logo

తల్లిపై కుమారుడి హత్యాయత్నం

మండలంలోని ఐతవరంలో ఆస్తి విషయంపై తల్లిపై కుమారుడు కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. సీఐ హనీష్‌ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాగంటి ఉమామహేశ్వరి భర్త ఆరేళ్ల కిందట మృతి చెందారు.

Published : 22 Apr 2024 05:06 IST

నందిగామ: మండలంలోని ఐతవరంలో ఆస్తి విషయంపై తల్లిపై కుమారుడు కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. సీఐ హనీష్‌ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాగంటి ఉమామహేశ్వరి భర్త ఆరేళ్ల కిందట మృతి చెందారు. అప్పటి నుంచి ఆమె హోటల్‌ నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఆమె కుమారుడు నరేష్‌కు వివాహమైంది. పని చేయకుండా ఖాళీ ఉంటున్నాడు. అందుకు తల్లి మందలించింది. అయినా ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదు. చెడు వ్యసనాలకు లోనై తరచూ తల్లితో గొడవ పడుతున్నాడు. కుమారుడి వల్ల ఆస్తి పోతోందని భావించిన తల్లి, ప్రస్తుతం కుమారుడు ఉంటున్న ఇల్లు ఖాళీ చేయమని చెప్పింది. కొడుకు వినకపోవడంతో కోర్టు నుంచి నోటీసులు ఇప్పించింది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి తల్లిపై కుమారుడు కత్తితో దాడి చేశాడు. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో విజయవాడలోని వైద్యశాలకు తరలించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని