Telangana News: అంబర్పేటలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఇంటర్బోర్డు కీలక ఆదేశాలు
అంబర్పేట పరిధిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థి టీసీ గురించి మాట్లాడుదామని...
హైదరాబాద్: అంబర్పేట పరిధిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థి టీసీ గురించి మాట్లాడుదామని ప్రిన్సిపల్ గదికి వెళ్లిన ఓ విద్యార్థి నాయకుడు తనతోపాటు తెచ్చుకున్న పెట్రోల్ మీద పోసుకున్నాడు. పక్కనే దీపం ఉండటంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. వాటిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన ప్రిన్సిపల్, పాలనా అధికారికి గాయాలయ్యాయి. బాధితులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఇంటర్ బోర్డు కార్యదర్శికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నివేదిక అందిన తర్వాత బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు..
అంబర్పేట ప్రైవేటు కళాశాల ఘటన నేపథ్యంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపవద్దని కాలేజీలకు ఆదేశాలు జారీ చేశారు. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రిన్సిపల్స్దేనని స్పష్టం చేశారు. కారణమేదైనా విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపడానికి వీల్లేదని హెచ్చరించారు.
సర్టిఫికెట్లు ఇవ్వకపోతే డీఐఈవో, ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రైవేటు కాలేజీలను తనిఖీ చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు