‘అరాచక పాలనకు అంతం పలకండి’
వైకాపా అరాచక పాలనకు అంతం పలికేందుకు ఎన్నికల రూపంలో అవకాశమొచ్చిందని, ప్రజలు మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి తెదేపా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు, గురజాల జగన్మోహన్ కోరారు.
ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో గురజాల జగన్మోహన్, దగ్గుమళ్ల, తెదేపా నాయకులు
చిత్తూరు(జిల్లా పంచాయతీ): వైకాపా అరాచక పాలనకు అంతం పలికేందుకు ఎన్నికల రూపంలో అవకాశమొచ్చిందని, ప్రజలు మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి తెదేపా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు, గురజాల జగన్మోహన్ కోరారు. ఆదివారం 35, 36, 37వ డివిజన్లలో వారు ఎన్నికల ప్రచారం చేశారు. నరిగపల్లిలో ఎమ్మెల్యే అభ్యర్థి జగన్మోహన్, 16, 38వ డివిజన్లలో ఆయన సతీమణి ప్రతిమ ప్రచారం చేశారు. 9వ డివిజన్ గాంధీ నగర్కు చెందిన 300 మంది వైకాపా కార్యకర్తలు జగన్మోహన్, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు సమక్షంలో, క్లస్టర్ ఇన్చార్జ్ రాజశేఖర్ ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు సి.ఆర్.రాజన్, మాజీ మేయర్ కఠారి హేమలత, మాజీ ఎమ్మెల్యే గాంధీ, నాయకులు సుబ్రి, వెంకటేష్యాదవ్, రాజశేఖర్నాయుడు, శేషాద్రినాయుడు పాల్గొన్నారు.
వడమాలపేట: తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్.. కల్లూరు, టీసీ అగ్రహారం, ఎల్ఎం కండ్రిగ, పాదిరేడు, కాయంపేటలో ప్రచారం నిర్వహించారు. ఎస్వీపురంలో పలువురు వైకాపాను వీడి తెదేపాలో చేరారు.
జీడీనెల్లూరు: జిల్లా తెదేపా యాదవ సాధికారసంఘ అధ్యక్షులు శ్రీధర్యాదవ్, జిల్లా ఎస్సీసెల్ కార్యవర్గ సభ్యులు పుష్పరాజ్.. నెల్లేపల్లె పంచాయతీలో మండల పార్టీ అధ్యక్షులు స్వామిదాస్, ఎమ్మెల్యే అభ్యర్థి థామస్ తమ్ముడు నిధి ఆధ్వర్యంలో జరిగిన బాబు స్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
థామస్ విజయానికి భాజపా తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని జిల్లా భాజపా ఉపాధ్యక్షులు మణివర్మ, రాష్ట్ర వోబీసీ కార్యవర్గ సభ్యులు సుధాకర్ అన్నారు.
పాలసముద్రం: చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి వాసునాయుడు.. ఆముదాల పంచాయతీలో ఎన్నికల ప్రచారం చేపట్టారు.
ఐరాల: ఎన్డీఏ కూటమి అభ్యర్థి మురళీమోహన్.. వైఎస్ గేటు, కస్తూరినాయనపల్లె, గోళ్లవారిపల్లె, కామినాయనపల్లెలో ప్రచారం నిర్వహించారు. మండల అధ్యక్షుడు వడ్లపాటి గిరిధర్బాబు, రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరచౌదరి, తెలుగు రైతు జిల్లా ఉపాధ్యక్షుడు హరిబాబునాయుడు, కార్యదర్శి దేవాజీ, కాణిపాకం ఆలయ మాజీ ఛైర్మన్ మణినాయుడు, నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు లత, క్లస్టర్ ఇన్ఛార్జి మురళీ, జనసేన జిల్లా కార్యదర్శి తులసీప్రసాద్ పాల్గొన్నారు.
బంగారుపాళ్యం: వైకాపాకు కంచుకోట మహాసముద్రంలో 300 మంది వైకాపా కార్యకర్తలు ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్, మండల అధ్యక్షులు జయప్రకాష్నాయుడు సమక్షంలో తెదేపాలో చేరారు. కె.ఎం.కండిగ గ్రామానికి చెందిన వైకాపా సర్పంచి ప్రవళిక, ఆమె అనుచరులు తెదేపా మండల అధ్యక్షులు, జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు కోకా ప్రకాష్నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. కల్లూరుపల్లె దళితవాడకు చెందిన 30 కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలో చేరారు.
ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాద్రావు, ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ సమక్షంలో నల్లగాండు కోటూరులో మండల అధ్యక్షులు జయప్రకాష్నాయుడు నేతృత్వంలో యువకులు, మహిళలు, విశ్రాంత ఉపాధ్యాయులు వైకాపా నుంచి తెదేపాలో చేరారు. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు రాజన్, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్, కార్యదర్శి ప్రకాష్నాయుడు, పూతలపట్టు నియోజకవర్గ పరిశీలకులు శ్రీధర్, మండల క్లస్టర్ అధ్యక్షులు ధరణినాయుడు, కార్యదర్శి జనార్థన్, ఉపాధ్యక్షులు కమల్నాథరెడ్డి పాల్గొన్నారు.
తవణంపల్లె: రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్.. మైనగుండ్లపల్లె పంచాయతీలో ప్రచారం నిర్వహించారు.
పెనుమూరు: తన తండ్రి థామస్ను గెలిపించాలని తనయుడు రాహుల్.. నాయకులతో కలిసి చిన్నమరెడ్డికండిగ, గుత్తావాండ్లఊరు, గంగుపల్లె పంచాయతీల్లో ప్రచారం నిర్వహించారు.
ఎమ్మెల్యే అభ్యర్థి థామస్ భార్య శాంతిరెడ్డి మండల తెదేపా అధ్యక్షుడు జయశంకర్నాయుడు ఆధ్వర్యంలో వివిపురంలో ప్రచారం నిర్వహించారు.
కార్వేటి నగరం: ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి శాంతారెడ్డి కేఎంపురం పంచాయతీలో ప్రచారం చేశారు.
నిండ్ర: పాదిరి దళితవాడలో యువత నందకుమార్, రఘువరన్ ఆధ్వర్యంలో వైకాపా కార్యకర్తలు, యువత అభ్యర్థి గాలి భానుప్రకాష్ సమక్షంలో పార్టీలో చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటెత్తిన చైతన్యం
[ 15-05-2024]
జిల్లా సరిహద్దు ప్రాంతమైన సత్యవేడులో రికార్డు స్థాయిలో 85.63% ఓటింగ్ నమోదు కావడం గమనార్హం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 83.25, సూళ్లూరుపేట నియోజకవర్గంలో 82.92 శాతం నమోదైంది. -
స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలు భద్రం
[ 15-05-2024]
చిత్తూరు లోక్సభతో పాటు, ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయిన ఈవీఎంలను చిత్తూరు నగరం ఎస్వీసెట్లోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. -
పల్లె ఓటర్లు పోటెత్తారు!
[ 15-05-2024]
పల్లె ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు పోటీ పడ్డారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు పోటెత్తి ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచారు. -
అంతరాలయంపై ఆలస్యమేల..!
[ 15-05-2024]
శ్రీకాళహస్తీశ్వరాలయంలో దళారుల దందాకు అడ్డుకట్ట వేసే దిశగా అంతరాలయ దర్శనం టికెట్ను అమలు చేయాలని అధికారులు, ధర్మకర్తల మండలి నిర్ణయించింది. -
ప్రచారం చేసినందుకు పంటకు నిప్పు
[ 15-05-2024]
మండలంలోని బూరుగుమాకులపల్లిలో రామేగౌడు ఇటీవల తెదేపా తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆరునెలల ముందు తెదేపా నుంచి వైకాపాలో చేరారు. -
విదేశాలకు మామిడి ఎగుమతులు
[ 15-05-2024]
అందరినీ నోరూరించే మామిడి సీజన్ ప్రారంభమైంది. జిల్లా నుంచి మామిడి కాయల ఎగుమతులు విదేశాలకు ప్రారంభమయ్యాయి. -
సర్పంచి ఇంటిపై వైకాపా మూకల దాడి
[ 15-05-2024]
మండలంలోని జగన్నాధపురం సర్పంచి రాణెమ్మ(ఇటీవల ఎన్నికలకు ముందు తెదేపాలో చేరారు) ఇంటిపై వైకాపా మూకలు దాడి చేసిన సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. -
భార్యపై కత్తితో దాడి .. పరిస్థితి విషమం
[ 15-05-2024]
భార్యపై భర్త కత్తితో కిరాతకంగా దాడి చేశాడు. మండల పరిధిలో చెన్నై బెంగళూరు జాతీయ రహదారిలోని లక్ష్మయ్యకండ్రిగ బస్సు స్టాప్లో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. -
పాశవికం..!
[ 15-05-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిని హతమార్చేందుకు వైకాపా గూండాలు మంగళవారం బరితెగించారు. శ్రీపద్మావతి వర్సిటీలో ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్రూంల వద్దకు వచ్చిన నానిని అంతమొందించేందుకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అనుచరులు యత్నించారు. -
తిరుపతి గంగజాతరకు చాటింపు
[ 15-05-2024]
తిరుపతి ప్రజల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతర మంగళవారం చాటింపుతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. -
వేసవిలో తాగనీటి ఎక్కిళ్లు
[ 15-05-2024]
వేసవిలో తాగునీటి ఎద్దడి ఎక్కువైంది. గ్రామీణ ప్రాంతాల్లో గుక్కెడు నీటికి కష్టమవుతోంది. అటు పంచాయతీ తాగునీటి పథకాలతో పాటు ఇతర పథకాలు దెబ్బతిన్నా సర్పంచులు వాటిని బాగు చేసే పరిస్థితులు లేవు. -
మాదే గెలుపు.. పందెమెంతో చెప్పు
[ 15-05-2024]
జిల్లాలో బెట్టింగుల జోరు ఎక్కువే. ఐపీఎల్ సీజన్లో జోరుగా బెట్టింగులు జరుగుతాయి. ఈ బెట్టింగులు ఒక వైపు ఉంటే.. -
నానిపై దాడి అమానుషం
[ 15-05-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి అమానుషమని తెదేపా కూటమి ఎంపీ,
తాజా వార్తలు (Latest News)
-
ఆ షూటింగ్లో రెండు భుజాలకు ఎన్నో గాయాలయ్యాయి: జాన్వీ కపూర్
-
‘కడుపులో పిండానికీ జీవించే హక్కు’ - సుప్రీంకోర్టు
-
‘మమ్ముట్టి’కి బాసటగా కేరళ నేతలు.. అసలు ఏం జరిగిందంటే?
-
గోల్ఫ్ ఆడడం, నచ్చింది తినడం.. మిస్టర్ కూల్ ‘ఫేవరెట్ ప్లేస్’ అదేనట!
-
డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీలతో సీఎస్ జవహర్రెడ్డి అత్యవసర భేటీ
-
కార్చిచ్చుల వేళ.. అగ్నిమాపక సిబ్బందికి ఎన్నికల విధులా..?