Crime News: చోరీ చేశారు.. భయంతో మద్యంలో గడ్డిమందు కలుపుకొని తాగారు!

మద్యంలో గడ్డిమందు కలుపుకుని తాగి ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండలంలో చోటు చేసుకుంది..

Published : 09 Dec 2021 01:40 IST

సంగారెడ్డి జిల్లాలో ఇద్దరి ఆత్మహత్య

సంగారెడ్డి అర్బన్‌: మద్యంలో గడ్డిమందు కలుపుకొని తాగి ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కల్పగూరు శివారు గంజిగూడెంకు చెందిన వెంకట్‌ (45), లక్ష్మయ్య (55) ఇద్దరూ కలిసి సంగారెడ్డిలోని జిల్లా కోర్టు ఆవరణలో సోమవారం రాత్రి సైకిల్‌ చోరీ చేసి దాన్ని గ్రామంలో దాచిపెట్టారు. అదేరోజు గ్రామానికి చెందిన కృష్ణయ్య బైక్‌ను పంట కాలువలో పడేశారు. 

అనంతరం గ్రామంలో కట్టేసిన పశువుల తాళ్లు విప్పుతుండగా యజమాని మల్లేశం గమనించి కేకలు వేయడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో మరుసటిరోజు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఈ క్రమంలో నిందితులను వారి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు దూషించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కూడా విచారణ చేపట్టేందుకు రాలేదు. ఈ క్రమంలో భయాందోళన చెందిన బాధితులు.. గ్రామశివారులోకి వెళ్లి కల్లు తాగారు. అనంతరం అక్కడి నుంచి సంగారెడ్డి వెళ్లి మద్యం కొనుగోలు చేసి అందులో గడ్డిమందు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని