చోదకుల నిర్లక్ష్యం.. గాలిలో ప్రాణాలు
కారణాలు ఏమైనా రహదారులపై సరకు రవాణా వాహనాలు నిర్లక్ష్యంగా నిలుపుతున్నారు. నిద్రమత్తు, అతివేగం, పొగమంచు, తదితర కారణాలతో రహదారిపై నిలిచి ఉన్న వాహనాలను గమనించలేని ప్రయాణికుల వాహనాల చోదకులు వాటిని బలంగా ఢీకొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి.
నర్సాపూర్(జి) మండలంలోని తురాటి సమీపంలో జాతీయ రహదారిపై నిలిచి ఉన్న లారీని ఢీకొన్న కారు
నర్సాపూర్(జి), న్యూస్టుడే: కారణాలు ఏమైనా రహదారులపై సరకు రవాణా వాహనాలు నిర్లక్ష్యంగా నిలుపుతున్నారు. నిద్రమత్తు, అతివేగం, పొగమంచు, తదితర కారణాలతో రహదారిపై నిలిచి ఉన్న వాహనాలను గమనించలేని ప్రయాణికుల వాహనాల చోదకులు వాటిని బలంగా ఢీకొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పలువురు క్షతగాత్రులవుతున్నారు. టైరు పేలిపోవడం, ఇంజిన్ మొరాయించడం, లైట్లు లేకపోవడం, నిద్రమత్తులో ఉండడం వంటి కారణాలతో చోదకులు లారీలను రోడ్డుపైనే నిలుపుతున్నారు. చీకటిపూట వెనక నుంచి వచ్చే వాహనాలకు ఆగి ఉన్న లారీలు కనిపించక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. సాంకేతిక సమస్యతో లారీ రహదారిపై నిలిచిపోతే ఎలాంటి సూచికలు ఏర్పాటుచేయడం లేదు. కనీసం స్థానిక పోలీసులను, జాతీయ రహదారి భద్రత సిబ్బందిని ఆశ్రయిస్తే వారు రేడియంతో కూడిన గుర్తులను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అవసరమైతే నిలిచిపోయిన వాహనాన్ని రోడ్డు పక్కకు తరలించే ఏర్పాట్లు చేస్తారు.
ఇటీవల జరిగిన ఘటనలు
- నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండలం నసీరాబాద్ సమీపంలో 61వ జాతీయ రహదారిపై ఓ లారీని నిలిపి ఉంచారు. అటు వైపుగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యాభర్తలు ముందు వైపు నిలిచి ఉన్న లారీని ఢీకొన్నారు. దీంతో ఇరువురి గాయాలయ్యాయి. ఈ సంఘటన పగలు జరగడంతో స్థానికులు 108కి సమాచారం అందించగా క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
- నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండలంలోని తురాటి గ్రామ సమీపంలో 61వ జాతీయ రహదారిపై లోడుతో ఉన్న ఓ లారీ నిలిచి ఉండగా రాత్రి సమయంలో వెనుక నుంచి ఓ కారు వచ్చి లారీని ఢీకొంది. క్షతగాత్రుడిని భైంసా ఆసుపత్రికి తరలించారు.
- సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం సమీపంలో 65వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీ కిందికి కారు దూసుకుపోవడంతో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. లారీ కిందికి పూర్తిగా కారు దూసుకెళ్లడం చూస్తే.. అది ఎంత వేగంతో ఉందో అర్థమవుతోంది.
- సూర్యాపేట జిల్లా కోదాడలోని శ్రీరంగాపురం సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ కారు వెనుక నుంచి ఢీకొనగా.. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రత్యేక కేంద్రం.. మిశ్రమ ఫలితం
[ 16-05-2024]
కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల్లో కొన్ని ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు, పోలింగ్ శాతాన్ని పెంచేందుకు వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. -
కనిపిస్తే.. కరుస్తున్నాయి!
[ 16-05-2024]
జిల్లాలో శునకాలు బెంబేలెత్తిస్తున్నాయి. పని నిమిత్తం బయటకు వచ్చే వారిపై దాడులు చేసి కండలు పీకుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా కాలనీల్లో గుంపులుగా సంచరిస్తున్నాయి. -
రిమ్స్ ఒప్పంద ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
[ 16-05-2024]
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో పేషెంట్ కేర్ టేకర్గా పని చేసే లక్ష్మి బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సూపర్వైజర్ అకారణంగా తనను పనిలోకి రావొద్దంటూ బెదిరించారంటూ రాత్రి అక్కడే పడుకున్న ఆమె తెల్లవారుజామున మరుగుదొడ్డి శుభ్రం చేసే రసాయనం తాగేసింది. -
ఆరోగ్య కేంద్రాల్లో మరిన్ని సేవలు
[ 16-05-2024]
ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా (ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్)లలో ఇప్పటికే అందిస్తున్న అయిదు రకాల సాధారణ సేవలతోపాటు ఏడు రకాల ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకురావటానికి వైద్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
దిల్లీ దూరమనుకోలేదు..!
[ 16-05-2024]
ఓటర్లు ఎన్నికలపై ఎంత ఆసక్తి కనబరిచారనేది పోలింగ్ శాతాన్ని బట్టి తెలుస్తుంది. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకుంటారు. -
బోసిపోతున్న థియేటర్లు
[ 16-05-2024]
ప్రస్తుత ఉరుకులు పరుగుల జనజీవన గమనంలో ప్రజలు తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నారు. వాటి నుంచి కాసింత ఉపశమనం పొందాలని థియేటర్లను ఆశ్రయిస్తున్నారు. -
వద్దన్నా వినరు.. అక్రమాలు ఆపరు
[ 16-05-2024]
ప్రభుత్వ, అసైన్డ్, వివాదం, కోర్టు కేసుల్లో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేయరాదనేది నిబంధన. ఒకవేళ ఎవరైనా ఇటువంటి స్థలాలను రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నా.. సంబంధిత సబ్ రిజిస్ట్రార్ తిరస్కరించాలి. -
బియ్యం దందా.. అధికారుల అండ!
[ 16-05-2024]
ఈ నెల 7న చింతలమానేపల్లి మండల కేంద్రం నుంచి పలు వాహనాల్లో 11 క్వింటాళ్ల రాయితీ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తుండగా, టాస్క్ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఎన్నికల వేళ రూ.2.04 కోట్లు పట్టివేత
[ 16-05-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో రూ.2,04,72,950 నగదు పట్టుకున్నట్లు ఎస్పీ సురేష్కుమార్ వెల్లడించారు. ఇదే కాకుండా రూ.2.40 లక్షల విలువైన 9.58 కిలోల గంజాయి, 14 గంజాయి మొక్కలను పట్టుకున్నామన్నారు. -
ఓటు హక్కుకు దూరం @ 2,21,397
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రధాన క్రతువు ముగిసింది. ఇప్పుడంతా జూన్ 4న జరిగే కౌంటింగ్పైకి దృష్టి మళ్లింది. ఎవరు గెలుస్తారు. ఎన్ని ఓట్లు వస్తాయనే విషయంపై చర్చ నడుస్తోంది. -
144 సెక్షన్ అమలు
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి హాజీపూర్ మండలం ముల్కల్ల ఐజా ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్రూంల వద్ద పటిష్ట భద్రత చేపట్టాలని పాలనాధికారి బి.సంతోష్ ఆదేశించారు. -
పొంగిపొర్లిన మద్యం..!
[ 16-05-2024]
భగభగ మండుతున్న సూర్య ప్రతాపమో.. లేక అలవాటు పడ్డ ప్రాణమో.. తెలియదుగానీ.. చల్లచల్లగా.. అనుకుంటూ మందుబాబులు ఈ వేసవిలో ఎక్కువగా తాగేస్తున్నారు. -
డెంగీ నియంత్రణకు చర్యలు
[ 16-05-2024]
జిల్లాలో డెంగీ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా అదనపు పాలనాధికారి సబావత్ మోతీలాల్ తెలిపారు. -
పల్లె భళా.. పట్టణం డీలా
[ 16-05-2024]
పల్లె ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. పట్టణాల్లో మళ్లీ అదే పరిస్థితి.. ఎక్కువగా నిరక్షరాస్యులు ఉంటారని అనుకున్న పల్లె ప్రజలు ఓటెత్తగా.. విద్యావంతులకు నిలయంగా ఉన్న పట్టణాల్లో ఓటు వేసేందుకు అనాసక్తి చూపిస్తున్నారని మళ్లీ రుజువైంది. -
అటకెక్కిన పరీక్షలు
[ 16-05-2024]
అక్షయ తృతీయ తిథి శుభదినంగా భావించిన రైతులు పంటల సాగుకు ముందుకెళ్తున్నారు. విత్తనాల కొనుగోళ్లు చేపడుతున్నారు. ఈ క్రమంలో రైతులు మోసపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)
-
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
-
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
-
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
-
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే