పోస్టల్ బ్యాలెట్ సద్వినియోగం చేసుకోండి ఇలా..
పోస్టల్ బ్యాలెట్ వినియోగంలో ఎన్నికల కమిషన్ కొత్త విధానానికి నాంది పలికింది. ఎ
అచ్యుతాపురం, న్యూస్టుడే: పోస్టల్ బ్యాలెట్ వినియోగంలో ఎన్నికల కమిషన్ కొత్త విధానానికి నాంది పలికింది. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా తమ ఓటుహక్కును రహస్యంగా వినియోగించుకునే నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. గతంలో ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బందికి నేరుగా పోస్టల్ బ్యాలెట్ను అందించి నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకోవాలని వెసులుబాటు కల్పించారు. దీంతో ఉద్యోగులను భయపెట్టి కొందరు, పైరవీలు చేసి మరికొందరు, తాయిలాలు అందించి ఇంకొందరు విలువైన ఓట్లును పొందేవారు. ఈదఫా ఇటువంటి అక్రమాలకు అవకాశం లేకుండా రహస్య విధానంలోనే వీరు ఓటుహక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది.
ఎన్నికల విధుల్లో ఉండే పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, బీఎల్ఓలు, సెక్టోరల్ అధికారులు, పోలీసులు, పాత్రికేయులు, వాహనాల డ్రైవర్లు, అత్యవసర సిబ్బంది, స్క్వాడ్లో పనిచేసేవారు పోస్టల్ బ్యాలెట్ను పొందడానికి అర్హులు. ఎన్నికల విధుల్లో ఉండే వారికి పోస్టల్ బ్యాలెట్ పొందడానికి ఇప్పటికే ఫాం-12 జారీ చేసింది. వీటిని పూర్తిచేసి ఉద్యోగులు వారు ఓటు హక్కు పొందిన నియోజకవర్గానికి చెందిన ఏఆర్ఓ, ఈఆర్ఓకు అందివ్వాలి. ఈఆర్ఓ, ఏఆర్ఓకు ఇవ్వడం ఇబ్బందిగా భావిస్తే మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయంలో అందించొచ్చు. జిల్లాలో 14 వేల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. వీరందరికి ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి హోదాలో కలెక్టర్ పోస్టల్ బ్యాలెట్ పొందడానికి ఫారం-12 ఎన్నికల విధులకు సంబంధించిన ఆదేశాలతోపాటు అందించారు.
మారిన ఓటు వినియోగం విధానం
గతంలో మాదిరిగా ఇంటికి బ్యాలెట్ పేపర్లును పంపించే విధానం తొలగించారు. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు ఫారం-12 అందిస్తే వారికి నిర్దేశించిన తేదీల్లో ఉద్యోగుల ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించింది. ఫారం-12 ఇచ్చిన ఉద్యోగులు నేరుగా ఫెసిలిటేషన్ కేంద్రానికి వెళ్లి ఓటుహక్కును వినియోగించుకునే సదుపాయం తీసుకొచ్చారు. ఓటుహక్కు కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రానికి వెళ్తే అక్కడ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం, ఓటు హక్కును వినియోగించుకుని బ్యాలెట్ బాక్స్లో వేయడం అంతా ఒకేసారి జరిగిపోయేలా ఏర్పాట్లు చేశారు.
అక్రమాలకు అడ్డుకట్ట.. చెల్లని ఓట్లకు స్వస్తి..
ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవడానికి గత ఎన్నికల్లో ఇబ్బందిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 56 వేల మంది ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లు చెల్లకుండా పోయాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అవగాహన లేక విలువైన ఓటును చెల్లనివిగా మార్చేసుకున్నారు. కొత్తగా తీసుకొచ్చిన విధానంతో చెల్లని ఓట్లతో పాటు పోస్టల్ బ్యాలెట్లో అక్రమాలకు అవకాశం లేకుండాపోయింది. ఉద్యోగులు రహస్యంగా ఓటు వేసుకునే సౌలభ్యం కొత్త విధానం ద్వారా వచ్చింది.
వచ్చే నెల 4, 5, 6 తేదీల్లో..
ఉద్యోగులు తమ ఓటు హక్కును నియోజకవర్గ కేంద్రాల్లో వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మే 13న సాధారణ ఎన్నికల పోలింగ్ జరగనుండగా ఉద్యోగులు మాత్రం మే 4, 5, 6 తేదీల్లో వారి ఓటు హక్కును రహస్యంగా వినియోగించుకుని ప్రమాణ పత్రంతో బ్యాలెట్ బాక్స్ల్లో వేసుకొనే అవకాశం కల్పించింది. ఈ తేదీల్లో ఎవరు ఎప్పుడు ఓటు హక్కును వినియోగించుకోవాలో అధికారులు విభాగాల వారీగా తెలియజేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జననేతనన్నావు.. జలమేదీ జగన్?
[ 04-05-2024]
బటన్లు నొక్కే జగన్కు జనాల బాధలు పట్టడం లేదు. ఈ అయిదేళ్లలో తాగునీటి పథకాలకు పార్టీ రంగులు వేసి ప్రచారం చేసుకోవాలని చూశారు తప్ప ప్రజల గొంతు తడిపే ప్రయత్నమే చేయలేదు. వైకాపా పాలనలో గ్రామాల్లో కొత్తగా నీళ్ల కుండీలను నిర్మించిందీ లేదు. -
జగన్ను ఇంటికి పంపితేనే మన్యం అభివృద్ధి
[ 04-05-2024]
అధ్వాన పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రంపచోడవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి ఎద్దేవా చేశారు. -
జగనన్న కక్ష.. అవ్వాతాతలకు శిక్ష
[ 04-05-2024]
పింఛను సొమ్ము సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేసే అవకాశం ఉన్నా తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులను బలిపశువులను చేసింది. -
వైకాపా పతనం ఖాయం
[ 04-05-2024]
త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపు తథ్యమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు, తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి దొన్నుదొర పేర్కొన్నారు. -
వైకాపా వాహనం స్వాధీనం
[ 04-05-2024]
అనుమతులు లేకుండా వైకాపా ప్రచార సామగ్రి తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎంపీడీవో, ఎన్నికల అధికారి వెంకటరావు తెలిపారు. -
తెదేపాలో భారీగా చేరికలు
[ 04-05-2024]
దామనాపల్లి, సంకాడ పంచాయతీల నుంచి వైకాపా, సీపీఎంలకు చెందిన కార్యకర్తలు భారీగా తెదేపాలోకి చేరారు. మాడెం, బంధవీధి, దొడ్డికొండరెల్లివీధి, చిన్నజడుమూరు గ్రామాలనుంచి సుమారు 200 మంది పాడేరు కూటమి అసెంబ్లీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
ఉద్యోగాలిప్పిస్తామని టోకరా
[ 04-05-2024]
ఉద్యోగాలిప్పిస్తామని గిరిజన యువతను ఇద్దరు మహిళలు మోసం చేశారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. -
పేదల పొట్టకొట్టిన జగమొండి
[ 04-05-2024]
అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్నవారి కడుపునింపడంలోనూ రాజకీయాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. ఓపక్క పేదల పక్షపాతినని ఊదరగొడుతూనే మరోవైపు అదే పేదల పొట్టకొట్టారు. -
‘జగన్కు ఒక్క అవకాశమిచ్చి అందరం మోసపోయాం’
[ 04-05-2024]
‘గత ఎన్నికల్లో జగన్ ఒక్క అవకాశం అని అడిగితే ఇచ్చి అందరం మోసపోయాం. ఈ ఐదేళ్లలో అభివృద్ధి లేదు. సంక్షేమంలో ఆశ్రిత పక్షపాతం పెరిగిపోయింది. -
తెదేపాలో చేరిన వైకాపా నాయకులు
[ 04-05-2024]
ఎలమంచిలిలోని దిమిలిరోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించనున్న నందమూరి బాలకృష్ణ సభకు తెదేపా నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కూడలిని జెండాలతో అందంగా తయారు చేశారు. -
కాంగ్రెస్తోనే ప్రత్యేక హోదా
[ 04-05-2024]
కాంగ్రెస్ గెలుపుతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవచ్చని ఆ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి సతక బుల్లిబాబు అన్నారు. మంప, రేవళ్లు పంచాయతీల్లోని గ్రామాల్లో శుక్రవారం సీపీఐ నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. -
జగనన్నా.. ఏమిటీ పింఛన్ వెతలు..
[ 04-05-2024]
పింఛన్లకోసం బ్యాంకులకు వచ్చిన వృద్ధులకు రెండో రోజు కష్టాలు తప్పలేదు. వీఆర్పురం మండలం రేఖపల్లిలో బ్యాంకు వద్ద రేఖపల్లి, జీడిగుప్పల పీహెచ్సీల వైద్యులు శిబిరం ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
-
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
-
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!