వంతెన నిర్మాణాన్ని విస్మరించిన జగన్ సర్కార్
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు. తెదేపా హయాంలో తలపెట్టిన పనుల్ని ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఉరవకొండ మండలం కైకుంట్ల నుంచి వై.రాంపురం మార్గంలో హంద్రీనీవా
సొంత నిధులతో చేపట్టిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్
నాలుగన్నరేళ్లుగా పిల్లర్ల దశలోనే కౌకుంట్ల-వైరాంపురం గ్రామాల మధ్య వంతెన (పాత చిత్రం)
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు. తెదేపా హయాంలో తలపెట్టిన పనుల్ని ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఉరవకొండ మండలం కైకుంట్ల నుంచి వై.రాంపురం మార్గంలో హంద్రీనీవా ప్రధాన కాలువపై తెదేపా హయాంలో చేపట్టిన వంతెన నిర్మాణాన్ని వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. గతంలోనే 70 శాతం నిర్మాణం పూర్తి కాగా.. ఈ ఐదేళ్లలో అడుగు కూడా ముందుకు పడలేదు. ఉరవకొండ నుంచి కళ్యాణదుర్గం వెళ్లాలంటే ఇదే ప్రధాన మార్గం. వంతెన నిర్మాణం మధ్యలో ఆగిపోవడంతో వాహనదారులు, ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర అవస్థ పడ్డారు. భారీ వాహనాలు సైతం ఇదే మార్గంలో వెళ్తుండటంతో కట్ట బలహీనంగా మారింది. కాలువ పక్కనే ప్రత్యామ్నాయ దారి ఏర్పాటు చేయడంతో ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం సాగించాల్సిన దుస్థితి నెలకొంది. మిగిలిన 30 శాతం పనుల్ని పూర్తి చేస్తే వాహనదారులకు సౌకర్యంగా ఉండేది. అటు ప్రభుత్వం.. ఇటు నియోజకవర్గంలో అన్ని తానై వ్యవహరిస్తున్న వైకాపా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి వంతెనను గాలికొదిలేశారు. ప్రజల ఇబ్బందులు చూడలేక ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సొంత నిధులతో నిర్మాణాన్ని చేపట్టారు. వైకాపా ప్రభుత్వంలో బిల్లులు రాకపోవడంతో గుత్తేదారు పనులు నిలిపివేసిన విషయాన్ని ముందుగా గుర్తించారు. సదరు గుత్తేదారుకు వంతెన నిర్మాణం కోసం అవసరమైన సిమెంటు, కంకర, ఇనుము అందించారు.
ఈనాడు, అనంతపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నదమ్ముల ఘర్షణ.. ఒకరు మృతి
[ 03-05-2024]
గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. -
వైకాపా కుట్రకు పండుటాకుల విలవిల
[ 03-05-2024]
ఎన్నికల్లో లబ్ధి కోసం జగన్ ప్రభుత్వం చేసిన కుట్రకు పింఛనుదారులు బలవుతున్నారు. గురువారం మండుటెండలో బ్యాంకుల వద్ద బారులు తీరారు. బ్యాంకింగ్ సేవలపై అవగాహన లేకపోవడంతో చాలామంది ఇబ్బంది పడ్డారు. -
సహజ వనరు.. అడ్డంగా మేశారు
[ 03-05-2024]
వైకాపాలోని ఇసుకాసురులు బకాసురుడిని మించిపోయారు. ఇసుకను అమాంతం మింగేస్తున్నారు. నదీతీరాలను నామరూపాల్లేకుండా చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇసుక అక్రమ రవాణా సాగిస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారు. -
‘జగన్ కుయుక్తులు తిప్పికొట్టండి’
[ 03-05-2024]
జగన్ తిరిగి అధికారంలోకి రావడానికి నానా కుయుక్తులు పన్నుతున్నాడని, ముస్లిం మైనార్టీలు తిప్పికొట్టాలని శాసనమండలి మాజీ ఛైర్మన్ మహమ్మద్ షరీఫ్, తెదేపా మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహమ్మద్ పిలుపునిచ్చారు. -
ఓపీఓలు ఓటేసేది ఎక్కడ?
[ 03-05-2024]
గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ కోసం రికార్డు స్థాయిలో ఫాం-12 దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఈనెల ఒకటో తేదీతో ఫాం-12 దరఖాస్తు చేసుకోడానికి తుది గడువు ముగిసింది. -
తెదేపా హయాంలో నీరు.. వైకాపా పాలనలో కన్నీరు
[ 03-05-2024]
ఘన చరిత్ర కలిగిన కణేకల్లు శ్రీచిక్కణ్ణేశ్వర వడియార్ చెరువుకు భద్రత కరవైంది. రైతుల కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు గొప్పలు చెబుతున్న జగన్ సర్కారు ఐదేళ్లుగా చెరువు అభివృద్ధి, నిర్వహణకు చిల్లిగవ్వ ఇవ్వలేదు. -
రూ.2 వేల కోట్ల నగదు పట్టివేత
[ 03-05-2024]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పామిడి మండలంలోని గజరాంపల్లి గ్రామ 44వ జాతీయరహదారిపై వాహనాలను తనిఖీ చేస్తుండగా నాలుగు కంటైనర్లు వరుసగా వెళ్లడంతో అనుమానం వచ్చి పోలీసులు తనిఖీ చేశారు. -
వలస జీవులు.. వేదన బతుకులు
[ 03-05-2024]
పరిశ్రమలు తీసుకొస్తాం.. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం.. స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని 2019 ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్ చేసిన వాగ్దానాలన్నీ బూటకమేనని తేలిపోయింది. -
చెరువులకు కృష్ణా జలాలు తీసుకువస్తాం
[ 03-05-2024]
కరవు కోరల్లో చిక్కుకున్న రైతులను ఆదుకునేందుకు వైకాపా ప్రభుత్వానికి చేతులు రాలేదని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆయన ఉరవకొండ మండలం కోనాపురం, చిన్నముష్టూరు, లత్తవరం, లత్తవరం తండా, షేక్షానుపల్లి తదితర గ్రామాల్లో రోడ్షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగన్ అధర్మ పాలనను తరిమికొట్టాలి
[ 03-05-2024]
ధర్మ మార్గాన్ని అనుసరించిన బసవేశ్వరుడి స్ఫూర్తితో అధర్మానికి నిలువెత్తు రూపం జగన్ పాలనను తరిమికొట్టి, ధర్మానికి మారుపేరైన చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు వీరశైవులంతా సమాయత్తం కావాలని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. -
నీరివ్వడంలో జగన్ ప్రభుత్వం కాలయాపన
[ 03-05-2024]
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బీటీపీ కాలువ పనులు ఆపి ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం కాలయాపన చేసిందని, భూములు కోల్పోయిన కొంత మంది రైతులకు మాత్రమే పరిహారం ఇచ్చి చేతులు దులుపుకొందని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. -
రాప్తాడు నుంచే మార్పు మొదలు: సునీత
[ 03-05-2024]
ప్రజలంతా ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారు. దాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. ఆ మార్పు రాప్తాడు నియోజకవర్గం నుంచే మొదలైందని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. -
ఎంత పని చేశావమ్మా?
[ 03-05-2024]
మండలంలోని కల్లుదేవనహళ్లి గ్రామంలో ఓ తల్లి బిడ్డకు విషమిచ్చి, తాను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
అక్షరాలా మాట తప్పి.. నిస్సిగ్గుగా మడమ తిప్పి
[ 03-05-2024]
మాట తప్పను.. మడమ తిప్పను అని ఊదరగొట్టి ప్రజలను మోసం చేసిన జగన్.. నిత్యం ప్రజారక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించే రక్షకభటులకు అరచేతిలో స్వర్గం చూపించాడు. -
ఉన్నాయా కళ్లు.. ఏంచేశారు.. ఐదేళ్లు?
[ 03-05-2024]
నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీల ప్రభుత్వమని సీఎం జగన్ గొప్పలు చెబుతారు. అలాంటి ఆర్భాటపు ముఖ్యమంత్రి నోరు మూయించే చిత్రమిది. -
మడకశిరలో తెదేపాదే విజయం
[ 03-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాలమేరకు నామినేషన్ ఉపసంహరించుకున్నామని, మడకశిర అభ్యర్థి ఎంఎస్ రాజును అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మాజీ ఎమ్మెల్యే ఈరన్న తెలిపారు. -
ప్రచార లోపం.. ఓటెక్కడ వేయాలో గందరగోళం
[ 03-05-2024]
జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ వినియోగం కోసం ఫాం-12 దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు ముగిసింది. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు 16,150 మంది ఉద్యోగులను నియమించారు. -
వంద పడకలన్నారు.. హామీతో సరిపెట్టారు..
[ 03-05-2024]
ధర్మవరం ప్రభుత్వాసుపత్రిలో రోగులను మంచాల కొరత వేధిస్తోంది. ఆసుపత్రిలో రోగులకు సరిపడా పడకలు లేకపోవడంతో ఒకదానిపైనే ఇద్దరు, ముగ్గురికి చికిత్సలు అందించాల్సిన దుస్థితి నెలకొంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత కంపెనీపై దిల్లీ హైకోర్టుకు టెస్లా.. కారణం ఇదే..
-
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్