అంబులెన్స్ రాకుంటే... డయాలసిస్కు వెళ్లేదెలా..?
‘చీమలపాడు పెద్దతండాకు చెందిన కిడ్నీ వ్యాధి బాధితుడు రాంబాబు డయాలసిస్ చేయించుకునేందుకు వారానికోసారి నూజివీడు వెళ్లాల్సి ఉంటుంది. 108కి ఫోన్ చేస్తే ఒకసారి వస్తుంది.. మరోసారి రావడం లేదు. దీంతో ఆయన కుమారుడు ద్విచక్రవాహనంపై తండ్రిని
‘చీమలపాడు పెద్దతండాకు చెందిన కిడ్నీ వ్యాధి బాధితుడు రాంబాబు డయాలసిస్ చేయించుకునేందుకు వారానికోసారి నూజివీడు వెళ్లాల్సి ఉంటుంది. 108కి ఫోన్ చేస్తే ఒకసారి వస్తుంది.. మరోసారి రావడం లేదు. దీంతో ఆయన కుమారుడు ద్విచక్రవాహనంపై తండ్రిని నూజివీడు తీసుకెళ్లి డయాలసిస్ చేయించి తీసుకొస్తున్నారు. ఇప్పటికే వ్యాధి చికిత్స కోసం వారు రెండెకరాల పొలం అమ్ముకున్నారు. ప్రస్తుతం డయాలసిస్ చేసే సమయంలో రూ.2 వేల ఇంజక్షన్ బయట కొనుక్కుకుంటున్నారు. దీనికే నెలకు రూ.8వేలు ఖర్చవుతోంది. మందులకు మరో రూ.8 వేల వరకూ అవుతోంది. ప్రైవేటు వాహనం బుక్ చేసుకుని వెళితే ప్రతిసారీ కనీసం రూ.1500 పైనే అవుతోంది. దీంతో వారు ద్విచక్రవాహనంపై వెళ్లి వస్తున్నారు. మరోవైపు ఈయనకు రూ.10 వేల పింఛను కూడా రాకపోవడంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు’
ఎన్టీఆర్ జిల్లాలోని ఎ.కొండూరు కిడ్నీ బాధితులు అత్యవసర సమయంలో, డయాలసిస్ చేయించుకునేందుకు ఆసుపత్రులకు వెళ్లాల్సిన సమయంలో అంబులెన్స్లు అందుబాటులో ఉండకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. గత రెండేళ్లుగా వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తండాల్లో ఉండే డయాలసిస్ బాధితులు వారానికోసారి తప్పనిసరిగా నూజివీడు, విజయవాడ ఆసుపత్రులకు వెళ్లాలి. దీంతో రవాణా ఖర్చులే భారీగా అవుతున్నాయంటూ బాధితులు చాలా కాలంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది నెలల కిందట అప్పటి వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. ఎ.కొండూరు సమస్యపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వెంటనే ప్రత్యేకంగా అంబులెన్స్లను ఏర్పాటు చేయిస్తామంటూ హామీ ఇచ్చారు. ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ హైమావతి కిడ్నీ బాధిత తండాలను పరిశీలించారు. అంబులెన్స్ల సమస్యను ఆమె దృష్టికి కూడా స్థానికులు తీసుకెళ్లారు. ఇప్పటివరకూ ఎవరూ స్పందించ లేదు. అధికారులు రావడం.. హడావుడి చేయడం.. వెళ్లడం తప్ప ప్రయోజనం ఏమీ లేదంటూ బాధితులు వాపోతున్నారు.
గతంలో ప్రైవేటు కార్లు పెట్టారు..
గత తెదేపా ప్రభుత్వ హయాంలోనూ ఇదే సమస్య ఉండగా.. స్థానిక ప్రజాప్రతినిధుల చొరవతో ప్రత్యేకంగా ప్రైవేటు కార్లను డయాలసిస్ బాధితుల కోసం ఏర్పాటు చేయించింది. ఒక్కో తండాకు ఒక రోజు కేటాయించేవారు. ఆస్పత్రికి తీసుకెళ్లి.. తిరిగి గ్రామానికి తీసుకొచ్చేవారు. ప్రభుత్వం మారగానే.. ఈ కార్లను ఆపేశారు. దీనిపై అడిగితే.. ప్రభుత్వం రూ.10 వేల పింఛన్ ఇస్తోంది కదా.. అంటూ నాయకులు, అధికారులు అంటున్నారంటూ బాధితులు వాపోతున్నారు. గతంలోనూ రూ.10వేలు పింఛన్ ఇచ్చేవారని, దాంతో పాటు కార్లు పెట్టారని పలువురు పేర్కొంటున్నారు. అప్పట్లో ట్యాంకులతో కృష్ణా జలాలను కూడా తండాలకు తెచ్చి అందించేవారని, ప్రస్తుతం వాటిని కూడా ఆపేశారని స్థానికులు తెలిపారు. ప్లాంట్ల ద్వారా శుద్ధిజలాలు అందిస్తున్నామంటూ చెబుతున్నా.. వాటిలోనూ కలుషితాలు అధికంగా ఉంటున్నాయని చెబుతున్నారు. బాధితులు చనిపోతే మట్టి ఖర్చులకు రూ.10 వేలనూ కొంతమందికి ఇస్తే.. కొందరికి ఇవ్వడం లేదు.
ఎ.కొండూరు మండలానికి చెందిన 108 వాహనం ఇతర రోగులనూ ఆస్పత్రులకు తరలించాల్సి రావడంతో కిడ్నీ బాధితులను డయాలసిస్కు తీసుకెళ్లేందుకు ఎప్పుడో కాని అందుబాటులో ఉండడం లేదు. బాధితులు ఫోన్లు చేస్తే.. పంపిస్తామంటూ కాల్సెంటర్ నుంచి చెబుతున్నారు. కానీ.. ఎంత వేచి చూసినా రావడం లేదు. ఒకవేళ వచ్చినా.. బాధితులను తీసుకెళ్లి ఆసుపత్రిలో దించేసి వెళ్లిపోతున్నారు. తిరిగి వాళ్లు వెనక్కి వచ్చేందుకు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది.
పోషకాహారమూ ఆపేశారు..
గతంలో బాధితులకు ఇచ్చిన పోషకాహారం కూడా ప్రస్తుతం ఆపేశారు. చిక్కీలు, రేషన్ బియ్యానికి బదులుగా జొన్నలు, రాగులు, సజ్జలు ఇచ్చేవారు. స్థానికంగా ఉండే గిరిజనులు రొట్టెలు ఎక్కువగా తింటారు. ఇదే విషయంలో గతంలో లక్ష్మీకాంతం కలెక్టర్గా ఉన్న సమయంలో బాధితులు చెప్పగా.. అప్పటి నుంచి బియ్యానికి బదులుగా ఇవి కావాలనే వారికి అందజేశారు. ప్రస్తుతం ఏవీ ఇవ్వడం లేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏమైనా ఇచ్చేస్తాం.. ఎంతైనా కొనేస్తాం!.. ఓట్ల కొనుగోలుకు బరితెగించిన వైకాపా
[ 02-05-2024]
ఆ నియోజకవర్గంలో ఓ సామాజిక వర్గం వారు తెదేపాకు మద్దతివ్వాలని నిర్ణయించారు. ఇది తెలిసిన వైకాపా ప్రజాప్రతినిధి అక్కడ వాలిపోయారు. అప్పటికప్పుడు రూ.10 లక్షల చెక్కు, రూ.3 లక్షలు నగదు ఇచ్చారు. తర్వాత ఓటుకు ఇంతని ఇస్తానని హామీ ఇచ్చారు. -
జనం గొంతులో.. జగన్ గరళం..!
[ 02-05-2024]
ప్రజారోగ్యం ప్రమాదంలో పడ్డప్పుడు పాలకులు ఏం చేయాలి? తాగునీరే గరళమై.. జనం ప్రాణాలనే బలి తీసుకుంటుంటే ఏం చర్యలు తీసుకోవాలి? -
నాడు జోరుమీదొచ్చారు.. నేడు జారుకున్నారు
[ 02-05-2024]
ఎన్నిక ప్రకటన ముందు ప్రజలను మభ్యపెట్టేందుకు జోగి రమేష్ పోరంకి ద్వారకా రెసిడెన్సీలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి స్వీకరించిన వినతులు బుట్టదాఖలయ్యాయి. ఆన్లైన్లో నమోదు చేసి రశీదులు ఇచ్చినా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. -
పేరు రక్షితం.. నీరు కలుషితం
[ 02-05-2024]
ప్రజలకు రోజూ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలు కావడం లేదు. చాలాచోట్ల డ్రెయిన్ల వెంబడి పైపులైన్లు ఉండడం.. లీకైన వాటిని మరమ్మతులు చేపట్టకపోవడంతో మురుగునీరు సరఫరా అవుతుందని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. -
ప్రతి పథకమూ దోపిడీ కోసమే
[ 02-05-2024]
రాష్ట్రంలో ఐదేళ్లలో అమలు చేసిన ప్రతి పథకాన్నీ తన దోపిడీకి అనుగుణంగా మార్చుకున్న జగన్, అతని టీంకు మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పి ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ కోరారు. -
ఈ ప్రశ్నకు జవాబు చెప్పు?
[ 02-05-2024]
‘నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి చేస్తున్నాం.. విద్యార్థులకు ఆంగ్లమాధ్యమంలో బోధనతో పాటు, టోఫెల్, స్లాష్, క్లాస్రూం ఎస్సెస్మెంట్ పరీక్షలు చేపడుతూ వారి సామర్థ్యాన్ని ఏ ప్రభుత్వం చేయలేని పద్ధతిలో పెంపొందిస్తున్నాం’ -
‘రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్’
[ 02-05-2024]
మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర అభివృద్ధిని సర్వనాశనం చేసిన ఘనుడు జగన్మోహన్రెడ్డి అని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. -
వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపుదాం
[ 02-05-2024]
వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపాలని కూటమి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని శింగరాయపాలెం, బల్లిపర్రు, కాకర్లమూడి, మడక, అచ్చయ్యవారిపాలెం, పుల్లపాడు తదితర గ్రామాల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. -
చీకటి పాలన నుంచి విముక్తులవుదాం: కొల్లు
[ 02-05-2024]
ఐదేళ్ల చీకటి పాలన నుంచి విముక్తులయ్యేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, తెదేపా అభ్యర్థి కొల్లు రవీంద్ర కోరారు. -
దళిత వ్యతిరేకి జగన్: జవహర్
[ 02-05-2024]
దళిత వ్యతిరేకి జగన్మోహన్రెడ్డికి తగు రీతిన బుద్ధి చెప్పేందుకు అందరూ సంఘటితం కావాలని మాజీ మంత్రి, తెదేపా నాయకులు కేఎస్ జవహర్ కోరారు. -
సంక్షేమ పాలన తెదేపాతోనే సాధ్యం
[ 02-05-2024]
కూటమి విజయాన్ని ఎవరూ ఆపలేరని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ అన్నారు. పెడన మండలం నందమూరు, జింజేరు, జింజేరు గౌడపాలెం గ్రామాల్లో బుధవారం -
తెదేపా అభ్యర్థులకు ఘన స్వాగతం
[ 02-05-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్, బందరు జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిల విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం రాత్రి వరకు ఉయ్యూరులో బైక్ ర్యాలీ జరిగింది. -
వైకాపా కుక్కర్ కూపన్ల కేసు కంచికే..!
[ 02-05-2024]
అజిత్సింగ్నగర్ తోటవారివీధిలోని లక్కీ క్వాలిటీ ప్రింటర్స్లో ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్న వైకాపా కుక్కర్ కూపన్ల కేసు.. కంచికి చేరింది. -
వైద్యుడి కుటుంబం మృతి కేసులో విచారణ వేగవంతం
[ 02-05-2024]
పటమట పరిధిలో వైద్యుడు శ్రీనివాస్ కుటుంబం మృతి కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసును సీపీ స్వయంగా పర్యవేక్షిస్తుండంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేసి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. -
వెలంపల్లికి చేదు అనుభవం
[ 02-05-2024]
సెంట్రల్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావుకు మద్యం మత్తులో ఉన్న వ్యక్తి నుంచి చేదు అనుభవం ఎదురైంది. బుధవారం ఆయన 23, 62 డివిజన్లలో పర్యటించారు. -
కొడాలి నానిని నిలదీసిన గ్రామస్థులు
[ 02-05-2024]
వలివర్తిపాడు గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) బుధవారం ఎన్నికల ప్రచారం చేస్తుండగా..పలువురు మహిళలు ఆయన్ను తమ గ్రామంలో సమస్యలు పరిష్కరించలేదంటూ నిలదీశారు.