2వ రోజు.. 17 నామినేషన్లు
లోక్సభ ఎన్నికల్లో భాగంగా పలువురు అభ్యర్థులు శుక్రవారం నామినేషన్ పత్రాలు సమర్పించారు. రెండో రోజు మొత్తం 17 నామపత్రాలు దాఖలయ్యాయి.
సికింద్రాబాద్ స్థానానికి భాజపా అభ్యర్థిగా కిషన్రెడ్డి శుక్రవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా శ్రేణులతో ర్యాలీగా వెళ్లారు.
ఈనాడు, ఈనాడు డిజిటల్ హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్ కలెక్టరేట్, రాజేంద్రనగర్, చార్మినార్, న్యూస్టుడే: లోక్సభ ఎన్నికల్లో భాగంగా పలువురు అభ్యర్థులు శుక్రవారం నామినేషన్ పత్రాలు సమర్పించారు. రెండో రోజు మొత్తం 17 నామపత్రాలు దాఖలయ్యాయి.
- సికింద్రాబాద్ భాజపా అభ్యర్థి జి.కిషన్ రెడ్డి సికింద్రాబాద్లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి హేమంత్ పటేల్కు నామినేషన్ పత్రాన్ని అందించారు. భారాస తరఫున ఎమ్మెల్యే టి.పద్మారావు గౌడ్ నామినేషన్ వేశారు. ఆర్.గంగాధర (సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా- కమ్యూనిస్ట్) కొలిశెట్టి శివకుమార్ (యుగతులసీ పార్టీ), బీరంగంటి సునీతారాణి (సోషలిస్ట్ పార్టీ -ఇండియా), స్వతంత్ర అభ్యర్థిగా చలిక చంద్రశేఖర్ (స్వతంత్ర) నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
- హైదరాబాద్ స్థానం నుంచి అసదుద్దీన్ ఒవైసీ లక్డీకాపూల్లోని ఆర్వో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి నామపత్రం సమర్పించారు.
- చేవెళ్ల లోక్సభకు భారాస అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తరఫున భిక్షపతి నామినేషన్ దాఖలు చేశారు. బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో ఎంసీపీఐ(యూ) అభ్యర్థిగా వనం సుధాకర్, ఇండియన్ నేషనల్ లీగ్ పార్టీ అభ్యర్థిగా మహ్మద్ చాంద్పాషా నామపత్రాలు సమర్పించారు.
- మల్కాజిగిరి లోక్సభ స్థానానికి శుక్రవారం ఐదుగురు అభ్యర్థుల నుంచి ఆరు నామినేషన్లు స్వీకరించినట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థులుగా ఓరుగంటి వెంకటేశ్వర్లు, పెండ్యాల శేషసాయి వరప్రసాద్, రాజేశ్ మిశ్రా శివ్, చలిక చంద్రశేఖర్ ఒక్కొ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. వి.వి.ఎస్ నారాయణ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఇచ్చారని అధికారులు తెలిపారు
హైదరాబాద్ లోక్సభ స్థానానికి మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ నామపత్రం సమర్పించారు. శ్రేణులతో తరలివెళ్లారు.
నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో పాతబస్తీలో సందడి నెలకొంది.
జాగ్రత్తగా నింపాలి: రోనాల్డ్రాస్
నామపత్రాల దాఖలుపై అభ్యర్థులు పత్రాల్లో అడిగిన అన్ని వివరాలను జాగ్రత్తగా రాయాలని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రాస్ పేర్కొన్నారు. నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డితో కలిసి ఆయన శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నామినేషన్ దాఖలు సమయ వేళలు, దరఖాస్తులను నింపడం, ఇతర అంశాలపై పార్టీలకు సూచనలు చేశారు.
- సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంపీ స్థానాల ఎన్నికల వ్యయ పరిశీలకులు అమిత్శుక్లా, సెంథిల్కుమారన్ శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు.
దీర్ఘకాలిక సెలవులు రద్దు
ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది కొరత వల్ల దీర్ఘకాలిక సెలవులు రద్దు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఆర్వో రోనాల్డ్రాస్ ఒక ప్రకటనలో తెలిపారు. సెలవులో ఉన్న వారు వెంటనే విధుల్లో చేరాలని, విదేశీ ప్రయాణాల కు అనుమతి పొందిన వారికీ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపారు.
ప్రకటనలకు అనుమతులు తప్పనిసరి
పార్టీలు, ఎలక్ట్రానిక్ మీడియా, లోకల్ కేబుల్, సోషల్ మీడియా, ఆడియో, ఎఫ్ఎం రేడియో, బల్క్ ఎస్ఎంఎస్లు, వీడియో మెసేజ్లు, కరపత్రాల ప్రచురణ, థియేటర్ల ద్వారా ప్రకటనలకు 48 గంటల ముందు మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని రోనాల్డ్రాస్ స్పష్టం చేశారు. .
సికింద్రాబాద్ భారాస అభ్యర్థి టి.పద్మారావు నామపత్రం సమర్పించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, తలసాని శ్రీనివాస్యాదవ్, మాగంటి గోపినాథ్ ఉన్నారు. ఆర్వో కార్యాలయం నుంచి బయటకు వచ్చిన తరువాత ఇలా గెలుపు ధీమా వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
[ 02-05-2024]
: నాంపల్లికి చెందిన కిర్పాన్ కౌర్ ఖనూజా అబిడ్స్ స్లేట్ ది స్కూల్లో పదో తరగతి చదువుతోంది. మార్చి ఒకటిన ప్రీ ఫైనల్ పరీక్ష రాసి ద్విచక్ర వాహనంపై తల్లి అస్మిత్కౌర్ కలిసి ఇంటికెళ్తుండగా.. ఓ యువకుడు అడ్డొచ్చాడు. అదుపుతప్పి తల్లీకూతురు కిందపడ్డారు. -
హస్తం చెంతకా.. కమలం గూటికా?
[ 02-05-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో భాజపా, కాంగ్రెస్లు గులాబీ నేతలను తమ పార్టీలో చేర్చుకోవడానికి పోటీపడుతున్నాయి. -
వారి ఓటును వారికి వేసుకోలేరు
[ 02-05-2024]
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నివాసం రాజేంద్రనగర్ పరిధిలో ఉంటుంది. ఇది చేవెళ్ల లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఎంఐఎం నుంచి ఎవరూ నిలబడటం లేదు. -
కొత్త ఓటరు కార్డులు లేనట్టేనా ?
[ 02-05-2024]
కొత్త ఓటర్లకు ఈసారి గుర్తింపు కార్డులు లేనట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్కు మిగిలింది పది రోజులే. అయినా ఎన్నికల సంఘం ఇంకా ముద్రణ ప్రారంభించలేదనే విమర్శలొస్తున్నాయి. -
రూ.2.95 కోట్ల నగదు స్వాధీనం
[ 02-05-2024]
సరైన పత్రాల్లేకుండా బ్యాంకులకు తరలిస్తున్న రూ.1.06 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ ఎస్వోటీ డీసీపీ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. -
అక్కడ.. పోలింగ్ సిబ్బంది అందరూ మహిళలే
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికలకు నగరవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం మహిళా సిబ్బందిని నియమించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. -
ఐదొందలిస్తే అదనపు సేవ
[ 02-05-2024]
వైద్యులు ధ్రువీకరించినా.. రూ.500 ఇస్తేనే మీకు పిల్లలు పుట్టినట్టు ధ్రువీకరణ ఇస్తామంటూ అక్రమార్కులు బరితెగిస్తున్నారు. కొన్ని మీసేవ కేంద్రాలు, కొందరు జీహెచ్ఎంసీ అధికారులు జనన, మరణ ధ్రువపత్రాల జారీని అవినీతిమయం చేశారు. -
ఓటరు చీటీలు మేమే ఇస్తాం
[ 02-05-2024]
నగరంలో ఓటరు చీటీల పంపిణీ గందరగోళంగా మారింది. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికి తిరిగి వాటిని పంపిణీ చేయాల్సి ఉండగా ఆ ప్రక్రియ కొన్ని నియోజకవర్గాల్లో నేతల చేతుల్లోకి వెళ్లింది. -
ప్రచారానికి రండి.. సదుపాయాలు దండి
[ 02-05-2024]
అయ్యా! పనివాళ్లు దొరకడంలేదు. నలుగురిని పిలుస్తుంటే ఒక్కరే వస్తున్నారు. అందరూ ప్రచారానికి వెళ్లిపోతున్నారు. యజమాని..: కూలీ కంటే డబ్బులు ఎక్కువ వస్తాయా..? -
గుర్తుంచుకునేలా..
[ 02-05-2024]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ‘జనసేన’ పార్టీ గుర్తు ‘గాజుగ్లాసు’ను హైదరాబాద్లోని మూడు లోక్సభ నియోజకవర్గాల్లో చిన్న రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల అధికారులు కేటాయించారు. -
మేయర్ ఇంట్లో చొరబడిన అగంతకుడు
[ 02-05-2024]
మేయర్ ఇంట్లోకి అగంతకుడు చొరబడ్డాడు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం..ఎన్బీటీనగర్లోని మేయర్ విజయలక్ష్మి ఇంట్లోకి మంగళవారం ఓ అగంతకుడు వచ్చి నేరుగా ఆమె వ్యక్తిగత గదిలోకి వెళ్లాడు. -
చిన్నారికి అరుదైన శస్త్ర చికిత్స
[ 02-05-2024]
చిన్నారుల్లో అరుదుగా వచ్చే కాలేయ క్యాన్సర్కు చికిత్స చేసి అరుదైన ఘనత సాధించారు నిమ్స్ వైద్యులు. ఆస్పత్రి డైరెక్టర్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ సీనియర్ సర్జన్ నగరి బీరప్ప చికిత్స చేశారు. -
అమ్మాయిలా నటిస్తూ.. నగ్నచిత్రాలు పంపుతూ..
[ 02-05-2024]
బెట్టింగ్కు అలవాటుపడ్డ కుర్రాడు.. నేరస్థుడి అవతారమెత్తాడు. డేటింగ్ యాప్లో అమ్మాయిలా నటించి మోసగిస్తున్న అతడ్ని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. -
బోను వద్దకు వెళ్లి మేకను వదిలేసిన చిరుత
[ 02-05-2024]
విమానాశ్రయం రన్వే మైదానంలోకి నాలుగు రోజుల క్రితం చొరబడిన చిరుత మంగళవారం రాత్రి 10.57 గంటలకు ఓ బోను వద్దకు వచ్చింది. అందులో ఉన్న మేక జోలికి మాత్రం వెళ్లలేదు. -
ఓటర్లను మభ్యపెట్టడానికే భాజపాపై దుష్ప్రచారం
[ 02-05-2024]
ఆరు గ్యారంటీ పథకాల అమల్లో విఫలమైన కాంగ్రెస్ సర్కార్ లోక్సభ ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేలా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తారంటూ భాజపాపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆ పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్గౌడ్ మండిపడ్డారు. -
ఠాణాకు చేరిన మైనర్ల ప్రేమ
[ 02-05-2024]
ఆ బాలికకు పదిహేనేళ్లు నిండలేదు. అబ్బాయికీ 18 లోపే. వీరి మధ్య చిగురించిన ప్రేమ గర్భం వరకు వెళ్లడంతో పెద్దలకు తెలిస్తే తిడతారని ఆ బాలుడు బాలికకు గర్భవిచ్ఛిత్తి మాత్రలు వేయించాడని తెలిసింది. -
సీఎంపై ఓయూ పీఎస్లో ఫిర్యాదు
[ 02-05-2024]
ఓయూ సెలవుల విషయంలో సీఎం రేవంత్రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారాస విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి చటారి దశరథ్ ఓయూ ఠాణాలో ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ భాష సంస్కారవంతమైంది
[ 02-05-2024]
తెలంగాణ భాష ఎంత గొప్పదో పోతన, పాల్కుర్కి, దాశరథి, డా.సి.నారాయణరెడ్డి, కాళోజీలలో ప్రతిఫలిస్తుందని సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి అన్నారు -
నిమ్స్ కార్మికులకు అండగా ఉంటా
[ 02-05-2024]
నిమ్స్ ఆస్పత్రిలో పనిచేసే కార్మికులకు అండగా ఉంటానని ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. నిమ్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో బుధవారం ఆస్పత్రిలో నిర్వహించిన కార్మిక దినోత్సవంలో పాల్గొన్నారు. -
ఎన్నికల వేళ డేగ కళ్లు
[ 02-05-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖ గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటోంది. -
సీఎం సమక్షంలో కాంగ్రెస్లో చేరికలు
[ 02-05-2024]
పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో పలువురు భారాస నాయకులు, కౌన్సిలర్లు బుధవారం కాంగ్రెస్లో చేరారు. -
కోడ్ ముగిశాక హామీలన్నీ అమలు
[ 02-05-2024]
ఆరు గ్యారంటీల్లో అయిదింటిని అమలు చేశామని, మిగిలిన వాటినీ ఎన్నికల కోడ్ ముగిశాక తప్పకుండా నెరవేరుస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?