అక్షరాలా మాట తప్పి.. నిస్సిగ్గుగా మడమ తిప్పి
మాట తప్పను.. మడమ తిప్పను అని ఊదరగొట్టి ప్రజలను మోసం చేసిన జగన్.. నిత్యం ప్రజారక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించే రక్షకభటులకు అరచేతిలో స్వర్గం చూపించాడు.
కాగితాలకే పరిమితమైన ‘వీక్లీ ఆఫ్’
రక్షకభటులకు మొండిచేయి
అనంత నేరవార్తలు, న్యూస్టుడే: మాట తప్పను.. మడమ తిప్పను అని ఊదరగొట్టి ప్రజలను మోసం చేసిన జగన్.. నిత్యం ప్రజారక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించే రక్షకభటులకు అరచేతిలో స్వర్గం చూపించాడు. అలవి కాని హామీలిచ్చి మొండి చేయి చూపాడు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలీసులకు వారాంతపు సెలవు అమలు పరుస్తామని హామీ ఇచ్చాడు. వైకాపా అధికారం చేపట్టాక ప్రారంభంలో కొన్ని నెలలపాటు అరకొరగా అమలు పరిచి.. తర్వాత పూర్తిగా ‘వీక్లీ ఆఫ్’కు మంగళం పాడారు.
అవస్థలు చూడలేదు..
అసాంఘిక శక్తులను కట్టడి చేయడంలో, పండగ వేళల్లో పోలీసులు అదనపు బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి ఏఎస్సైల నుంచి కానిస్టేబుల్ దాకా ఉంది. కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై వరకు వీక్లీ ఆఫ్ వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం 2019 జూన్లో ఉత్తర్వులు ఇచ్చింది. స్టేషనులోని మొత్తం సిబ్బందిలో ప్రతి 7 మందిలో ఒకరికి చొప్పున ప్రతిరోజూ సెలవు. ‘పోలీసులకు ‘వీక్లీ ఆఫ్’ ప్రకటిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అమలు చేస్తున్నాం’.. అంటూ సీఎం నుంచి మంత్రుల వరకు ఆర్భాటంగా ప్రకటించారు. ఈ ఉత్తర్వులకు రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్నా క్షేత్రస్థాయిలో అతీగతీ లేదు. ప్రస్తుతం ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. సిబ్బంది తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. శాంతి భద్రతలు, ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్.. ఇలా అన్ని ప్రధాన విధులు నిర్వర్తించాల్సి ఉంది.
అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బంది తీవ్రం
‘‘మేమూ అందరిలాంటి మనుషులమే.. మాకూ కుటుంబం, పిల్లలు ఉంటారు. ఇంట్లో ఎవరికి ఆరోగ్యం బాగా లేకున్నా, అత్యవసర సమయాల్లో సైతం సెలవు పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ సెలవు దొరికినా గంటల వ్యవధిలోనే తిరిగి విధుల్లోకి చేరుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. వారంలో ఒకరోజు సెలవు లేకపోతే ఎలా? ప్రభుత్వం ప్రకటించిన ‘వీక్లీ ఆఫ్’ ఏమైందో తెలియదు. సిబ్బంది పూర్తిస్థాయిలో ఉన్నచోట.. స్టేషన్ అధికారి దయపైనే వారాంతపు సెలవు ఆధారపడి ఉంటోంది. మామూలు పరిస్థితుల్లో సైతం వారాంతపు సెలవు దొరకడం గగనమవుతోంది’ పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ కానిస్టేబుల్ ఆవేదన ఇది.
3,170 మంది సెలవుకు దూరం
ఉమ్మడి జిల్లాలో 3,300 పైగా పోలీసులు వివిధ స్థాయిల్లో పని చేస్తున్నారు. ఎస్పీ సహా ,నలుగురు ఏఎస్పీలు, 12 మంది డీఎస్పీలు, 52 మంది సీఐలు , 149 ఎస్సైలు ఉన్నారు. వీరిలో వారాంతపు సెలవులకు అర్హులుగా 225 మంది ఏఎస్సైలు, 565 మంది హెడ్కానిస్టేబుళ్లు, 1,600 మంది కానిస్టేబుళ్లు, 780 మందికి పైగా ఏఆర్ సిబ్బంది ఉన్నారు. సున్నితమైన జిల్లా కావడంతో పని ఒత్తిడి అధికంగా ఉంటోంది. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారు. కొవిడ్ విధుల్లో ఉమ్మడి జిల్లాలో 818 మంది పోలీసులు కరోనా బారిన పడగా, అందులో 9 మంది మృతి చెందారు. విధుల్లో ఉన్నవారికి వేళకు తిండి, నిద్ర ఉండటం లేదు. శారీరకంగా, మానసికంగా అలసిపోతున్నారు. చాలా మంది చక్కెర వ్యాధి, గుండె జబ్బులు, మూత్రపిండాలు, కీళ్ల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. నిరంతర డ్యూటీలతో సమయానికి సెలవులు లేక, కుటుంబాలకు దూరంగా ఉండలేక మానసికంగా కుంగిపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరాచకం.. నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం
[ 17-05-2024]
జిల్లా పోలీసు అధికారి అమిత్ బర్దార్పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. శాఖాపరమైన విచారణకూ ఆదేశించింది. -
నిరీక్షించి.. ఉక్కపోతతో సొమ్మసిల్లి
[ 17-05-2024]
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సేవలు పొందేందుకు వస్తున్న రోగుల అవస్థలు అన్నీ ఇన్నీకావు. గతంలో ఉన్న ఓపీ కౌంటర్లను అత్యవసర విభాగం వద్ద ఉన్న ఒక రేకుల షెడ్డులోకి మార్పు చేశారు. -
వస్తోంది ఖరీఫ్ సీజన్.. ఏదీ విత్తన కేటాయింపు?
[ 17-05-2024]
జూన్ ఒకటో తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతోంది. జిల్లాలో ప్రధాన పంట వేరుసెనగ. ఇప్పటికే వేరుసెనగ కాయలు శుద్ధిచేసి మండల కేంద్రాల్లోని గోదాముల్లో భద్రపరిచి, కావాల్సిన రైతుల పేర్లు నమోదు చేయాల్సి ఉంది. -
విచక్షణారహిత దాడులు అమానుషం: రామకృష్ణ
[ 17-05-2024]
జిల్లా సీపీఐ, ఏఐటీయూసీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గురువారం ప్రకటనలో ఖండించారు. -
డీఎస్పీ చైతన్యపై హత్యాయత్నం కేసు పెట్టాలి: తెదేపా
[ 17-05-2024]
తాడిపత్రిలో తెదేపా నాయకులు, కార్యకర్తలపట్ల అత్యంత కిరాతకంగా వ్యవహరించిన డీఎస్పీ చైతన్యపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ డిమాండ్ చేశారు. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ఠ భద్రత
[ 17-05-2024]
అనంత జేఎన్టీయూ భవన సముదాయంలో భద్ర పరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూంలను కలెక్టర్ వినోద్కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. -
వేసవిలో చల్లని సేవ
[ 17-05-2024]
వేసవిలో ఎండలు మండుతున్నాయి. చిన్నారులతో మొదలు పండుటాకుల వరకు వేడికి తట్టుకోలేకపోతున్నారు. -
పేద మహిళలకు జీవనోపాధి కల్పనే లక్ష్యం
[ 17-05-2024]
పేద మహిళలకు జీవనోపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమని నాబార్డు డీజీఎం అనురాధ పేర్కొన్నారు. అనంతపురం గ్రామీణం చంద్రబాబు కొట్టాలలో కార్డు ఆధ్వర్యంలో పేద మహిళలకు.. -
విద్యుత్తు కార్యాలయంలో ఎస్ఈ జన్మదిన వేడుకలు
[ 17-05-2024]
విద్యుత్తుశాఖ ఎస్ఈ సురేంద్ర జన్మదిన వేడుకలను అనంతపురం విద్యుత్తుశాఖ ప్రధాన కార్యాలయం ఎస్ఈ ఛాంబర్లో నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. -
రైల్వే కంట్రోల్ కార్యాలయం.. సేవలు పూజ్యం
[ 17-05-2024]
రైళ్ల రాకపోకలను నియంత్రించడంలో ప్రధాన భూమిక పోషించేది కంట్రోల్ కార్యాలయం. గుంతకల్లు డివిజన్ గుండా వెళ్లే రైళ్లను లోకోపైలెట్లు ఎక్కడ వాటిని ఎక్కడ నిలపాలి అనేది కంట్రోల్ కార్యాలయంలో పనిచేసే కంట్రోలర్లు సూచిస్తారు. -
ఉత్సాహం ఉరకలు.. ప్రోత్సహిస్తే మెరికలు
[ 17-05-2024]
వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు చిన్నారులు, విద్యార్థులు క్రీడా శిక్షణ శిబిరాలకు వస్తున్నారు. ఆర్డీటీ క్రీడాగ్రామంలో వివిధ క్రీడాంశాలలో జోరుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
అగ్ని ప్రమాదాల నివారణ చర్యలేవీ?
[ 17-05-2024]
సోమందేపల్లి, గోరంట్ల మండలాల పరిధిలోని గుడిపల్లి, పాలసముద్రం నడుమ పారిశ్రామికవాడలో అనేక పరిశ్రమలు ఏర్పాటు అవుతూ రోజురోజుకు విస్తరిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా నేతల నుంచి ప్రాణహాని.. రక్షణ కల్పించాలని ఎస్పీని కోరిన సుధాకర్
-
స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమా హిట్టవుతుందని చెప్పలేం: సెహ్వాగ్
-
చైనాకు తగ్గి.. భారత్కు పెరిగిన విదేశీ పెట్టుబడులు : ఐరాస
-
ఏపీలో ఎన్నికల ముందు.. తర్వాత హింసపై సిట్ దర్యాప్తు
-
దేశంలో ఎన్నడూ చూడని నియంతృత్వ పాలన: కేజ్రీవాల్
-
వాళ్లు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లే: కాంగ్రెస్, ఎస్పీపై మోదీ ధ్వజం