Fire Accident: పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

రాజేంద్రనగర్‌ పరిధి కాటేదాన్‌లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Updated : 28 Mar 2024 11:34 IST

రంగారెడ్డి: రాజేంద్రనగర్‌ పరిధి కాటేదాన్‌లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోని 3 అంతస్తులకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన సిబ్బంది బయటకు రావడంతో ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైరింజిన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు వంద మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. పై అంతస్తులో ప్యాకింగ్‌ సామగ్రి ఉందని కంపెనీ యాజమాన్యం తెలిపింది. అగ్నిప్రమాదం ధాటికి భవనం పగుళ్లతో పూర్తిగా పక్కకు ఒరిగింది. ఇంకా మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని