వర్షాలు తీన్మార్..ఇంటిటా బీమార్
మూడు రోజుల కిందట సీనియర్ జర్నలిస్టు ఒకరికి ఒకేసారి డెంగీ, కరోనా నిర్ధారణయ్యాయి. ప్లేట్లెట్లు తగ్గడంతో కూకట్పల్లిలోని ఓ ఆస్పత్రిలో చేరగా, స్టెరాయిడ్స్ ఇచ్చారు. మధుమేహం లేకపోయినా ఇన్సులిన్ చేశారు. దీంతో ఆయన మరో వైద్యుణ్ని ఆశ్రయించాల్సి వచ్చింది.
జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్య నిపుణులు
జ్వరం, గొంతు, ఒంటి నొప్పులతో ఇబ్బంది
ఈనాడు- సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి; ఈనాడు- హైదరాబాద్
మూడు రోజుల కిందట సీనియర్ జర్నలిస్టు ఒకరికి ఒకేసారి డెంగీ, కరోనా నిర్ధారణయ్యాయి. ప్లేట్లెట్లు తగ్గడంతో కూకట్పల్లిలోని ఓ ఆస్పత్రిలో చేరగా, స్టెరాయిడ్స్ ఇచ్చారు. మధుమేహం లేకపోయినా ఇన్సులిన్ చేశారు. దీంతో ఆయన మరో వైద్యుణ్ని ఆశ్రయించాల్సి వచ్చింది. కొందరు రోగులు సొంత వైద్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
నగరంలో 20 మందికి పైగా సివిల్ సర్వీసెస్ అధికారులు వైరల్, డెంగీ, కరోనాలతో బాధపడుతున్నారు. అస్వస్థతకు గురైన ఇతర శాఖల్లోని పలువురు అధికారులు సెలవులు పెట్టి ఇంట్లోనే చిక్సిత పొందుతున్నారు.
నగరాన్ని వీడకుండా కురుస్తున్న వర్షాలు.. చిత్తడిచిత్తడి పరిసరాలు.. విజృంభిస్తున్న దోమల వల్ల రాజధాని వాసులను వైరల్, డెంగీ జ్వరాలు వణికిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నీ కిటికిటలాడుతున్నాయి. నగరంలోని ప్రతి ఇంటిలోనూ ఏదో రకం సీజనల్ వ్యాధితో బాధపడుతున్నవారు కన్పిస్తున్నారు. ఫీవర్, గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ తదితర ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగింది. సాధారణ రోజులతో పోలిస్తే ఓపీ 20-30 శాతం పెరిగింది. వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను గుర్తించి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇస్టానుసారం యాంటీబయోటిక్స్ వాడొద్దని హెచ్చరిస్తున్నారు.
గతంలో కొవిడ్ బారినపడిన కొందరిలో రోగ నిరోధక శక్తి తగ్గడాన్ని గమనిస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ఇటువంటివారు త్వరగా వైరల్ జ్వరాల బారినపడుతున్నారు. దోమలూ అధికంగా ఉండడంతో డెంగీ విజృంభిస్తోంది. ప్లేట్లెట్స్ 50 వేల లోపునకు పడిపోతుండడంతో ఆస్పత్రులకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఇదే అవకాశంగా ప్రైవేటు ఆస్పత్రులు రూ.లక్షల గుంజుతున్నాయి.
ఎలా గుర్తించాలి.. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి
* వైరల్ ఇన్ఫెక్షన్ సోకితే తీవ్రమైన జ్వరంతోపాటు కాళ్లు, చేతులు మంటగా ఉంటాయి. చికిత్స తీసుకుంటే రెండు మూడు రోజుల్లో తగ్గుతుంది. ఆ తర్వాతా తీవ్ర నీరసం ఉంటుంది. పిల్లలు నలతగా కన్పించకుండా, డీలా పడినట్లుంటారు. ముక్కు కారటం, జ్వరం, జలుబు, గొంతునొప్పి, టాన్సిల్స్ వాయటం, దగ్గు, ఆయాసం, విరేచనాలు లక్షణాలు కన్పిస్తాయి. కరోనా సోకినా ఇలాంటి సమస్యలే ఉండడం వల్ల ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకొనేందుకు పరీక్షలు చేయించుకోవాలి. ఇంట్లో ఒకరికొస్తే అందరికీ చుట్టబెడుతుంది. 3-4 రోజులు దాటినా జ్వరం తగ్గకపోతే డెంగీ లేదా మలేరియాగా అనుమానించి, పరీక్షలు చేయించుకోవాలి. చేతి శుభ్రత అవసరం. వేడివేడి ఆహారం తినాలి. కాచి వడబోసి చల్లార్చిన నీళ్లు తాగాలి.
* జ్వరం, తలనొప్పి, విరేచనాలు, ఆకలి లేకపోవడం, వాంతులు ఉంటే టైఫాయిడ్ పరీక్ష అవసరం.
* బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లలో జ్వరం క్రమేపీ పెరుగుతూ 3, 4 రోజులకు తారస్థాయికి చేరుతుంది. చాలా నలతగా, జబ్బు పడినట్లుగా కన్పిస్తారు. ముఖకవళికలు మారిపోతాయి.
* దోమల వల్ల డెంగీ, మలేరియా జ్వరాలొచ్చే ప్రమాదం ఉంటుంది. ఇంటిచుట్టూ, పూల కుండీల్లో నీళ్లు నిల్వకుండా చూసుకోవాలి. దోమ తెరలు, సంహరణ మందులు వాడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నమో నినాదం.. కమల వికాసం
[ 11-05-2024]
వికసిత కమలాలతో.. కాషాయ రెపరెపలతో ఎల్బీ స్టేడియం పరిసరాలు కళకళలాడాయి. మైదానమంతా మోదీ నినాదమే మార్మోగింది. -
అడుగడుగునా హారతులు.. అభివృద్ధికి వరాలు
[ 11-05-2024]
అడుగడుగునా హారతులు.. బతుకమ్మ ఆటలు.. శ్రేణుల నినాదాలు.. వెరసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రోడ్షోలో ఎటుచూసినా జనసందోహమే. -
భద్రత మాది.. బాద్యత మీది
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా 100 శాతం భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు స్వేచ్ఛగా ఓటేసేలా భరోసా కల్పిస్తున్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి తెలిపారు. -
సికింద్రాబాద్ ఓటర్లు అభివృద్ధి చూశారు
[ 11-05-2024]
‘రాష్ట్ర రాజధానిలో సగం సికింద్రాబాద్ నియోజకవర్గం. ఇక్కడ నేను చేసిన అభివృద్ధి అందరికీ తెలుసు. అభివృద్ధి ఫలాలు అందుకుంటున్నారు. -
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు.. జాతీయ హోదాకు పోరాడతా
[ 11-05-2024]
‘చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఓవైపు ఆధునికతను పుణికి పుచ్చుకోవడంతోపాటు మరోవైపు వెనకబడిన ప్రాంతాల సమాహారంగా విస్తరించి ఉంది. -
ప్రలోభాలకు ఎర.. పంపకాల జాతర
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు మరో రెండు రోజులే గడువు ఉండటంతో రాజధాని పరిధిలో ప్రలోభాలకు తెర లేచింది. -
కమలం గుర్తుంచుకోండి
[ 11-05-2024]
శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో చేవెళ్ల లోక్సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి రోడ్షో నిర్వహించారు. -
తెలంగాణ గుండెచప్పుడు.. ప్రతిధ్వనించింది
[ 11-05-2024]
ఇప్పటి వరకు లోక్సభకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా ‘తెలంగాణ ప్రజా సమితి’ (టీపీఎస్) చారిత్రక విజయం నమోదు చేసుకుంది. -
భాజపా శ్రేణుల్లో నయా జోష్
[ 11-05-2024]
సార్వత్రిక ప్రచారం తుది దశలో భాగంగా శుక్రవారం ప్రధాని మోదీ హైదరాబాద్, నారాయణపేట జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. -
పాలమూరు ఆత్మగౌరవ ఎన్నికలివి
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ఇద్దరి మధ్యనో, మూడు పార్టీల మధ్యనో జరుగుతున్నవి కాదని.. పాలమూరు ఆత్మగౌరవానికి, ఈ ప్రాంత 70 ఏళ్ల వెనకబాటుతనానికి, వలస పోతున్న వారి కోసం జరుగుతున్నవని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అధోగతి: సబిత
[ 11-05-2024]
ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి విమర్శించారు. -
చేవెళ్ల సీటు సోనియాకు కానుకగా ఇస్తాం: టీఆర్ఆర్
[ 11-05-2024]
చేవెళ్ల పార్లమెంట్ సీటును గెలిపించుకుని పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కానుకగా ఇస్తామని చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల కో ఇంఛార్జి డాక్టర్ టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. -
ప్రచార పర్వం.. నేటితో పరిసమాప్తం
[ 11-05-2024]
దాదాపు నెల రోజులుగా హోరెత్తించిన సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటలతో తెర పడుతోంది. -
సొంతవారికే పంపకాల అప్పగింతలు
[ 11-05-2024]
ప్రచారం తుది అంకానికి చేరుకోవడంతో అభ్యర్థులకు ‘పంపకాల’ తలనొప్పులు మొదలయ్యాయి. -
ప్రయాణం మానుకోండి.. ప్రతిఫలం పొందండి
[ 11-05-2024]
ఏపీ నుంచి వచ్చి శేరిలింగంపల్లిలో ఉంటున్న కొందరు ఓటర్లు సొంతూరుకు ప్రయాణమయ్యారు. -
గత స్మృతులను గుర్తు చేస్తూ.. సంతోషం వ్యక్తం చేస్తూ
[ 11-05-2024]
ఆరు నెలల క్రితం చిన్నారి పాడిన పద్యాన్ని గుర్తు చేసుకొని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. -
ప్రముఖుల రాకపోకలతో బేగంపేట విమానాశ్రయంలో సందడి
[ 11-05-2024]
ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నగరానికి ప్రముఖుల రాకపోకలతో శుక్రవారం బేగంపేట విమానాశ్రయం సందడిగా మారింది. -
ఎన్నికల రోజున డ్రోన్లతో నిఘా
[ 11-05-2024]
ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ తెలిపారు. -
వైద్య సేవల్లో నర్సుల పాత్ర కీలకం
[ 11-05-2024]
వైద్య సేవల్లో నర్సుల పాత్ర కీలకమని నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. -
చీటీ వచ్చిందా.. ఏ బ్రాండు కావాలో ఇచ్చెయ్
[ 11-05-2024]
ఓటర్లకు మద్యం పంపిణీపై ఎన్నికల సంఘం దృష్టి మళ్లించేందుకు అభ్యర్థులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. -
దుర్గంచెరువు పూడ్చివేతపై ఫిర్యాదు
[ 11-05-2024]
మాదాపూర్లోని దుర్గంచెరువు ఎఫ్టీఎల్ను ఫూడ్చివేసిన ప్రాంత్రాన్ని శుక్రవారం ఇరిగేషన్ శాఖ అధికారులు పరిశీలించారు. -
జనం డబ్బుతో సినిమా నిర్మాణం
[ 11-05-2024]
చిట్టీల వ్యాపారంతో ప్రజల వద్ద రూ.కోట్లు వసూలు చేసిన దంపతులు ఆ సొమ్ముతో ఓ సినిమాను నిర్మించారు. -
గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
[ 11-05-2024]
కేపీహెచ్బీ ఠాణా పరిధిలో నాలుగు రోజుల క్రితం మహిళ మెడలోంచి గొలుసు చోరీ చేసిన ఘటనలో సాఫ్ట్వేర్ ఉద్యోగి నిందితుడని గుర్తించిన పోలీసులు.. -
ఈత కొలనులో మునిగి అయిదేళ్ల చిన్నారి దుర్మరణం
[ 11-05-2024]
వేసవి శిబిరం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు