌ ద్వారా రహస్యంగా వీడియో చిత్రీకరించిన ఘటన సూర్యాపేటలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడ గ్రామ పరిధిలోని ఈత కొలనులో పనిచేసే గుగులోతు మహేశ్‌ అనే యువకుడు స్నానాల గదిలో మంగళవారం తన సెల్‌ఫోన్‌ వీడియో కెమెరాను ఆన్‌చేసి రహస్యంగా ఉంచాడు. అదే రోజు ఇద్దరు యువతులు దుస్తులు మార్చుకుంటుండగా అనుమానంతో పరిశీలించగా.. సెల్‌ఫోన్‌ కనిపించింది. యువతుల తల్లిదండ్రులు బుధవారం రాత్రి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ ఇన్‌స్పెక్టర్‌ ఆంజనేయులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని