logo

ఎంత పని చేశావమ్మా?

మండలంలోని కల్లుదేవనహళ్లి గ్రామంలో ఓ తల్లి బిడ్డకు విషమిచ్చి, తాను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Published : 03 May 2024 03:25 IST

బిడ్డకు విషం ఇచ్చి.. తాను తాగి తల్లి ఆత్మహత్యాయత్నం
ఆసుపత్రిలో చిన్నారి మృతి

బొమ్మనహాళ్‌, న్యూస్‌టుడే: మండలంలోని కల్లుదేవనహళ్లి గ్రామంలో ఓ తల్లి బిడ్డకు విషమిచ్చి, తాను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. తిప్పయ్య కుమార్తె అశ్వినిని డి.హీరేహాళ్‌ మండలం మురడి గ్రామానికి చెందిన రామాంజనేయులుకు ఇచ్చి ఆరేళ్ల కిందట వివాహం చేశారు. వీరికి 18 నెలల శశాంత ఉన్నాడు. అశ్విని కడుపు నొప్పితో బాధపడుతుంది. భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. తాను చనిపోతే బిడ్డ ఆలనాపాలన ఎవరు చూస్తారని భావించి ముందుగా కుమారుడికి విషం ఇచ్చి తర్వాత తాను తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరిని కుటుంబ సభ్యులు బళ్లారి విమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం శశాంత మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. అశ్వినిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బొమ్మనహాళ్‌ పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని