తుది పోరుకు సై
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. సోమవారం నామపత్రాల ఉపసంహరణ ప్రక్రియ గడువు పూర్తి అయింది.
బరిలో నిలిచే అభ్యర్థులు ఖరారు
లోక్సభకు 21... అసెంబ్లీకి 113
మొత్తం 23 మంది ఉససంహరణ
జిల్లా సచివాలయం, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. సోమవారం నామపత్రాల ఉపసంహరణ ప్రక్రియ గడువు పూర్తి అయింది. అనంత లోక్సభ ఆర్ఓ/కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్, అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాల్లో సంబంధిత ఆర్ఓలు ఎక్కడికక్కడ బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. దీంతో తుది పోరుకు తెర లేచింది. ఆర్ఓల వెల్లడించిన జాబితా ప్రకారం.. అనంత లోక్సభకు 21 మంది బరిలో ఉన్నారు. ఒక్కరూ నామినేషన్ ఉపసంహరించుకోలేదు. లోక్సభకు పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో తెదేపా నుంచి అంబికా లక్ష్మినారాయణ, వైకాపా తరఫున మాలగుండ్ల శంకరనారాయణ, కాంగ్రెస్ అభ్యర్థిగా వజ్జల మల్లికార్జునతోపాటు.. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపితే మొత్తం 21 మంది పోటీలో నిలిచారు. వీరందరికి ఆర్ఓ/కలెక్టర్ వినోద్కుమార్ ఎన్నికల గుర్తులు కూడా కేటాయించారు. తుది జాబితా ఖరారు కావడంతో ప్రచార హోరు కొనసాగనుంది. మే 11వ తేదీ దాకా ఎన్నికల ప్రచారం ఉంటుంది. 13న పోలింగ్ జరగనుంది.
తాడిపత్రిలో 18, ఉరవకొండలో 11
జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు 113 మంది పోటీలో ఉన్నారు. ఉరవకొండలో మినహా తక్కిన ఏడు చోట్లా 23 మంది తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. తుది పోరులో 113 మంది నిలబడ్డారు. తాడిపత్రిలోనే ఎక్కువగా 18 మంది బరిలో ఉండటం విశేషం. తక్కువగా ఉరవకొండలో పదకొండు మంది ఉన్నారు. అనంత అర్బన్, కళ్యాణదుర్గంలో 15 మంది చొప్పన, శింగనమల, గుంతకల్లులో 14 మంది, రాయదుర్గం, రాప్తాడులో 13 మంది చొప్పున పోటీలో నిలిచారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఏకంగా 8 మంది నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అనంత అర్బన్లో ఆరుగురు, గుంతకల్లులో ముగ్గురు, శింగనమల, రాప్తాడులో ఇద్దరు ప్రకారం, కళ్యాణదుర్గం, రాయదుర్గంలో ఒక్కొక్కరు తమ పత్రాలను వెనక్కి తీసుకున్నారు. పోటీలో నిలిచిన అభ్యర్థులకు ఎన్నికల గుర్తులను కేటాయించారు.
ఆ రెండు చోట్లా.. రెండేసి ఈవీఎంలు
అభ్యర్థుల జాబితా ఖరారు కావడంతో ఎన్నికల గుర్తుల కేటాయింపు కూడా పూర్తి చేశారు. ఒక్కో ఈవీఎంలో గరిష్ఠంగా 16 మంది పేర్లు, గుర్తులు మాత్రమే కేటాయించడానికి అవకాశం ఉంది. ఇందులో 15 మంది అభ్యర్థులు, ఒక నోటా గుర్తు ఉంటాయి. ఇంత కంటే ఎక్కువ మంది ఉంటే రెండో ఈవీఎం తప్పనిసరిగా ఉంటుంది. ఈ లెక్కన జిల్లాలో అనంత లోక్సభ, తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రెండేసి ఈవీఎంలు ఉంటాయి. ఎందుకంటే.. అనంత లోక్సభ బరిలో 21 మంది, తాడిపత్రి పోటీలో 18 మంది చొప్పున ఉన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బూత్లో లోక్సభ ఈవీఎంలు రెండు, అసెంబ్లీ స్థానానికి ఒకటి ఉంటాయి. తాడిపత్రి పరిధిలో లోక్సభకు సంబంధించి రెండు, అసెంబ్లీ స్థానానికి మరో రెండు... ఇలా ఒక్క తాడిపత్రి నియోజకవర్గ పరిధిలో ప్రతి పోలింగు కేంద్రంలో నాలుగు ఈవీఎంలు ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరాచకం.. నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం
[ 17-05-2024]
జిల్లా పోలీసు అధికారి అమిత్ బర్దార్పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. శాఖాపరమైన విచారణకూ ఆదేశించింది. -
నిరీక్షించి.. ఉక్కపోతతో సొమ్మసిల్లి
[ 17-05-2024]
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సేవలు పొందేందుకు వస్తున్న రోగుల అవస్థలు అన్నీ ఇన్నీకావు. గతంలో ఉన్న ఓపీ కౌంటర్లను అత్యవసర విభాగం వద్ద ఉన్న ఒక రేకుల షెడ్డులోకి మార్పు చేశారు. -
వస్తోంది ఖరీఫ్ సీజన్.. ఏదీ విత్తన కేటాయింపు?
[ 17-05-2024]
జూన్ ఒకటో తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతోంది. జిల్లాలో ప్రధాన పంట వేరుసెనగ. ఇప్పటికే వేరుసెనగ కాయలు శుద్ధిచేసి మండల కేంద్రాల్లోని గోదాముల్లో భద్రపరిచి, కావాల్సిన రైతుల పేర్లు నమోదు చేయాల్సి ఉంది. -
విచక్షణారహిత దాడులు అమానుషం: రామకృష్ణ
[ 17-05-2024]
జిల్లా సీపీఐ, ఏఐటీయూసీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గురువారం ప్రకటనలో ఖండించారు. -
డీఎస్పీ చైతన్యపై హత్యాయత్నం కేసు పెట్టాలి: తెదేపా
[ 17-05-2024]
తాడిపత్రిలో తెదేపా నాయకులు, కార్యకర్తలపట్ల అత్యంత కిరాతకంగా వ్యవహరించిన డీఎస్పీ చైతన్యపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ డిమాండ్ చేశారు. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ఠ భద్రత
[ 17-05-2024]
అనంత జేఎన్టీయూ భవన సముదాయంలో భద్ర పరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూంలను కలెక్టర్ వినోద్కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. -
వేసవిలో చల్లని సేవ
[ 17-05-2024]
వేసవిలో ఎండలు మండుతున్నాయి. చిన్నారులతో మొదలు పండుటాకుల వరకు వేడికి తట్టుకోలేకపోతున్నారు. -
పేద మహిళలకు జీవనోపాధి కల్పనే లక్ష్యం
[ 17-05-2024]
పేద మహిళలకు జీవనోపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమని నాబార్డు డీజీఎం అనురాధ పేర్కొన్నారు. అనంతపురం గ్రామీణం చంద్రబాబు కొట్టాలలో కార్డు ఆధ్వర్యంలో పేద మహిళలకు.. -
విద్యుత్తు కార్యాలయంలో ఎస్ఈ జన్మదిన వేడుకలు
[ 17-05-2024]
విద్యుత్తుశాఖ ఎస్ఈ సురేంద్ర జన్మదిన వేడుకలను అనంతపురం విద్యుత్తుశాఖ ప్రధాన కార్యాలయం ఎస్ఈ ఛాంబర్లో నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. -
రైల్వే కంట్రోల్ కార్యాలయం.. సేవలు పూజ్యం
[ 17-05-2024]
రైళ్ల రాకపోకలను నియంత్రించడంలో ప్రధాన భూమిక పోషించేది కంట్రోల్ కార్యాలయం. గుంతకల్లు డివిజన్ గుండా వెళ్లే రైళ్లను లోకోపైలెట్లు ఎక్కడ వాటిని ఎక్కడ నిలపాలి అనేది కంట్రోల్ కార్యాలయంలో పనిచేసే కంట్రోలర్లు సూచిస్తారు. -
ఉత్సాహం ఉరకలు.. ప్రోత్సహిస్తే మెరికలు
[ 17-05-2024]
వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు చిన్నారులు, విద్యార్థులు క్రీడా శిక్షణ శిబిరాలకు వస్తున్నారు. ఆర్డీటీ క్రీడాగ్రామంలో వివిధ క్రీడాంశాలలో జోరుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
అగ్ని ప్రమాదాల నివారణ చర్యలేవీ?
[ 17-05-2024]
సోమందేపల్లి, గోరంట్ల మండలాల పరిధిలోని గుడిపల్లి, పాలసముద్రం నడుమ పారిశ్రామికవాడలో అనేక పరిశ్రమలు ఏర్పాటు అవుతూ రోజురోజుకు విస్తరిస్తోంది.